Official Account of Fact Check Wing of Government of Andhra Pradesh. Report any misleading post/tweet at factcheckapgov@gmail.com

Joined December 2020
808 Photos and videos
‘పరీక్ష రాయకుండానే డీఎస్సీ టీచర్ ఉద్యోగాలు ఇచ్చేశాము దాంట్లో తప్పేముంది చెప్పండి?’ అనే వ్యాఖ్యానంతో, ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారుల ఫొటోలతో డీఎస్సీ 2025పై మరొక తప్పుడు సమాచారాన్ని కొందరు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. డీఎస్సీ 2025 నియామకాలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు వివరణ ఇచ్చినప్పటికీ నిస్సిగ్గుగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాజకీయాలలోకి ప్రభుత్వ సీనియర్ ఐఏఎస్ అధికారులను తీసుకురావడమే తప్పు కాగా తప్పుడు వ్యాఖ్యానాలతో వారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడం మరింత పెద్ద నేరం. వారు అనని మాటల్ని వారికి ఆపాదిస్తూ, స్పోర్ట్స్ కోటా పై తప్పుడు వ్యాఖ్యల్ని జత చేస్తూ సామాజిక మాధ్యమాలలో ఇలా ప్రచారం చేయడాన్ని ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నది. తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి పంపుతున్న ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్ పైనా వాటి నిర్వాహకులపైనా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడమైనది. #FactCheck #AndhraPradesh
4
15
33
1,431
గత కొద్ది రోజులుగా డిఎస్సీ 2025 నియామకాలపై ఒక పద్ధతి ప్రకారం తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు ప్రతి అంశంపైనా పూర్తి స్థాయిలో వివరణలు ఇచ్చినా మళ్లీ మళ్లీ అవే తప్పుడు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. తాజాగా కమ్మకులానికి చెందిన వారు టెట్ రాయకపోయినా స్పోర్ట్స్ కోటాలో డిఎస్సీ పోస్టులు ఇచ్చారనే తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు. బాధ్యతగల పదవులు నిర్వహించిన వ్యక్తులే తప్పుడు ప్రచారానికి పాల్పడటం దురదృష్టకరం. డిఎస్సీ 2025లో మొత్తం నియామకాలు 15,941 కాగా అందులో మహిళలు 7,955 మంది. మాజీ సైనికులు 112 మంది, PwBD (దివ్యాంగులు)లలో OH కోటా కింద 190 మంది, VH కోటా కింద 158 మంది, HI కోటా కింద 119 మంది, MI కోటా కింద 24 మంది నియమితులయ్యారు. స్పోర్ట్స్ కోటా కింద 372 మంది మాత్రమే నియమితులయ్యారు. స్పోర్ట్స్ కోటా కింద నియమితులయిన వారిలో బీసీలు 50%, ఎస్ సిలు 30 %, ఎస్ టిలు 8%, ఓసీలు 12% మంది ఉన్నారు. ఓసీ 12% మంది లో కమ్మ కులానికి చెందిన వారు కేవలం 9 మంది మాత్రమే ఉన్నారు. ఇదే కోటా లో కాపు కులస్థులు 16 మంది, రెడ్డి కులస్థులు 10 మంది ఉన్నారు. వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ కులాల నుంచి ఇద్దరు చొప్పున, ముస్లిం వర్గం నుంచి ఒకరు ఉన్నారు. BC Aకు చెందిన 2,088 మంది అభ్యర్ధులు నియమితులయ్యారు. BC Bలో 2,680 మంది, BC C లో248 మంది, BC Dలో 2,610 మంది, BC Eలో 1,067 మంది నియమితులయ్యారు. OC లో 3,192 మంది నియమితులయ్యారు. SC GR1 లో 145 మంది, SC GR 2లో 1,345 మంది, SC GR 3లో 1,555 మంది నియమితులు కాగా STలో 1,011 మంది నియమితులయ్యారు. పూర్తి అర్హతతో, నియమ నిబంధనలకు అనుగుణంగా ఎంపిక అయి, వృత్తిలో తమ ప్రతిభను చూపిస్తున్న టీచర్ల పట్ల ఇలా తప్పుడు ప్రచారం చేసి వారి మానసిక స్థితిని దెబ్బతీయాలని చూడటం సబబు కాదు. తప్పుడు ఆరోపణలు చేసి సమాజంలో కల్లోలం రేపే ప్రయత్నం చేయడం క్షంతవ్యం కాదు. దయచేసి ఈ తప్పుడు ఆరోపణలను ఎవరూ నమ్మవద్దు. తప్పుడు సమాచారం పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. #FactCheck #AndhraPradesh
