Joined April 2017
2,513 Photos and videos
పెద్దపల్లి, ఎలిగేడు: జూన్-14 ------------------------------------------ 🏫 *నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు స్థలాల పరిశీలన... ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు* 🏢*పోలీస్ స్టేషన్ల నిర్మాణానికి అనువైన స్థలాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశం* ----------------------------------------- 🏢జిల్లాలో నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటు కోసం ప్రతిపాదించిన స్థలాలను *ప్రభుత్వ విప్ శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు* ఆదివారం పరిశీలించారు. 🏢*జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాతో కలిసి ఎలిగేడు మండలంలో ఏర్పాటు చేయనున్న నూతన పోలీస్ స్టేషన్‌కు ప్రతిపాదించిన స్థలాన్ని, పెద్దకల్వల లోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేయనున్న నూతన పోలీస్ స్టేషన్ స్థలాన్ని, పెద్దపల్లి లోని వ్యవసాయ మార్కెట్ లోని మహిళా పోలీస్ స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేయనున్న నూతన పోలీస్ స్టేషన్ స్థలాన్ని, పెద్దపల్లి లోని బంధంపల్లి గ్రామంలో ఏర్పాటు చేయనున్న రూరల్ పోలీస్ స్టేషన్ స్థలాన్ని పరిశీలించారు.* 🏢ఈ సందర్భంగా *ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ* ప్రజలకు మరింత మెరుగైన భద్రతా సేవలు అందించేందుకు నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటు అవసరమని తెలిపారు. పోలీస్ స్టేషన్ల నిర్మాణానికి సంబంధించి అనువైన స్థలాల ఎంపికపై సమగ్ర నివేదికను సోమవారం సాయంత్రం లోపు సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 🏢నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటు ద్వారా ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువవుతాయని, శాంతిభద్రతల పరిరక్షణలో ఇది కీలకంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాష్ రావు, పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి. గంగయ్య, పోలీస్ అధికారులు,సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
1
8
358
పెద్దపల్లి, జూన్ 03: ----------------------------------------- *బడిబాట కార్యక్రమం ద్వారా ప్రతి పాఠశాలలో 10 శాతం విద్యార్థుల నమోదు పెంచాలి... విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి యోగితా రాణి* *ఎఫ్‌ఎల్‌ఎన్, అకడమిక్ పనితీరులో పెద్దపల్లి జిల్లాకు అభినందనలు* *ఉపాధ్యాయుల సమీక్షలు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణతో మెరుగైన ఫలితాలు* *ఇంటర్మీడియట్, డిగ్రీ స్థాయిల్లోనూ ప్రవేశాల పెంపుపై ప్రత్యేక దృష్టి*. ----------------------------------------- బడిబాట కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి ప్రతి పాఠశాలలో కనీసం 10 శాతం మేర విద్యార్థుల నమోదును పెంచాలని విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి యోగితా రాణి సూచించారు. బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాల విద్యాశాఖ పనితీరును సమీక్షించారు. ఎఫ్‌ఎల్‌ఎన్ (Foundational Literacy and Numeracy), అకడమిక్ పనితీరు అంశాల్లో పెద్దపల్లి జిల్లా సాధిస్తున్న పురోగతి, జిల్లాలో ఉపాధ్యాయుల పనితీరుపై నిరంతర సమీక్షలు నిర్వహించడం, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుల ద్వారా పాఠశాలల అకడమిక్ పురోగతిని పర్యవేక్షించడం, క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేపట్టడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారని పేర్కొన్నారు. *ఈ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షను ప్రత్యేకంగా అభినందించారు*. బడిబాట కార్యక్రమాన్ని గ్రామాలు, వార్డుల స్థాయిలో విస్తృతంగా నిర్వహించి ప్రభుత్వ విద్యాసంస్థలలో విద్యార్థుల నమోదును పెంచాలని యోగితా రాణి సూచించారు. పాఠశాల విద్యతో పాటు ఇంటర్మీడియట్, డిగ్రీ కళాశాలల్లో కూడా ప్రవేశాల పెంపుపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పలు కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు అల్పాహార పథకం, ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ, మధ్యాహ్న భోజన పథకం వంటి కార్యక్రమాలు ఈ విద్యా సంవత్సరంలో అమలులో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సదుపాయాలపై తల్లిదండ్రులు, విద్యార్థులకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. డిగ్రీ కళాశాలల్లో నైపుణ్యాధారిత విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, విద్యార్థుల్లో ఉద్యోగ అవకాశాలను పెంపొందించే విధంగా కోర్సులు అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు. నైపుణ్యాభివృద్ధి ద్వారా యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కల్పన కుమారి, డీఈవో శారద ,తదితరులు పాల్గొన్నారు.
