నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఖమ్మం అత్యాచారయత్నం బాధితురాలిని పరామర్శించాను
అత్యంత అమానుషమైన దారుణానికి ఒడిగట్టిన నిందితుడిని ఉరి తీయాలి. నిందితునిపై కఠినమైన చట్టాలు ప్రయోగించి వీలైనంత తొందరగా శిక్షపడేలా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా
రాష్ట్రంలో మహిళలకు, ఆడపిల్లలకు భద్రత లేని పరిస్థితి ఏర్పడింది. మైనర్లపై రోజుకు 5 అఘాయిత్యాలు జరుగుతున్నా సరే ఈ ప్రభుత్వంలో చలనం లేదు . హోమంత్రిగానూ ఉన్న ముఖ్యమంత్రి ఇకనైనా స్పందించాలని డిమాండ్ చేస్తున్నాం. బాలికలు, మహిళల భద్రతపై రివ్యూ చేయాలి.. రాష్ట్రంలోని మహిళలు, ఆడపిల్లల భద్రతపై భరోసా ఇవ్వాలని కోరుతున్నాం
బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలి. వారికి ఇళ్లు కేటాయించటంతో పాటు ప్రతి నెల పెన్షన్ వచ్చేలా చర్యలు తీసుకోవాలి