16
74
127
4,832
సమర్ధవంతంగా ‘డీఎస్సీ 2025’ నిర్వహించి టీచర్ల నియామకాలు జరిగి ఏడాది గడిచిన తర్వాత ఇప్పుడు అసంబద్ధమైన ప్రశ్నలు లేవనెత్తడం కేవలం ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం మాత్రమే. డీఎస్సీ 2025 నియామకాలు ఎంతో పారదర్శకంగా, నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తూ నిర్వహించడం జరిగింది. ఎక్కడా ఎలాంటి లోపం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా సరే ప్రజలను తప్పుదోవ పట్టించే చర్యలకు కొందరు ఉపక్రమిస్తున్నారు. పైగా ఉన్నతాధికారులు పూర్తి వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఇలా చేయడం కరెక్టు కాదు. డిఎస్సీ ఎంపికల్లో టెట్ మార్కులకు 20 శాతం, డిఎస్సీ మార్కులకు 80 శాతం వెయిటేజీ ఇచ్చి జనరల్ మెరిట్ లిస్ట్ రూపొందించినట్లు రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పష్టం చేశారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కాల్ లెటర్ రావడం అంటే అభ్యర్థి ఎంపికైనట్లుగా కాదని ఆయన చెప్పడమే కాకుండా కాల్ లెటర్ లో కూడా చాలా స్పష్టంగా రాశారు. హారిజాంటల్ రిజర్వేషన్లు, సర్టిఫికేట్ వెరిఫికేషన్, అర్హత నిర్ధారణ తదితర అంశాల ఆధారంగా తుది ఎంపికలు జరుగుతాయి. ఒక అభ్యర్థికి కాల్ లెటర్ వచ్చినప్పటికీ, వెరిఫికేషన్ సమయంలో అనర్హత తేలితే తదుపరి అభ్యర్థికి అవకాశం దక్కవచ్చు. ఉదాహరణకు M. ఏకాంబరం (Chittoor - Social Studies): ఈయన మెరిట్ ర్యాంక్ 123. ఇక్కడ అందుబాటులో ఉన్న 7 BC-D పోస్టులలో 5 జనరల్ మెరిట్ కింద (కటాఫ్ 114) భర్తీ అవ్వగా, మిగిలిన 2 పోస్టులు హారిజాంటల్ రిజర్వేషన్ కింద PwBD (దివ్యాంగుల) కోటా అభ్యర్థులకు దక్కాయి. ఆ దివ్యాంగులు కూడా BC-D క్యాటగిరికి సంబంధించిన వారే. పోస్టులు దక్కించుకున్న ఇద్దరు దివ్యాంగుల కన్నా ఇద్దరు మెరిట్ లో పైన ఉన్నారు. వారు వేరే వేరే క్యాటగిరిలకు చెందిన వారు. అయితే వారు వైద్యుల నిర్ధారణలో వారి వైకల్యం నిర్దుష్ట పరిమితికి లేకపోవడం వల్ల వారు అర్హత సాధించలేదు. దివ్యాంగులు జాబితాలో ఆ తదుపరి మెరిట్ లో ఇద్దరు దివ్యాంగులు BC-D క్యాటగిరికి చెందిన వారు కావడంతో ఈ జాబితాలోకి వచ్చారు. ఇది హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం జరిగింది. హారిజాంటల్ రిజర్వేషన్ కారణంగా ఏకాంబరం కు పోస్టు రాలేదు. వాస్తవాలు ఇలా ఉండగా తప్పుడు ప్రచారం చేయడం సబబు కాదు. #FactCheck #AndhraPradesh
2
23
71
1,446