1
10
478
పెద్దపల్లి, జూన్ - 03: ----------------------------------------- *స్వచ్ఛ గావ్ సురక్షిత జలవాయు ప్రచార ప్రత్యేక కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలి... జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* ------------------------------------------ ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక"లో భాగంగా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2026 సందర్భంగా స్వచ్ఛ గావ్, సురక్షిత జలవాయు కార్యక్రమాలను పెద్దపల్లి జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా *కలెక్టర్ కోయ శ్రీ హర్ష* అన్నారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ ఆవరణంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ గావ్, సురక్షిత జలవాయు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జూన్ 5వ తేదీ వరకు నిర్వహించాల్సిన ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛత, సుస్థిర జీవనశైలిని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న కార్యక్రమాల జిల్లా కలెక్టర్ వివరించారు. జూన్ 2: గ్రామ పంచాయతీల పరిధిలోని కమ్యూనిటీ ఘన వ్యర్థాల నిర్వహణ ఆస్తుల స్థితిని సందర్శించి, క్షేత్రస్థాయిలో మదింపు చేయడం,సదరు వివరాలను SBM(G) IMIS పోర్టల్‌లో అప్‌లోడ్ చేయడం, జూన్ 3: గ్రామంలోని బల్క్ వేస్ట్ జనరేటర్లను (BWG) గుర్తించి, వారి జాబితాను తయారు చేయడం, జూన్ 4: అవగాహన కార్యక్రమాలు, మొక్కల పెంపకం, సామాజిక భాగస్వామ్యంతో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టడం. ఇందులో మిషన్ లైఫ్, SBM(G) 2.0 అంశాలపై అవగాహన కల్పించడం, జూన్ 5: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 'ప్రత్యేక గ్రామ సభ' నిర్వహించడం. ఈ సభలో SWM నియమాలు, వ్యర్థాల నిర్వహణ, సాధించిన పురోగతిపై చర్చించి, వివరాలను MoPR పోర్టల్‌లో నమోదు చేయడం, మిషన్ లైఫ్" థీమ్ ద్వారా వ్యర్థాల తగ్గింపు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నివారణ, నీటి సంరక్షణపై గ్రామాల్లో విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో నరేందర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కాళిందిని, బిసి అభివృద్ధి అధికారి రంగారెడ్డి, జిల్లా పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
1
308
**పెద్దపల్లి, జూన్-03** ------------------------------------------ **గ్రామసభలు, వార్డు సభల ద్వారా ప్రభుత్వ సందేశం ప్రతి ఇంటికి చేరాలి : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష** *జూన్ 4, 6, 8, 10 తేదీల్లో నిర్వహించే గ్రామసభలు, వార్డు సభల్లో ప్రజల భాగస్వామ్యం పెంచాలి* *ఎస్‌ఐఆర్ కార్యక్రమం, సూపర్ ఎల్‌నినో పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలపై సమగ్ర అవగాహన కల్పించాలి* *వడదెబ్బ మరణాల ఎక్స్‌గ్రేషియా, ఎన్‌ఎఫ్‌బీఎస్ పథకాలపై ప్రజలకు విస్తృత ప్రచారం నిర్వహించాలి* *ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్* ------------------------------------------ జిల్లాలో నిర్వహించనున్న గ్రామసభలు, వార్డు సభల ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై సందేశం ప్రతి ఇంటికి చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* ఆదేశించారు. బుధవారం ఎన్‌టీపీసీ కాకతీయ ఫంక్షన్ హాల్‌లో *అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్ )అరుణశ్రీ* తో కలిసి ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయి అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీఓలు, వ్యవసాయ, పోలీసు, వైద్య, విద్యుత్, నీటిపారుదల తదితర శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ,* గ్రామపంచాయతీలు, మున్సిపల్, పట్టణ ప్రాంతాల్లో వడదెబ్బ కారణంగా ఎవరైనా మరణిస్తే రాష్ట్ర ప్రభుత్వం రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేస్తుందని తెలిపారు. అయితే ఎక్స్‌గ్రేషియా మంజూరుకు ఎఫ్‌ఐఆర్, పోస్టుమార్టం నివేదిక, మరణ ధృవీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శులు ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (ఎన్‌ఎఫ్‌బీఎస్)ను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు. కుటుంబంలో మరణం సంభవించిన అర్హులైన కుటుంబాలకు రూ.20 వేల ఆర్థిక సహాయం అందుతుందని, మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకుంటే ఎంపీడీవో లేదా తహసీల్దార్ స్థాయిలోనే మంజూరు ప్రక్రియ పూర్తవుతుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 4, 6, 8, 10 తేదీల్లో నిర్వహించే గ్రామసభలు, వార్డు సభలను విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎస్‌ఐఆర్ కార్యక్రమం, సూపర్ ఎల్‌నినో ప్రభావం, తక్కువ వర్షపాతం పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటల సాగు, నీటి నిర్వహణ, విద్యుత్ రంగ అవసరాలపై ప్రజలకు సమగ్ర అవగాహన కల్పించాలని సూచించారు. ఎస్‌ఐఆర్ కార్యక్రమానికి సంబంధించి ప్రతి ఓటు రక్షణ, కార్యక్రమ షెడ్యూల్, సమర్పించాల్సిన పత్రాలు, దరఖాస్తు విధానం వంటి అంశాలను గ్రామసభల్లో పూర్తిస్థాయిలో వివరించాలని, ప్రజల సందేహాలను అక్కడికక్కడే నివృత్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు తక్కువ వర్షపాతం పరిస్థితుల్లో అనుసరించాల్సిన ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలపై అవగాహన కల్పించాలని సూచించారు. జూలై 15, జూలై 30, ఆగస్టు 15 నాటికి సాధారణ వర్షాలు నమోదు కాకపోతే ఏ పంటలు సాగు చేయాలనే అంశంపై దశలవారీ కార్యాచరణ ప్రణాళికలను రైతులకు వివరించాలని తెలిపారు. గ్రామసభలు కేవలం ప్రభుత్వ సిబ్బందితో నిర్వహించే కార్యక్రమాలుగా కాకుండా ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించాలని కలెక్టర్ పేర్కొన్నారు. సభల నిర్వహణ స్థలం, సమయం, ఉద్దేశ్యాన్ని ముందుగానే ప్రజలకు చేరవేసి భారీ స్థాయిలో ప్రజలను సమీకరించాలని సూచించారు.తక్కువ వర్షపాతం ఉన్నా ఆకస్మికంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున గ్రామాల్లో బ్యాకప్ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, కాలువల పూడికతీత, అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టాలని తెలిపారు. ప్రతి శుక్రవారం నిర్వహించే డ్రైడే కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం పెంచాలని, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది గ్రామసభల్లో పాల్గొని వడదెబ్బ నివారణ, వర్షాకాల వ్యాధుల నివారణ, తాగునీటి భద్రత, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని సూచించారు.గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణ అత్యుత్తమ స్థాయిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూసి మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. నీటిపారుదల శాఖ అధికారులు జిల్లాలోని చెరువుల కట్టల బలాన్ని పరిశీలించి, మరమ్మతులు అవసరమైన ప్రాంతాల్లో వెంటనే పనులు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో నరేందర్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, ఆర్డీవోలు గంగయ్య, సురేష్, ఏసీపి గోదావరిఖని రమేష్, జిల్లా స్థాయి అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీఓలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
1
1
6
423
పెద్దపల్లి, జూన్ - 02 -------------------------------------- 🔸*సంక్షేమం - అభివృద్ధి- సామాజిక న్యాయం లక్ష్యంగా ప్రభుత్వ పరిపాలన... ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు* 🔸*జూన్ 2 నుంచి కోటి 15 లక్షల కుటుంబాలకు రూ.5 లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా* 🔸**ప్రాథమిక పాఠశాల నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు నూతనంగా బ్రేక్ ఫాస్ట్ పథకం ప్రారంభం* 🔸*1,54,598 మంది రైతులకు రూ.114 కోట్ల 4 లక్షల రైతు భరోసా నిధులు జమ* 🔸*రూ.767 కోట్ల విలువైన 3,23,773 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు* 🔸*1,39,760 కుటుంబాలకు గృహజ్యోతి ద్వారా ఉచిత విద్యుత్* 🔸**ఉచిత బస్సు ప్రయాణంతో జిల్లా మహిళలకు 193 కోట్లు ఆదా* 🔸*మహిళా సంఘాలకు రూ.507 కోట్లకు పైగా బ్యాంక్ లింకేజ్ రుణాలు* 🔸*74,157 వ్యవసాయ కనెక్షన్లకు 382 కోట్ల 65 లక్షల సబ్సిడీతో 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్* 🔸*రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 14,983 మందికి ఉచిత శస్త్ర చికిత్సలు* 🔸**6451 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు 126 కోట్ల రూపాయలు విడుదల* 🔸**93 వేల 659 మంది లబ్ధిదారులకు 252.22 కోట్ల చేయూత పెన్షన్ పంపిణీ* 🔸*తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్* ------------------------------------------- ❇️సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం అనే మూడు