ఈరోజు నారాయణపేట జిల్లా మక్తల్ మండలం సామన్ పల్లి గ్రామంలో MGNREGA నిధులతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనం, సీసీ రోడ్డుతో పాటు నా ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన హై మాస్ట్ లైట్లను ప్రారంభించడం జరిగింది.
అలాగే, సామన్ పల్లి ప్రాథమిక పాఠశాల భవనాన్ని పరిశీలించాను. ఎప్పుడు కూలిపోతుందో తెలియని స్థితిలో ఉన్న ఈ పాఠశాల భవన పరిస్థితిపై తక్షణమే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి, నూతన భవన నిర్మాణం మరియు డ్రైనేజీ వ్యవస్థ కోసం నా వంతు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చాను.
🤝 అభివృద్ధిలో రాజకీయం వద్దు: నిధులు ఎవరి సొంత ఇండ్ల నుండి రావు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ.. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. అభివృద్ధి కోసం నేను ఎల్లప్పుడూ ముందుంటాను.
🇮🇳 మోదీ గారి నాయకత్వమే దేశానికి శ్రీరామరక్ష: అవినీతి రహిత పాలనతో దేశాన్ని నరేంద్ర మోదీ గారు ప్రగతిపథంలో నడిపిస్తున్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం లేకపోయినా, కేంద్రం నిష్పక్షపాతంగా గ్రామ పంచాయతీ భవనాలు, సీసీ రోడ్లు, ఉచిత వ్యాక్సినేషన్, జన్ ధన్ ఖాతాలు, పీఎం కిసాన్ నిధుల ద్వారా రాష్ట్రాన్ని ఆదుకుంటోంది.
❌ కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఫల్యాలు: గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి రైతులు, మహిళలు, నిరుద్యోగులను మోసం చేసింది.
🎯 మక్తల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి: మక్తల్ నియోజకవర్గానికి 12 గ్రామ పంచాయతీ భవనాలతో పాటు, 'అమృత్ 2.0' పథకం కింద చెరువుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం జరిగింది. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో మనమంతా భాగస్వామ్యులం అవుదాం.
#DKAruna #Makthal #ViksitBharat #BJP4Telangana #Narayanpet