‘మెగా డిఎస్సీ 2025’ నియామకాలు జరిగి ఏడాది గడిచిన తర్వాత ఇప్పుడు కొందరు ఆ నియామకాలను వివాదాస్పదం చేయాలని చూస్తున్నారు. ముఖ్యంగా క్రీడా కోటా కింద చేసిన నియామకాలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. స్పోర్ట్స్ కోటా నియామకాల విషయంలో అమలులో ఉన్న నిబంధనలు, జీఓల ప్రకారం పూర్తిస్థాయి పారదర్శకతతో ఎంపికలు నిర్వహించినట్లు రాష్ట్ర క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ స్పష్టం చేశారు. స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగాల కల్పన వెనుక ప్రధాన ఉద్దేశ్యం రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడం, ప్రతిభావంతులైన క్రీడాకారులకు అవకాశాలు కల్పించడమే. క్రీడల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా మరింత మంది యువత క్రీడల వైపు ఆకర్షితులవుతారు. కేవలం క్రీడల్లో పాల్గొన్నంత మాత్రానే ఉద్యోగాలు ఇచ్చేస్తారా అని కొందరు ప్రశ్నిస్తున్నారని, అయితే ప్రస్తుత నియామకాల్లో జాతీయ క్రీడలు (National Games), జాతీయ ఛాంపియన్‌షిప్‌లు, ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ పోటీలు, సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ పోటీలు, రాష్ట్ర స్థాయి ఛాంపియన్‌షిప్‌లు, అంతర్జాతీయ స్థాయి పోటీలలో సాధించిన విజయాల ఆధారంగా మాత్రమే ప్రాధాన్యత కేటాయించినట్లు తెలిపారు. స్పోర్ట్స్ కోటాలో ఎంపిక అయిన 382 మంది అభ్యర్థుల వివరాలు ఆన్‌లైన్‌లోనే ఉన్నాయని తెలిపారు. 2019 గ్రామ/వార్డు సచివాలయ నియామకాలలో ఇంటర్-కాలేజియేట్, రూరల్ స్పోర్ట్స్, ఇంటర్-డిస్ట్రిక్ట్ పార్టిసిపేషన్ వంటి కేటగిరీలను పరిగణనలోకి తీసుకుని వందలాది మందికి ఉద్యోగాలు కల్పించినప్పటికీ, ప్రస్తుత డీఎస్సీ నియామకాల్లో అమలులో ఉన్న జీఓ-4 ప్రకారం అలాంటి కేటగిరీలు పరిగణనలో లేవని ఆయన స్పష్టం చేశారు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే ప్రక్రియ మొత్తంపై అనుమానాలు రేకెత్తించే విధంగా తప్పుడు ప్రచారం చేయడం సబబు కాదు. #FactCheck #AndhraPradesh
1
21
57
1,310
‘మెగా డిఎస్సీ 2025’ నియామకాలు జరిగి ఏడాది గడిచిన తర్వాత ఇప్పుడు కొందరు ఆ నియామకాలను వివాదాస్పదం చేయాలని చూస్తున్నారు. ముఖ్యంగా క్రీడా కోటా కింద చేసిన నియామకాలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. స్పోర్ట్స్ కోటా నియామకాల విషయంలో అమలులో ఉన్న నిబంధనలు, జీఓల ప్రకారం పూర్తిస్థాయి పారదర్శకతతో ఎంపికలు నిర్వహించినట్లు రాష్ట్ర క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ స్పష్టం చేశారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అభ్యర్థి అనిగి దుర్గయ్య తనకు జాతీయ క్రీడల్లో సాధించిన విజయాలున్నప్పటికీ ఉద్యోగం రాలేదని చేసిన ఆరోపణలపై ఆయన వివరణ ఇస్తూ దుర్గయ్య 32వ నేషనల్ గేమ్స్ కు సంబంధించిన సర్టిఫికేట్‌ను ఆన్‌లైన్ దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేయలేదని, భౌతిక ధృవీకరణ సమయంలో మాత్రమే ఆ వివరాలను సమర్పించినట్లు తెలిపారు. అయితే జీఓ-4 మరియు నోటిఫికేషన్ ప్రకారం నిర్దేశిత గడువులో ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేసిన సర్టిఫికెట్లను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టమైన నిబంధన ఉన్నందున, అనంతరం సమర్పించిన పత్రాలను పరిగణనలోకి తీసుకోవడం సాధ్యపడలేదని ఆయన పేర్కొన్నారు. అభ్యర్థి ఆన్‌లైన్‌లో సరైన సర్టిఫికేట్‌ను సమర్పించి ఉంటే, అతని అర్హతను సంబంధిత ప్రాధాన్యత క్రమంలో పరిశీలించే