ప్రధాన లక్ష్యాలతో తెలంగాణను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు అన్నారు. ❇️తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం పెద్దపల్లి పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి వేడుకల్లో ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉదయం పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ఆయన అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసు కవాతు నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ❇️ఈ సందర్భంగా *ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ,* తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రస్తుతం 200 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉన్న తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి ఒక ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు, 2047 నాటికి మూడు ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు పెంచే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలోని కోటి 15 లక్షల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున జీవిత బీమా రక్షణ కల్పించే “ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా” పథకాన్ని జూన్ 2 నుంచి అమలు చేస్తున్నామని తెలిపారు. కుటుంబ పోషకుడు మరణించిన సందర్భంలో కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ❇️అనంతరం సమీకృత కలెక్టరేట్ ఆవరణలోని తెలంగాణ తల్లి విగ్రహానికి *పెద్దపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణరావు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తో కలిసి* పూలమాలలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే. అరుణ శ్రీ, డిసిపి రాంరెడ్డి, డిఆర్ఓ రాజేశ్వరి, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, రామగుండం మేయర్ మహంకాళి స్వామి, పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్, నూగిళ్ల మల్లయ్య ,ఆర్డీఓ బి. గంగయ్య, కలెక్టరేట్ ఏఓ ప్రకాష్, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
2
2
5
267
పెద్దపల్లి, జూన్-02: --------------------------------------- *అగ్నివీర్ వాయు విభాగానికి ఎంపికైన యువతులు జిల్లాకు గర్వకారణం: జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* *యువశక్తి ప్రోగ్రామ్ ద్వారా యువతకు ఉజ్వల భవిష్యత్తు* *మరింత మంది యువతులు సైన్యంలో చేరేందుకు ముందుకు రావాలి* ------------------------------------- పెద్దపల్లి యువశక్తి ప్రోగ్రామ్‌లో శిక్షణ పొందిన యువతులు సిలివెరి శ్రీజ, చిప్ప శశివర్షిణి భారత సైన్యంలో అగ్నివీర్ వాయు విభాగానికి ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణమని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* తెలిపారు. అగ్నివీర్ వాయు విభాగానికి ఎంపికైన యువతులను సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ,* దేశ సేవ కోసం భారత సైన్యం, భారత వైమానిక దళంలో చేరడం ఎంతో గౌరవప్రదమైన విషయమని అన్నారు. యువశక్తి ప్రోగ్రామ్‌లో శిక్షణ పొందిన ఇద్దరు యువతులు అగ్నివీర్ వాయు విభాగానికి ఎంపిక కావడం జిల్లా యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా నుంచి మరింత మంది యువత, ముఖ్యంగా యువతులు భారత సైన్యం, వైమానిక దళం, నౌకాదళం వంటి రక్షణ రంగాల్లో అవకాశాలను సద్వినియోగం చేసుకొని దేశ సేవలో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. యువశక్తి ప్రోగ్రామ్ ద్వారా యువతకు అవసరమైన శిక్షణ, మార్గదర్శనం, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు సహాయ సహకారాలు అందిస్తూ వారి భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. యువత ఉపాధి, ఉద్యోగ అవకాశాలను సాధించేందుకు ఈ కార్యక్రమం సమర్థవంతమైన వేదికగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగాలు సాధించిన యువతుల తల్లిదండ్రులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ జిల్లా అధికారులకు, యువశక్తి ప్రోగ్రామ్ నిర్వాహకులకు, శిక్షణ అందించిన సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువశక్తి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ లెంకల మహిపాల్ రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
1
2
311
పెద్దపల్లి, జూన్-02: ----------------------------------------- గ్రామసభల ద్వారా ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలు, ఖరీఫ్ సన్నాహకాలు, పర్యావరణ పరిరక్షణ, విపత్తు నిర్వహణ తదితర అంశాలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, డీజీపీ సి.వి. ఆనంద్, వ్యవసాయ శాఖ కార్యదర్శి కె. సురేంద్ర మోహన్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య తదితర ఉన్నతాధికారులతో కలిసి హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ (ఐడీఓసీ) నుండి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, డీసీపీ రామ్ రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె. అరుణ శ్రీ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా *రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు మాట్లాడుతూ,* ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం చివరి దశకు చేరుకుందని, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కార్యక్రమం ముగింపు వేడుకలను జిల్లాల్లో ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు. జూన్ 4, 6, 8, 10 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డులు, కార్పొరేషన్ డివిజన్లలో గ్రామ, వార్డు సభలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రస్తుతం అమలులో ఉన్న పర్యావరణ కార్యక్రమాలకు అనుసంధానంగా ఈ సభలను నిర్వహించాలని పేర్కొన్నారు. గ్రామ, వార్డు సభలలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని, ఎస్.ఐ.ఆర్. కార్యక్రమంపై సమగ్ర వివరాలు తెలియజేయాలని సూచించారు. ఇరిగేషన్ శాఖకు సంబంధించిన కాలువల అభివృద్ధి, సాగునీటి పనుల పురోగతిని కూడా గ్రామ సభలలో చర్చించాలని తెలిపారు. నాలుగు రోజుల వ్యవధిలో జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో గ్రామ సభలు పూర్తయ్యేలా సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. భారీ స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం పై కొంత వ్యతిరేక ప్రచారం జరుగుతోందని, దీనిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. గ్రామ సభలలో పంటల మార్పిడి విధానంపై వ్యవసాయ శాఖ విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని, కలెక్టర్లు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రాబోయే ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఎరువుల కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఎరువుల బుకింగ్ యాప్‌పై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఎరువుల నిల్వలు, డీలర్ల గోదాములపై నిరంతర తనిఖీలు నిర్వహించాలని, నానో యూరియా వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించారు. నకిలీ విత్తనాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి జిల్లాకు విపత్తు నిర్వహణ ప్రణాళిక సిద్ధం చేయాలని, ఇందుకోసం విడుదల చేసిన నిధుల వినియోగ ధ్రువపత్రాలను వెంటనే సమర్పించాలని కలెక్టర్లను ఆదేశించారు. *పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య మాట్లాడుతూ,* రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామాలలో మురుగు కాల్వల శుభ్రత, తాగునీటి పరిరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. మొక్కల పెంపకం కార్యక్రమాలు, నీటి సంరక్షణ చర్యలు, కమ్యూనిటీ సోక్‌పిట్ల నిర్మాణంపై గ్రామసభలలో ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రణాళికలను కూడా గ్రామసభల్లో వివరించాలని సూచించారు. *వ్యవసాయ శాఖ కార్యదర్శి కె. సురేంద్ర మోహన్ మాట్లాడుతూ,* వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రాష్ట్రంలోని 21 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జిల్లాల వారీగా ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించి కందులు, జొన్నలు, ఉలవలు, మొక్కజొన్న, శనగలు, మినుములు, పెసర్లు, ఆయిల్‌పామ్, కూరగాయలు, పండ్ల తోటల సాగు వైపు రైతులను ప్రోత్సహించాలని సూచించారు. *డీజీపీ సి.వి. ఆనంద్ మాట్లాడుతూ,* గ్రామసభలు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో పోలీసు శాఖ అధికారులు అన్ని శాఖలతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మహిళల భద్రత, డ్రగ్స్ నియంత్రణ, రోడ్డు భద్రత అంశాలపై గ్రామసభల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నప్పటికీ, కురిసే వర్షాలు భారీ స్థాయిలో ఉండవచ్చని, వరదలు తదితర విపత్తులను ఎదుర్కొనేందుకు జిల్లాలు ముందస్తు సన్నద్ధతతో ఉండాలని సూచించారు.