అవకాశం ఉండేదని వివరించారు. తాను దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేయలేకపోయినట్లు దుర్గయ్య, కోర్టు కు సమర్పించిన అఫిడవిట్ లోనే పేర్కొన్నాడని కూడా అజయ్ జైన్ స్పష్టం చేశారు. స్వీయ పొరబాటు వల్లే దుర్గయ్యకు ఉద్యోగం రాలేదని, అయితే మరొక విషయం పరిశీలిస్తే అదే స్లాట్ లో ఉద్యోగం పొందిన వారంతా జాతీయ స్థాయి క్రీడల్లో మెడల్స్ పొందినవారేనని విరించారు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే ప్రక్రియ మొత్తంపై అనుమానాలు రేకెత్తించే విధంగా తప్పుడు ప్రచారం చేయడం సబబు కాదు. #FactCheck #AndhraPradesh
22
212
1,168
18,838
‘మెగా డిఎస్సీ 2025’ నియామకాలు జరిగి ఏడాది గడిచిన తర్వాత ఇప్పుడు కొందరు ఆ నియామకాలను వివాదాస్పదం చేయాలని చూస్తున్నారు. ముఖ్యంగా క్రీడా కోటా కింద చేసిన నియామకాలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. స్పోర్ట్స్ కోటా నియామకాల విషయంలో అమలులో ఉన్న నిబంధనలు, జీఓల ప్రకారం పూర్తిస్థాయి పారదర్శకతతో ఎంపికలు నిర్వహించినట్లు రాష్ట్ర క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న జీఓ ఎంఎస్ నెం.4 ప్రకారం ఇంటర్-కాలేజియేట్ పోటీల్లో పాల్గొనడం లేదా సాధించిన విజయాలను ఉద్యోగాల కోసం అర్హతగా పరిగణించలేదని ఆయన తెలిపారు. అయితే 2012 ఆగస్టు 9న జారీ చేసిన జీఓ ఎంఎస్ నెం.74 ప్రకారం నిర్వహించిన గత నియామకాలలో ఇంటర్-కాలేజియేట్ పోటీలు, ఇంటర్-డిస్ట్రిక్ట్ పోటీలు, రూరల్ స్పోర్ట్స్, మహిళా క్రీడా ఉత్సవాలు, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGFI) పోటీలు వంటి విభాగాల్లో పాల్గొనడం లేదా పతకాలు సాధించడం కూడా ఉద్యోగ అర్హతకు పరిగణనలోకి తీసుకున్నట్లు వివరించారు. అదే విధానం 2019లో గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా చేపట్టిన సుమారు 1.20 లక్షల నియామకాలలో కూడా అమలులో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. డీఎస్సీ–2025 స్పోర్ట్స్ కోటా కింద మొత్తం 382 మంది అభ్యర్థులు ఎంపిక అయ్యారని తెలిపారు. వీరిలో 22 మంది బంగారు పతక విజేతలు, 40 మంది రజత పతక విజేతలు, 43 మంది కాంస్య పతక విజేతలు మరియు 275 మంది జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు ఉన్నారని తెలిపారు. ఖో-ఖో, బాల్ బ్యాడ్మింటన్, జూడో, సాప్టుబాల్, అథ్లెటిక్స్, వాలీబాల్, హ్యాండ్‌బాల్, హాకీ తదితర 34 క్రీడా విభాగాలకు చెందిన క్రీడాకారులు ఎంపిక అయ్యారని ఆయన తెలిపారు. సమర్పించిన ప్రతి క్రీడా సర్టిఫికేట్‌ను స్క్రూటినీ కమిటీ, రాష్ట్ర స్థాయి కమిటీ, సంబంధిత క్రీడా సంఘాలు, యూనివర్సిటీలు మరియు ఇతర అధికారిక రికార్డుల ద్వారా పరిశీలించి మాత్రమే అర్హత నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. 1996 నుంచి 2025 వరకు జారీ చేసిన సర్టిఫికెట్లను కూడా ధృవీకరణలో భాగంగా పరిశీలించినట్లు వెల్లడించారు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే ప్రక్రియ మొత్తంపై అనుమానాలు రేకెత్తించే విధంగా తప్పుడు ప్రచారం చేయడం సబబు కాదు. #FactCheck #AndhraPradesh
1
53
117
2,117
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఏడాది కిందట నిర్వహించిన మెగా డీఎస్సీ-2025 నియామక ప్రక్రియపై అనుమానాలు రేకెత్తించే విధంగా ఇప్పుడు కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తమ తప్పుడు ప్రచారానికి వీలుగా పి. నవీన్ అనే అభ్యర్ధి ఉదాహరణ చెబుతున్నారు. సదరు అభ్యర్ధి ఎస్ సి ఆర్ టీలో గత 9 సంవత్సరాల నుంచి పని చేస్తున్న ఉద్యోగి. ప్రభుత్వ సంస్థల్లో పని చేసేవారు ఎవరైనా డిఎస్సీ పరీక్షకు హాజరు కావాలంటే ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. సదరు అభ్యర్ధి ముందస్తు అనుమతి తీసుకోకుండానే డిఎస్సీ పరీక్షకు హాజరయ్యాడు. మెరిట్ లిస్టులో ఉన్న అతనికి సంబంధించిన ఈ విషయం వెల్లడి కావడంతో తదుపరి చర్యలు తీసుకోవడం జరిగింది. మెరిట్ లిస్టులో మార్పులు చేసి ఆయన డేటాను డిలీట్ చేశారని చెప్పడం కూడా పూర్తిగా అసత్యం. పి. నవీన్ అనర్హత అంశానికి సంబంధించి, నిబంధనల ప్రకారం ముందస్తు అనుమతి లేకుండా పరీక్ష రాయడం మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు గైర్హాజరు కావడంతో రూల్ 20(vi) ప్రకారం ఆయన అభ్యర్థిత్వం రద్దు చేయబడిందని విద్యా శాఖ స్పష్టం చేసింది. ఈ నిర్ణయంపై ఆయన కోర్టును ఆశ్రయించగా, హైకోర్టు ఉత్తర్వుల మేరకు గ్రీవెన్స్ రెడ్రెస్సల్ కమిటీ మరియు రాష్ట్ర స్థాయి అప్పీల్ కమిటీలు నిబంధనల ప్రకారం విచారణ జరిపి కేసును పరిష్కరించామని ప్రభుత్వం వివరించింది. ఇదంతా జరిగి 8 నెలలు పూర్తి అయిన తర్వాత ఇప్పుడు సదరు అభ్యర్ధి విషయాన్ని ప్రస్తావించడం, ప్రభుత్వంపై అభాండాలు వేయడం సబబు కాదు. డిఎస్సీపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అవాస్తవాలు చెబుతున్న వారిని ప్రజలు నమ్మవదని కోరుతున్నాం. #FactCheck #AndhraPradesh
6
98
244
5,686
మెగా డిఎస్సీ 2025పై అపోహలు రేకెత్తించే విధంగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా నియామకాలు జరిగి ఏడాది గడుస్తున్న సమయంలో ఇప్పుడు తప్పుడు ప్రచారం చేయడం చట్టరీత్యా నేరం. ఉదాహరణకు విశాఖపట్నంకు చెందిన మహమ్మద్ షాబుద్దీన్ (Zone-I - PET) కు తెలుగు ప్రధమ భాషగా చదవనందువల్ల పోస్టు రాలేదు. G.O.Ms. No.15 & 16 ప్రకారం అభ్యర్థులు తెలుగును ప్రథమ భాషగా చదివి ఉండాలి. ఈ విషయాన్ని నోటిఫికేషన్ లోనే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ క్యాటగిరీలో ఐదుగురు ఎంపిక అయ్యారు. ఎంపిక అయిన షేక్ పీర్ భాషా, షెహనాజ్, షేక్ రంజాన్, ఆరిఫ్ అలీ, షేక్ అలీ అందరూ కూడా తెలుగును ప్రధమ భాషగా చదివారు. అందువల్ల వారినే ఎంపిక చేయడం జరిగింది. నిబంధనలు కచ్చితంగా పాటించడం వల్లే ఆయనకు ఉద్యోగం రాలేదు. అంతే తప్ప ప్రభుత్వ పరంగా ఎలాంటి తప్పు జరగలేదు. #FactCheck #AndhraPradesh
40
90
1,384
మెగా డిఎస్సీ 2025పై అపోహలు రేకెత్తించే విధంగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా నియామకాలు జరిగి ఏడాది గడుస్తున్న సమయంలో ఇప్పుడు తప్పుడు ప్రచారం చేయడం చట్టరీత్యా నేరం. ఉదాహరణకు ఇందిర కుమ్మరి (Krishna - Social Studies) SC-GR III కి చెందిన అభ్యర్ధి. ఈ గ్రూప్ లో 10 పోస్టులు ఉండగా 8 పోస్టులను జనరల్ మెరిట్ లో భర్తీ చేయడం జరిగింది. మిగిలిన 2 పోస్టులు హారిజాంటల్ రిజర్వేషన్ కారణంగా స్పోర్ట్స్ కోటా ద్వారా భర్తీ అయ్యాయి. జనరల్ మెరిట్ లో