1
3
309
పెద్దపల్లి, జూన్-01: ---------------------------------------- *90% ఫార్మర్ రిజిస్ట్రీ నమోదును లక్ష్యానికి రెండు రోజులలో చేరుకోవాలి: జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* *తక్కువ నమోదు ఉన్న క్లస్టర్లపై ప్రత్యేక దృష్టి సారించాలి* ----------------------------------------- జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు ప్రక్రియను రెండు రోజులలో 90 శాతానికి చేరుకోవాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* అధికారులను ఆదేశించారు. ఫార్మర్ రిజిస్ట్రీపై సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ,* కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమంలో పీపీబీ హోల్డర్లు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని తెలిపారు. ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా ఫార్మర్ రిజిస్ట్రీ రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రీ నమోదును 90 శాతానికి చేర్చేలా లక్ష్యాన్ని నిర్దేశించుకొని అధికారులు కృషి చేయాలని, 2 రోజులలో లక్ష్యం చేరుకోవాలని సూచించారు. ముఖ్యంగా నమోదు శాతం తక్కువగా ఉన్న క్లస్టర్లపై ప్రత్యేక దృష్టి సారించి నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, ఏడిఏ అంజని, ఏవోలు, తదితరులు పాల్గొన్నారు.
1
3
319
పెద్దపల్లి, జూన్ -01: ---------------------------------------- *రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించాలి..... జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* **అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్* --------------------------------------- రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పెద్దపల్లి జిల్లాలో వైభవంగా నిర్వహించాలని జిల్లా *కలెక్టర్ కోయ శ్రీ హర్ష* తెలిపారు. సోమవారం *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో చేస్తున్న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ,* జూన్ 2న రాష్ట్రం ఆవిర్భవించి 12 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. జూన్ 2న జరిగే అవతరణ దినోత్సవ వేడుకలకు ప్రభుత్వ విప్ శాసన సభ్యులు చింతకుంట విజయ రమణారావు ముఖ్యఅతిథిగా హాజరు అవుతారని, ఉదయం 7.45 గంటలకు ముఖ్య అతిథి కలెక్టరేట్ కు చేరుకుంటారని, ఉదయం 7.50 గంటలకు గౌరవ వందనం, ఉదయం 7.51 నుంచి 7.58 వరకు అమరవీరులకు నివాళి ఉంటుందని అన్నారు. వేడుకలలో ఉదయం 8 గంటలకు జాతీయ పతాకావిష్కరణ, జాతీయ గీతాలపన, తెలంగాణ జీతాలపన కార్యక్రమాలు ఉంటాయని , ఉదయం 8.16 నుంచి 8.20 వరకు పరేడ్ ఉంటుందని, అనంతరం ముఖ్య అతిథి తన సందేశం అందిస్తారని కలెక్టర్ తెలిపారు. అనంతరం ప్రశంసా పత్రాల పంపిణీ ఉంటుందని అన్నారు. అవతరణ దినోత్సవ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పకడ్బందిగా పూర్తి చేయాలని, సౌండ్ సిస్టం, విద్యుత్ సరఫరా, డయాజ్, టెంట్ , బ్యారికేడ్లు వంటి ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట అదనపు డీసీపీ రామ్ రెడ్డి, జిల్లా పౌర సరఫరా అధికారులు శ్రీనాథ్, శ్రీకాంత్,పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి గంగయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, తహసిల్దార్ రాజయ్య,సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
1
1
6
382
సుల్తానాబాద్, ఎలిగేడు , జూన్-1 ------------------------------------------ **ఆయిల్ పామ్ నర్సరీలో నాణ్యమైన మొక్కలు సిద్ధం చేయాలి : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష** **ప్రభుత్వ భూముల వివరాలను సమగ్రంగా సిద్ధం చేయాలి** **యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు గడువులోగా పూర్తి చేయాలి** **సుల్తానాబాద్, ఎలిగేడు మండలాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్** ----------------------------------------- ఆయిల్ పామ్ సాగు విస్తరణకు అవసరమైన నాణ్యమైన మొక్కలను సిద్ధం చేసి రైతులకు అందుబాటులో ఉంచాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ *కోయ శ్రీహర్ష* సోమవారం సుల్తానాబాద్ మండలంలోని రెబ్బల్ దేవ్‌పల్లి ఆయిల్ పామ్ ప్రైమరీ, సెకండరీ నర్సరీలను, ఎలిగేడు మండలంలోని ర్యాకల్ దేవ్‌పల్లి ప్రభుత్వ భూములను, నిర్మాణానికి సిద్ధంగా ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా రెబ్బల్ దేవ్‌పల్లి గ్రామంలో 48 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆయిల్ పామ్ నర్సరీని పరిశీలించిన కలెక్టర్, రాబోయే ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన మేర రైతులకు నాణ్యమైన మొక్కలను సరఫరా చేయాలని సూచించారు. గత సంవత్సరం 40 వేల మొక్కలను ఇతర జిల్లాలకు సరఫరా చేసినట్లు, వాటిని తిరిగి తీసుకువస్తున్నట్లు అధికారులు వివరించారు. ప్రస్తుతం 20 వేల మొక్కలు అందుబాటులో ఉన్నాయని తెలపగా, 1,000 ఎకరాలకు అవసరమైన మొక్కలను సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం ర్యాకల్ దేవ్‌పల్లి పరిధిలోని ప్రభుత్వ భూములను పరిశీలించిన కలెక్టర్, మండలంలోని ప్రభుత్వ భూములకు సంబంధించిన సంపూర్ణ వివరాలను సిద్ధం చేసి సమర్పించాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్, ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యతతో పనులు చేపట్టాలని, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ పర్యటనలో హార్టికల్చర్ అధికారులు ఎస్. మహేష్, జ్యోతి, తిరుమల ఆయిల్ పామ్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ కేశ్ కళ్యాణ్‌కర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
2
228