భర్తీ చేసిన 8 పోస్టులలో కటాఫ్ ర్యాంకు 127. అందువల్ల 134 ర్యాంకు వచ్చిన ఈ అభ్యర్ధికి ఉద్యోగం వచ్చే అవకాశం లేదు. స్పోర్ట్స్ కోటాలో రెండు పోస్టులు ఎందుకు భర్తీ చేశారు అని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగం రాలేదనే ఆవేదన ఉండవచ్చు కానీ హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం పోస్టులు భర్తీ చేస్తే దాన్ని ప్రశ్నించడం కరెక్టు కాదు. ఉన్న నిబంధనలను ఎక్కడా అతిక్రమించలేదు. #FactCheck #AndhraPradesh
1
51
121
1,858
మెగా డిఎస్సీ 2025పై అపోహలు రేకెత్తించే విధంగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా నియామకాలు జరిగి ఏడాది గడుస్తున్న సమయంలో ఇప్పుడు తప్పుడు ప్రచారం చేయడం చట్టరీత్యా నేరం. ఉదాహరణకు యర్రిపిల్లి శ్రవణ్ కుమార్ (Visakhapatnam - Physical Science) BC A క్యాటగిరీకి చెందిన వ్యక్తి. ఆయన మెరిట్ ర్యాంక్ 53. ఆ క్యాటగిరిలో నాలుగు పోస్టులు ఉన్నాయి. మొదటి రెండు జనరల్ మెరిట్ ఒకటి మహిళా, మరొకటి PwBD కోటాలు హారిజాంటల్ రిజర్వేషన్ వల్ల వచ్చాయి. జనరల్ మెరిట్ లో 10, 31కి ఉద్యోగం వచ్చింది. దాంతో 53 ర్యాంక్ ఉన్న ఆయనకు అవకాశం రాలేదు. అర్హులకు మాత్రమే ప్రభుత్వం నియామకపు ఉత్తర్వులు జారీ చేసింది. #FactCheck #AndhraPradesh
1
49
111
1,936
మెగా డిఎస్సీ 2025పై అపోహలు రేకెత్తించే విధంగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా నియామకాలు జరిగి ఏడాది గడుస్తున్న సమయంలో ఇప్పుడు తప్పుడు ప్రచారం చేయడం చట్టరీత్యా నేరం. ఉదాహరణకు ముడే జగదీష్ నాయక్ (Kadapa - Urdu Medium SGT) మెరిట్ ర్యాంక్ 363. అక్కడ మిగిలినవి 2 ST-Women బ్యాక్‌లాగ్ పోస్టులు మాత్రమే. మహిళ బ్యాక్ లాగ్ పోస్టుకు మహిళలు ఎవరూ లేరు కాబట్టి తనకు ఇవ్వాలని ఆయన అడిగారు. అలా నిబంధనలు అంగీకరించవు. ఆయన పురుష అభ్యర్థి కావడంతో మహిళా పోస్టులకు పరిగణించడం కుదరదు. దీనికి ఆయన ఆవేదన చెంది ఉండవచ్చు కానీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయరాదు. #FactCheck #AndhraPradesh
2
41
93
1,524
మెగా డిఎస్సీ 2025పై అపోహలు రేకెత్తించే విధంగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా నియామకాలు జరిగి ఏడాది గడుస్తున్న సమయంలో ఇప్పుడు తప్పుడు ప్రచారం చేయడం చట్టరీత్యా నేరం. ఉదాహరణకు కె. అనిల్ కుమార్ (Srikakulam - Physical Education): SC-G-I కేటగిరీకి కేటాయించిన ఒకే ఒక పోస్టును హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం స్పోర్ట్స్ కోటాలో ఉన్న SC-G-I అభ్యర్థికి కేటాయించారు. దీంతో అనిల్ కుమార్ (ర్యాంక్ 166) ఎంపిక పరిధిలోకి రాలేదు. సదరు అభ్యర్ధికి ఎలాంటి అన్యాయం జరగలేదు. అర్హులకు మాత్రమే ప్రభుత్వం నియామకపు ఉత్తర్వులు జారీ చేసింది. #FactCheck #AndhraPradesh
33
73
1,581
మెగా డిఎస్సీ 2025పై అపోహలు రేకెత్తించే విధంగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా నియామకాలు జరిగి ఏడాది గడుస్తున్న సమయంలో ఇప్పుడు తప్పుడు ప్రచారం చేయడం చట్టరీత్యా నేరం. ఉదాహరణకు చిట్టిపోగు రాజ్ కమల్ అనే అభ్యర్ధి (SA(NL) Physical Education)కి 337 ర్యాంకు వచ్చింది. అతను SC G II క్యాటగిరీకి సంబంధించిన అభ్యర్ధి. ఆ క్యాటగిరీలో 7 పోస్టులు జనరల్ మెరిట్ తో భర్తీ చేయగా మిగిలిన పోస్టులు జీవో 77 ప్రకారం హారిజాంటల్ రిజర్వేషన్ కారణంగా SC G II క్యాటగిరీ మహిళలకు రిజర్వు చేయబడ్డాయి. జనరల్ మెరిట్ కటాఫ్ ర్యాంకు 100. మరి 337 ర్యాంకు ఉన్న ఈ అభ్యర్ధికి ఉద్యోగం ఎలా వస్తుంది? ఆవేదనతో కూడా ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడం తగదు. అర్హులను మాత్రమే ప్రభుత్వం టీచర్ పోస్టులకు ఎంపిక చేసింది. #FactCheck #AndhraPradesh
1
42
101
1,394
మెగా డిఎస్సీ 2025పై అపోహలు రేకెత్తించే విధంగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా నియామకాలు జరిగి ఏడాది గడుస్తున్న సమయంలో ఇప్పుడు తప్పుడు ప్రచారం చేయడం చట్టరీత్యా నేరం. ఉదాహరణకు పెంటపాటి ప్రతిభ తరిణి (East Godavari - English): ఈమె ర్యాంక్ 87 కాగా, లోకల్ ఏరియా కేటగిరీలో 82 ర్యాంకుతోనే నియామకాలు పూర్తయ్యాయి. అన్నీ చట్టబద్ధంగా జరిగినట్లు తెలిసినా కూడా ఉద్యోగం రాలేదని ఆవేదనతో ఆమె ప్రభుత్వంపై అభాండాలు వేస్తున్నారు. రికార్డులు పరిశీలించిన అనంతరం ఆమెకు ఎలాంటి అన్యాయం జరగలేదని, అర్హులకే టీచర్ పోస్టు దక్కిందని స్పష్టంగా అర్ధం అవుతున్నది. అయినా సరే ఆవేదనతో కూడా ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడం తగదు. #FactCheck #AndhraPradesh
68
198
3,317
మెగా డిఎస్సీ 2025పై అపోహలు రేకెత్తించే విధంగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా నియామకాలు జరిగి ఏడాది గడుస్తున్న సమయంలో ఇప్పుడు తప్పుడు ప్రచారం చేయడం చట్టరీత్యా నేరం. ఉదాహరణకు కాకినాడకు చెందిన తంగెళ్ల బాలకృష్ణ (Physical Education) తనకు ఉద్యోగం రాలేదన్న ఆవేదనతో మాట్లాడుతున్నారు తప్ప ఆయనకు జరిగిన అన్యాయం ఏమీ లేదు. ఆ క్యాటగిరిలో 14 ఖాళీలు ఉన్నాయి. అందులో 4 మహిళలకు రిజర్వు కాగా హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం స్పోర్ట్స్, ఎక్స్-సర్వీస్‌మెన్ కు చెరొక పోస్టు వెళ్లాయి. ఈ కారణంగా ఆయనకు జనరల్ మెరిట్ లో ఉద్యోగం రాలేదు. #FactCheck #AndhraPradesh
37
80
1,264
మెగా డిఎస్సీ 2025పై అపోహలు రేకెత్తించే విధంగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా నియామకాలు జరిగి ఏడాది గడుస్తున్న సమయంలో ఇప్పుడు తప్పుడు ప్రచారం చేయడం చట్టరీత్యా నేరం. ఉదాహరణకు కంచర్ల శరత్ బాబు (Zone-II - PET) మెరిట్ ర్యాంక్ 143. SC-GR III కింద ఉన్న పోస్టులు రెండు. ఆ రెండు పోస్టులు 100, 102 మెరిట్ ర్యాంకులతో భర్తీ అయ్యాయి. 143వ ర్యాంకు వచ్చిన కంచర్ల శరత్ బాబు తనకు అన్యాయం జరిగినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అర్హులను మాత్రమే ప్రభుత్వం టీచర్ పోస్టులకు ఎంపిక చేసింది. #FactCheck #AndhraPradesh
2
45
101
1,947
మెగా డిఎస్సీ 2025పై అపోహలు రేకెత్తించే విధంగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా నియామకాలు జరిగి ఏడాది గడుస్తున్న సమయంలో ఇప్పుడు తప్పుడు ప్రచారం చేయడం చట్టరీత్యా నేరం. ఉదాహరణకు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పంతడి వీరవేణి (Physical Education). ఆమెకు 302 ర్యాంకు వచ్చింది. మెరిట్ లిస్టు ప్రకారం 285 ర్యాంకు వరకూ ఉద్యోగాలు వచ్చాయి. ఆ తర్వాత మాజీ సైనికుల కోటా, క్రీడా కోటా కింద రెండు పోస్టులు భర్తీ చేశారు. సదరు అభ్యర్ధికి ఎలాంటి అన్యాయం జరగలేదు. అర్హులను మాత్రమే ప్రభుత్వం టీచర్ పోస్టులకు ఎంపిక చేసింది. #FactCheck #AndhraPradesh