పెద్దపల్లి, జూన్ 01: ----------------------------------------- 📃*అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి:: జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* 📃**ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించిన జిల్లా కలెక్టర్* ------------------------------------------- 📝అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* సంబంధిత అధికారులను ఆదేశించారు. 📝సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరితో కలిసి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. 📝మంథని మండలం నాగారం గ్రామానికి చెందిన జి. లక్ష్మీ తాను నాగారం లో కిరాయికి వింటూ కూలి పని చేసుకుంటూ జీవనం గడుపుతున్నానని, తనకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పీడీ హౌసింగ్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. 📝పెద్దపల్లి మండలం అప్పన్న పేట గ్రామానికి చెందిన పద్మ ప్రస్తుతం తనకు రేషన్ దుకాణం ద్వారా సాధారణ కోట మాత్రమే లభిస్తుందని ఒంటరి మహిళలకు ప్రభుత్వం నిబంధనలు ప్రకారం నెలకు 35 కిలోల బియ్యం కార్డు కింద మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా తహసిల్దార్ పెద్దపల్లి కు రాస్తూ విచారణ జరిపి అంత్యోదయ కార్డు అర్హత మేరకు మంజూరు చేయాలని అన్నారు. 📝సుల్తానాబాద్ మండలం నారాయణరావు పల్లె గ్రామానికి చెందిన గంధం రాములు గ్రామంలోని హౌస్ నెంబర్ 5-54, లో నివాస గృహంలో ఎటువంటి నోటీసు ఇవ్వకుండా ప్రహరీ గోడను అక్రమంగా కూల్చేసారని దీనివల్ల 3,50,000 నష్టం జరిగిందని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా ఎంపీడీవో కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
1
8
275
మంథని, మే-31 ----------------------------------------- ❇️*మంథని, కాళేశ్వరం బస్టాండ్ల అభివృద్ధితో ప్రజా రవాణా సేవలు మరింత మెరుగుపడతాయి... రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్* ❇️*గోదావరి పుష్కరాలు–2027కు భారీ స్థాయిలో ప్రత్యేక రవాణా సదుపాయాలు కల్పిస్తాం* ❇️*మహిళలకు 310 కోట్లకు పైగా జీరో టికెట్లు జారీ చేశాం* ❇️*త్వరలో పెద్దపల్లి బస్ డిపో ప్రారంభం... మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు* ❇️*మంథని బస్టాండ్‌లో రూ.93 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు* ----------------------------------------- ❇️మంథని, కాళేశ్వరం బస్టాండ్ల అభివృద్ధితో ప్రజా రవాణా సేవలు మరింత మెరుగుపడతాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ❇️మంథని మున్సిపాలిటీ పరిధిలోని మంథని బస్టాండ్‌లో రూ.93 లక్షల వ్యయంతో చేపట్టనున్న అదనపు ప్లాట్‌ఫారాలు, ఇతర అభివృద్ధి పనులకు *రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* లతో కలిసి ఆదివారం శంకుస్థాపన చేశారు. ❇️ఈ సందర్భంగా *రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ,* మంత్రి శ్రీధర్ బాబు సూచనల మేరకు మంథని, కాళేశ్వరం బస్టాండ్ల అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. గోదావరి పుష్కరాలు–2027 నిర్వహణ కోసం ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని నియమించిందని, కుంభమేళాను తలపించే స్థాయిలో పుష్కరాలు నిర్వహించేందుకు సమగ్ర కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ❇️ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, గుర్తింపు సంఘాల ఎన్నికల అనంతరం కార్మిక ప్రతినిధులతో చర్చించి తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు. కార్మికులు అపోహలు నమ్మవద్దని మంత్రి సూచించారు. ❇️ *మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ,* మంథని బస్టాండ్‌లో రెండు అదనపు ప్లాట్‌ఫారాల నిర్మాణానికి రూ.74 లక్షలు, ఇతర అభివృద్ధి పనులకు రూ.19 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. కాళేశ్వరం బస్టాండ్ అభివృద్ధికి రూ.3 కోట్లు మంజూరు చేశామని, కాళేశ్వరం దేవస్థాన అభివృద్ధిలో ఆర్టీసీ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ ,రీజనల్ కరీంనగర్ మేనేజర్ రాజు, డిప్యూటీ ఆర్.యం.(ఎం) మల్లేశం, డిపో మేనేజర్ శ్రావణ్ కుమార్, ఆర్డిఓ సురేష్, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆర్టీసీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
1
10
388
మంథని, మే-31 ------------------------------------------- *విద్యార్థులకు క్రీడా, సంగీత విద్యా వసతులు అందుబాటులోకి తీసుకురావాలి : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* *రాబోయే విద్యా సంవత్సరం నాటికి సంగీత పాఠశాల ప్రారంభానికి చర్యలు* *గంగపురి ఎంపీపీ ఎస్ పాఠశాల, రావులచెరువు, అయ్యగారి చెరువులను పరిశీలించిన జిల్లా కలెక్టర్* *మంథనిలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్* --------------------------------------- విద్యార్థులకు మెరుగైన క్రీడా, సంగీత విద్యా వసతులు అందుబాటులోకి తీసుకురావాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* సంబంధిత అధికారులను ఆదేశించారు. మంథని పట్టణంలోని గంగపురి ప్రాంతంలో ఉన్న ఎంపీపీ ఎస్ పాఠశాల, పాఠశాల క్రీడా మైదానం, సంగీత పాఠశాలను *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* ఆదివారం పరిశీలించారు. అనంతరం మంథని మున్సిపల్ పరిధిలోని రావులచెరువు, అయ్యగారి చెరువులను సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ* గంగపురి ఎంపీపీ ఎస్ పాఠశాల క్రీడా మైదాన అభివృద్ధికి అవసరమైన అంచనాలను సిద్ధం చేసి త్వరితగతిన సమర్పించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు మెరుగైన క్రీడా సదుపాయాలు కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. సంగీత పాఠశాల కు అవసరమైన రెన్యువేషన్ వర్క్స్ పూర్తిచేసి రాబోయే విద్యా సంవత్సరం నాటికి సంగీత పాఠశాల ప్రారంభించే విధంగా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం రావులచెరువు, అయ్యగారి చెరువులను పరిశీలించిన కలెక్టర్, రావులచెరువు సమీపంలో ప్రజల రాకపోకలకు అనుకూలంగా రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో మంథని మున్సిపల్ కమిషనర్ మనోహర్, సంబంధిత శాఖల అధికారులు జిల్లా కలెక్టర్ వెంట పాల్గొన్నారు.