3
40
105
2,033
మెగా డిఎస్సీ 2025పై అపోహలు రేకెత్తించే విధంగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా నియామకాలు జరిగి ఏడాది గడుస్తున్న సమయంలో ఇప్పుడు తప్పుడు ప్రచారం చేయడం చట్టరీత్యా నేరం. ఉదాహరణకు గెరివి అంజినప్ప (Anantapuram - Social Studies) ఈయన PwBD (VH-దృష్టి లోపం) కోటా కింద దరఖాస్తు చేసుకుని తనకు 40 శాతం అంగవైకల్యం ఉంది అని క్లయిమ్ చేశారు. ముందుగానే నోటిఫికేషన్ లో చెప్పిన విధంగానే వైకల్యాన్ని మెడికల్ బోర్డు సర్టిఫై చేయాల్సి ఉంటుంది. అలా మెడికల్ బోర్డుకు రిఫర్ చేయగా అతనికి వైకల్యం 30 శాతం మాత్రమే ఉన్నట్లు ధృవీకరించింది. ఆయన అప్పీలేట్ అథారిటీ (GGH, విజయవాడ)కి వెళ్లగా అక్కడ నిర్వహించిన పరీక్షల్లో కూడా ఆయనకు 30% మాత్రమే వైకల్యం ఉన్నట్లు తేలింది. బెంచ్‌మార్క్ రిజర్వేషన్‌కు కనీసం 40% వైకల్యం ఉండాలి కాబట్టి ఆయన అనర్హుడయ్యారు. వాస్తవం ఈ విధంగా ఉంటే తనను కావాలనే తీసేసినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. #FactCheck #AndhraPradesh
1
51
146
2,888
మెగా డిఎస్సీ 2025పై అపోహలు రేకెత్తించే విధంగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా నియామకాలు జరిగి ఏడాది గడుస్తున్న సమయంలో ఇప్పుడు తప్పుడు ప్రచారం చేయడం చట్టరీత్యా నేరం. ఉదాహరణకు ప్రకాశం జిల్లాకు చెందిన సిహెచ్ నరసింహారావు (ఎస్సీ గ్రూప్ III కేటగిరి) కు మెరిట్ ఉన్నప్పటికీ జాబ్ రాలేదని ఫేక్ ప్రచారం చేస్తున్నారు. నరసింహారావుకు వచ్చిన మెరిట్ ర్యాంకు 76. ఆయన ఎస్సీ గ్రూప్ III కేటగిరికి చెందినప్పటికీ ఆయనకు వచ్చిన ర్యాంకు ప్రకారం ఆ కేటగిరీలో ఉద్యోగం పొందలేకపోయారు. ఇక ఓ హెచ్ (Orthopaedically Handicapped) కేటగిరీ కింద వర్టికల్ రిజర్వేషన్ తర్వాతే హారిజాంటల్ రిజర్వేషన్ అమలవుతుంది. కాబట్టి BC-C మరియు OH రెండు ఉన్న అభ్యర్థికి పోస్టు ఇవ్వడం జరిగింది. అలా OH రిజర్వేషన్ పూర్తి కావడంతో నరసింహారావుకు OH రిజర్వేషన్ కూడా వర్తించలేదు. అందుకే ఆయనకు జాబ్ రాలేదు తప్ప మెరిట్ ఉన్నప్పటికీ జాబ్ ఇవ్వకపోవడం అన్నది అబద్దం. #FactCheck #AndhraPradesh
1
43
129
2,493
మెగా డిఎస్సీ 2025పై అపోహలు రేకెత్తించే విధంగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా నియామకాలు జరిగి ఏడాది గడుస్తున్న సమయంలో ఇప్పుడు తప్పుడు ప్రచారం చేయడం చట్టరీత్యా నేరం. ఉదాహరణకు కృష్ణా జిల్లాకు చెందిన రాణి కందుల (Physical Education) చెప్పిన విషయాలను పరిశీలిస్తే ఆమెకు వచ్చిన ర్యాంకు 196. కాగా 168 వరకూ మెరిట్ లో వచ్చాయి. ఆఖరు పోస్టు స్పోర్ట్స్ కోటా కావడం వల్ల రాణి కందులకు పోస్టు వచ్చే అవకాశమే లేదు. హారిజాంటల్ కోటా అభ్యర్థుల సర్దుబాటు వల్ల కటాఫ్ ర్యాంకుల్లో మార్పులు వచ్చి ఆమె ఎంపిక కాలేదు. అందువల్లు రాణి కందులకు ఎలాంటి అన్యాయం జరగలేదు. అర్హులకు మాత్రమే ప్రభుత్వం టీచర్ ఉద్యోగాలను ఇచ్చింది. #FactCheck #AndhraPradesh
3
112
249
5,007