1
6
366
పెద్దపల్లి, మే-30 ---------------------------------------- 🔸*హౌస్ లిస్టింగ్ సర్వేకు ప్రజలు పూర్తి సహకారం అందించాలి : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* 🔸*వాస్తవ సమాచారాన్నే ఎన్యూమరేటర్లకు అందించాలి* 🔸*సర్వేలో ఇచ్చే సమాచారంతో సంక్షేమ పథకాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు* 🔸*క్యాంపు కార్యాలయంలో హౌస్ లిస్టింగ్ సర్వేలో పాల్గొన్న జిల్లా కలెక్టర్* ----------------------------------------- 🔸జనాభా గణన-2027లో భాగంగా నిర్వహిస్తున్న హౌస్ లిస్టింగ్ సర్వేకు ప్రజలు పూర్తి సహకారం అందించి ఎన్యూమరేటర్లకు వాస్తవ సమాచారాన్ని అందించాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* కోరారు. 🔸*జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* శనివారం తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన హౌస్ లిస్టింగ్ సర్వేలో పాల్గొని ఎన్యూమరేటర్‌కు అవసరమైన వివరాలను అందజేశారు. ఈ సందర్భంగా సర్వే ప్రక్రియను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. 🔸ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ* హౌస్ లిస్టింగ్ సర్వే జనాభా గణన-2027లో అత్యంత కీలకమైన దశ అని తెలిపారు. ప్రతి ఇంటి నిర్మాణం, గృహ సౌకర్యాలు, తాగునీటి వసతి, పారిశుద్ధ్య సదుపాయాలు, విద్యుత్, వంట ఇంధనం, కమ్యూనికేషన్ సౌకర్యాలు తదితర వివరాలను ఈ సర్వే ద్వారా నమోదు చేస్తారని చెప్పారు. సర్వే ద్వారా సేకరించే సమాచారం ప్రభుత్వ అభివృద్ధి ప్రణాళికలు, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. 🔸ఎన్యూమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు పూర్తి స్థాయిలో సహకరించి సరైన వివరాలను అందించాలని కలెక్టర్ సూచించారు. సర్వేలో అందించే సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంచబడుతుందని, ఈ సమాచారంతో ఏ సంక్షేమ పథకం రద్దు కావడం గానీ, లబ్ధిదారుల అర్హతలు ప్రభావితమవడం గానీ జరగదని స్పష్టం చేశారు. ప్రజలు ఎటువంటి అపోహలకు తావివ్వకుండా సర్వే సిబ్బందికి సహకరించాలని కోరారు. 🔸జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఎన్యూమరేటర్లు, పర్యవేక్షకులు నిబంధనల ప్రకారం ప్రతి ఇంటిని సందర్శించి వివరాలను నమోదు చేయాలని, సర్వేను పారదర్శకంగా, నాణ్యతతో నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గోన్నారు.
1
7
419
**పెద్దపల్లి, మే-30** ---------------------------------------- 📌**పెద్దపల్లి జిల్లా బాల్య వివాహాల రహిత జిల్లాగా ప్రకటన : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష** 📌**ఉల్లాస్ కార్యక్రమం ద్వారా 34,620 మంది మహిళలు అక్షరాస్యత పరీక్షల్లో ఉత్తీర్ణత** 📌**మహిళలపై అఘాయిత్యాల నిర్మూలనకు సమష్టిగా కృషి చేయాలని ప్రతిజ్ఞ** ----------------------------------------- ✴️పెద్దపల్లి జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనతో పాటు మహిళా సాధికారత, అక్షరాస్యత పెంపు కోసం చేపట్టిన కార్యక్రమాలు విశేష ఫలితాలను సాధించాయని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. ✴️99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మహిళా వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్నేహ కిశోర బాలికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్ పార్లమెంట్ కార్యక్రమంలో *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు.* ✴️ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ మాక్ పార్లమెంట్‌లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. ప్రజలతో చర్చించి, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని విధానాలను రూపొందించడమే ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్పతనమని అన్నారు. ప్రజల అభిప్రాయాలు, సూచనలు లేకుండా బలవంతంగా తీసుకువచ్చే మార్పులు ఎక్కువ కాలం నిలవవని పేర్కొన్నారు. మాక్ పార్లమెంట్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించాలని సూచించారు. ✴️పెద్దపల్లి జిల్లాలోని అన్ని మహిళా సంఘాలలో చదువు రాని మహిళలను ఉల్లాస్ కార్యక్రమం కింద నమోదు చేసి, 5 వేల మంది వాలంటీర్ల సహకారంతో అక్షరాస్యత బోధించడం జరిగిందన్నారు. మార్చి నెలలో నిర్వహించిన పరీక్షలకు 34,620 మంది మహిళలు హాజరై 100 శాతం ఉత్తీర్ణత సాధించడం జిల్లాకు గర్వకారణమని తెలిపారు. రాబోయే జూలై నెలలో మిగిలిన 35 వేల మంది మహిళలకు కూడా పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ విజయానికి కృషి చేసిన అధికారులు, వాలంటీర్లు, మహిళా సంఘాల సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ✴️*అనంతరం పెద్దపల్లి జిల్లాలోని 3 మున్సిపాలిటీలు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, 14 మండలాల పరిధిలోని 263 గ్రామ పంచాయతీలలో ఎక్కడా బాల్య వివాహాలు జరగడం లేదని ధృవీకరిస్తూ పెద్దపల్లి జిల్లాను బాల్య వివాహాల రహిత జిల్లాగా ప్రకటించారు.* ✴️మహిళలపై జరిగే అఘాయిత్యాలు, వేధింపులు, వివక్షను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మహిళల భద్రత, గౌరవ పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తామని అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కాళీందిని, జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్, అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి రవీందర్, సంబంధిత అధికారులు, స్నేహ కిశోర బాలికల సంఘం సభ్యులు, మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
2
4
1,068
పెద్దపల్లి, మే- 30: ----------------------------------------- 📃*గిరిజన యువతీ యువకులకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం.....జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* ----------------------------------------- 📃తెలంగాణ ప్రభుత్వం, గిరిజన సంక్షేమ శాఖ ద్వారా పెద్దపల్లి జిల్లాలోని అర్హులైన నిరుద్యోగ గిరిజన యువతీ, యువకులకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 📃ఈ శిక్షణా కార్యక్రమం ద్వారా యువతకు ఉపాధి మార్గాలను సుగమం చేసేందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం కింద ప్రధానంగా ఐటీఈఎస్, లాజిస్టిక్స్, టెలికాం, వ్యవసాయం గృహోపకరణ, దుస్తుల తయారీ, అందం, సంరక్షణ, టూరిజం, హాస్పిటాలిటీ, ఆటోమేటివ్, ఎలక్ట్రానిక్స్, హెల్త్ కేర్ ,వంటి రంగాలలో నైపుణ్యాలను అందించడం జరుగుతుంది. శిక్షణ అనంతరం అర్హులైన అభ్యర్థులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తామని,పెద్దపల్లి జిల్లాకు చెందిన ఆసక్తి గల నిరుద్యోగ గిరిజన యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు కోసం కరీంనగర్‌లోని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయంలో సంప్రదించవచ్చు అని పూర్తి వివరాల కోసం 9441174822 నంబరు నందు సంప్రదించాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
1
1
198
పెద్దపల్లి, మే-29 ------------------------------------ 🌾*రైతుల ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి కటింగ్ జరగొద్దు : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* 🌾*నాణ్యత పరిశీలించిన ధాన్యాన్నే రైస్ మిల్లులకు తరలించాలి* 🌾*జూన్ 2 నాటికి అన్ని కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కోనుగోలు పూర్తి చేయాలి* 🌾*ధాన్యం కోనుగోలు పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్* ------------------------------------ 🌾జిల్లాలో రైతుల ధాన్యం కొనుగోళ్ల లో ఎలాంటి కటింగ్ జరగొద్దని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* సంబంధిత అధికారులను ఆదేశించారు. 🌾శుక్రవారం కలెక్టరేట్‌లో వరి ధాన్యం కొనుగోళ్ల పై *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. 🌾ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ,* రైతుల ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి కటింగ్ జరగకూడదని స్పష్టం చేశారు. ఎవరైనా మిల్లర్లు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 🌾నాణ్యత పరిశీలించిన ధాన్యాన్ని మాత్రమే రైస్ మిల్లులకు తరలించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ కటింగ్ చేయవద్దని అధికారులకు సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన 100 శాతం ట్యాబ్ ఎంట్రీలు పూర్తి చేయాలని ఆదేశించారు. 🌾జూన్ 2 నాటికి అన్ని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేసి కేంద్రాలను మూసివేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో డీఆర్‌డీవో కలిందిని, డీసీవో శ్రీమాల, ఏపీఎంలు, ఏ.పి.ఓ.లు ,సంబంధిత అధికారులు తదితరులు ,పాల్గొన్నారు.
1
1
2
226
రామగుండం, మే-29 ------------------------------------ 🏥*రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* 🌾*రైస్ మిల్లుల వద్ద ఎలాంటి కట్టింగ్ పెట్టొద్దు* 🏫*గోదావరిఖని జనరల్ ఆసుపత్రి, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్* ------------------------------------- 🩺రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు, రైస్ మిల్లుల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* సంబంధిత అధికారులను ఆదేశించారు. 🚑*గోదావరిఖనిలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల శారద నగర్, గౌతమి నగర్‌లోని శ్రీరామ రైస్ మిల్, రాజరాజేశ్వర రైస్ మిల్లులను *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించారు. ⚡ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ* గోదావరిఖని జనరల్ ఆసుపత్రిలోని రక్ష పరీక్ష కేంద్రంలో సమయం ముగిసిందని ఏ రోగిని వెనక్కి పంపకుండా శాంపిల్స్ సేకరించాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రికి అవసరమైన పరికరాల ప్రతిపాదనలు వెంటనే అందించాలని సూచించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గైనిక్ ఓపీని పరిశీలించి పలు సూచనలు చేశారు. ⚡*అనంతరం శారద నగర్‌ లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల* ను పరిశీలించిన కలెక్టర్ ఇంటర్మీడియట్ ఫలితాలు, స్టడీ రూమ్ సౌకర్యం, అడ్మిషన్లు తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫెకళాశాలకు అవసరమైన పరికరాల ప్రతిపాదనలు అందించాలని తెలిపారు. ⚡*అనంతరం గౌతమి నగర్‌లోని శ్రీరామ రైస్ మిల్, రాజరాజేశ్వర రైస్ మిల్లులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రైతుల ధాన్యంపై ఎలాంటి కట్టింగ్ పెట్టడానికి వీలు లేదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. లారీలను ఎప్పటికప్పుడు దించుకోవాలని, ఎక్కువ సమయం వేచి ఉండే పరిస్థితి కల్పించవద్దని మిల్లర్లను ఆదేశించారు. ఈ పర్యటనలో డాక్టర్ లు అరుణ ,కృపాభాయి, రాజు ,సంబంధిత అధికారులు ,తదితరులు జిల్లా కలెక్టర్ వెంట పాల్గొన్నారు.
1
1
4
259
పెద్దపల్లి, మే-29: ------------------------------------- ➡️ఎస్‌ఐఆర్‌ కార్యక్రమం ద్వారా ప్రతి ఓటరు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ➡️శుక్రవారం హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, ఎన్నికల నమోదు అధికారులు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎస్‌.ఐ.ఆర్‌ కార్యక్రమం, మ్యాపింగ్ పురోగతిని సమీక్షించారు. *జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె. అరుణశ్రీ తో కలిసి పాల్గొన్నారు*. ➡️ఈ సందర్భంగా *రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ* 1950 నుంచి ఇప్పటి వరకు దాదాపు 10 సార్లు ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో గతంలో 2002లో ఎస్‌ఐఆర్‌ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఎస్‌ఐఆర్‌ కార్యక్రమం ద్వారా శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్లు, మరణించిన ఓటర్ల వివరాల తొలగింపు, డబుల్ ఎంట్రీల తొలగింపు జరుగుతుందని తెలిపారు. అక్టోబర్ 1, 2026 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించనున్నట్లు చెప్పారు. ➡️జూన్ 24 నుండి జూలై 25 వరకు బూత్ లెవల్ అధికారులు ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను పూర్తిస్థాయిలో ధృవీకరించాలని ఆదేశించారు. ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని, ప్రతి అర్హ ఓటరిని గుర్తించి జాబితాలో చేర్చాలని తెలిపారు. డ్రాఫ్ట్ ఓటరు జాబితా సిద్ధం చేసే ముందు ప్రతి వివరాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ➡️ఒక కుటుంబ సభ్యులందరూ ఒకే పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉండేలా చూడాలని, 1200 మంది ఓటర్ల సంఖ్య దాటితే కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రతి బీఎల్‌వో వద్ద ఎన్యుమరేటర్ ఫారాలు తగినంతగా అందుబాటులో ఉండేలా చూడాలని, ఎన్యుమరేషన్ సమయంలో ఎలాంటి ఆధారాలు చూపించాల్సిన అవసరం లేదని తెలిపారు. ➡️ప్రతి బీఎల్‌వోకు ఎస్‌ఐఆర్‌ నిబంధనలు, విధివిధానాలు, ఫీల్డ్ వెరిఫికేషన్ విధానం, ఫారాల నిర్వహణపై పూర్తి అవగాహన, పట్టు ఉండేలా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. శిక్షణ కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు సమయానికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని, ప్రతి అర్హ ఓటరిని గుర్తించి జాబితాలో చేర్చాలని తెలిపారు. డ్రాఫ్ట్ ఓటరు జాబితా సిద్ధం చేసే ముందు ప్రతి వివరాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ➡️డ్రాఫ్ట్ జాబితా విడుదల అనంతరం మ్యాపింగ్‌లో లోపాలు ఉంటే సంబంధిత ఓటర్లకు నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. భారత పౌరసత్వ నిబంధనల ప్రకారం అవసరమైన పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. జూలై 1, 1987కు ముందు జన్మించిన వారు తమ స్వీయ గుర్తింపు లేదా జనన ఆధార పత్రాలు సమర్పిస్తే సరిపోతుందని, తల్లిదండ్రుల పత్రాలు అవసరం లేదన్నారు. జూలై 1, 1987 నుంచి డిసెంబర్ 2, 2004 మధ్య జన్మించిన వారు తమ పత్రాలతో పాటు తల్లి లేదా తండ్రి ఎవరి అయినా ఒకరి పత్రం సమర్పించాలని, డిసెంబర్ 2, 2004 తర్వాత జన్మించిన వారు తల్లిదండ్రుల ఇద్దరి పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని వివరించారు. ➡️జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించనున్నట్లు పేర్కొన్నారు. ముసాయిదా జాబితా ప్రచురణ అనంతరం ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలు, కొత్త క్లెయిమ్‌లు, దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి మాత్రమే నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి దరఖాస్తుపై ఫీల్డ్ స్థాయిలో విచారణ నిర్వహించాలని, ఎటువంటి ఫిర్యాదును నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. జూలై 31 నుండి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్‌ల స్వీకరణ జరుగుతుందని, సెప్టెంబర్ 28 వరకు వాటి పరిష్కార ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. తుది ఓటరు జాబితాను అక్టోబర్ 1న ప్రచురించనున్నట్లు పేర్కొన్నారు. ➡️మ్యాపింగ్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధుల పాత్ర కేవలం ఇళ్ల గుర్తింపు, వ్యక్తుల గుర్తింపుకు మాత్రమే పరిమితం కావాలని స్పష్టం చేశారు. ప్రైవేట్ వ్యక్తులు ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ నిర్వహిస్తున్నారనే భావన ప్రజల్లో కలగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో పూర్తిస్థాయి నిష్పాక్షికత పాటించాలని తెలిపారు. అన్ని పార్టీలకు సమాన దూరంలో ఉండటమే కాకుండా, అది స్పష్టంగా కనిపించేలా అధికారులు వ్యవహరించాలని ఆదేశించారు. ➡️ముఖ్యంగా వీఐపీ, వీవీఐపీ ఓటర్ల పేర్ల మ్యాపింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రముఖుల పేర్లు మిస్ అయ్యాయనే వార్తలు రాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. అన్ని ప్రభుత్వ ఉద్యోగుల పేర్లు కూడా తప్పనిసరిగా మ్యాపింగ్ చేయాలని ఆదేశించారు.
4
12
1,217
పెద్దపల్లి, మే-29 ------------------------------------- ✴️*ఉపాధి హామి నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* ✴️*జూన్ రెండవ వారం నాటికి మంజూరైన పనులు పూర్తి చేయాలి* ✴️*తహసీల్దార్ కార్యాలయాలు, ఇందిరా మహిళ శక్తి భవనం పనులు వేగవంతం చేయాలి* ✴️*పంచాయతీరాజ్ శాఖ అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్* ------------------------------------- ✴️జిల్లాకు ఉపాధి హామి పథకం క్రింద మంజూరైన మెటీరియల్ కాంపోనెంట్ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* సంబంధిత అధికారులను ఆదేశించారు. ✴️శుక్రవారం కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్ శాఖ అభివృద్ధి పనుల పురోగతిపై *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కో య శ్రీ హర్ష మాట్లాడుతూ,* జూన్ రెండవ వారం నాటికి ఉపాధి హామి పథకం క్రింద మంజూరైన నిధుల వినియోగం పూర్తి కావాలని తెలిపారు. జూన్ చివరి వరకు మంజూరైన ఉపాధి హామి పనులను ప్రత్యేక శ్రద్ధతో గ్రౌండింగ్ చేస్తూ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ✴️జిల్లాలో నిర్మాణంలో ఉన్న నాలుగు తహసీల్దార్ కార్యాలయాల పనులను జూన్ రెండవ వారం నాటికి పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. పెద్దపల్లి మండలం రాఘవపూర్ లో నిర్మిస్తున్న ఇందిరా మహిళ శక్తి జిల్లా భవనం పనులను పూర్తి చేసి జూన్ 2న ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఈఈ పంచాయతీరాజ్ శంకరయ్య, డి ఆర్ డి ఓ కాళిందిని, కలెక్టరేట్ ఏవో బండి ప్రకాష్, డీఈలు, ఏఈలు,సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
1
4
406