MLA From Dubbak Constituency | Former Member Of Parliament Medak | BRS Party Siddipet Dist President

Joined September 2018
3,413 Photos and videos
Kotha Prabhakar Reddy retweeted
చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక/ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దుబ్బాక ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. @KPR_BRS
1
1
25
Kotha Prabhakar Reddy retweeted
రెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ.. చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక/ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దుబ్బాక ఎమ్మెల్యే @KPR_BRS గారు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ... విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది ప్రభుత్వ పాఠశాలలేనని అన్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలల్లోనే చేరి నాణ్యమైన విద్యను అభ్యసించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం, మౌలిక సదుపాయాలు, పరిశుభ్రమైన తరగతి గదులు, తాగునీరు, మరుగుదొడ్లు, డిజిటల్ విద్య వంటి అన్ని సౌకర్యాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం అవసరమైన సదుపాయాల కల్పనకు తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల బాధ్యతతో వ్యవహరించాలని, బోధనలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదని సూచించారు. ప్రతి విద్యార్థి విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా కృషి చేయాలని, విద్యార్థులను క్రమశిక్షణతో పాటు విలువలతో కూడిన విద్య వైపు నడిపించాలని కోరారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలను అందజేసి,బాగా చదివి తల్లిదండ్రులకు,పాఠశాలకు మరియు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు మరియు గ్రామస్తులు విద్యాభివృద్ధికి తమ సహకారం అందిస్తామని తెలిపారు.
5
13
57
గులాబీ జెండాతో జనాల్లోకి.. ప్రజల ఆశీర్వాదంతో ముందుకు సాగుతూ
2
39
177
Kotha Prabhakar Reddy retweeted
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు.. దుబ్బాక నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ మౌలిక వసతులను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గ పరిధిలో ఉన్న 5 వ్యవసాయ మార్కెట్ కమిటీల (AMC)లో ప్రతి మార్కెట్‌కు 40,000 మెట్రిక్ టన్నుల అదనపు నిల్వ సామర్థ్యం కల్పిస్తూ మొత్తం 2 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు నిల్వ సామర్థ్యం కలిగిన ఆధునిక గోదాములు మంజూరు చేయాలని కోరారు. అలాగే రైతులకు యూరియా, దుక్కి మందు, పురుగుమందులు, వివిధ రకాల నాణ్యమైన విత్తనాలు సకాలంలో, అందుబాటు ధరల్లో లభించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పంటల నిల్వ, మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగుపడితే రైతులకు గణనీయమైన ప్రయోజనం చేకూరుతుందని పేర్కొంటూ, ఈ అంశాలపై మంత్రి గారికి వినతిపత్రం అందజేశారు. రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే లక్ష్యంగా దుబ్బాక రైతుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు తెలిపారు.
5
16
139
తెలంగాణ ఏర్పడే సమయానికి రాష్ట్రంలో గోదాముల నిల్వ సామర్థ్యం కేవలం 4 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో 35–40 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా కొత్త గోదాములను నిర్మించి, రాష్ట్రాన్ని కోటి మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం లక్ష్యానికి చేరువ చేసింది. ఇప్పుడు ఆ అభివృద్ధి గణాంకాలనే "పాత లెక్కలు" అంటూ కొట్టిపారేయడం విడ్డూరం కాదా? పాత లెక్కలైనా ప్రజల కోసం చేసిన పనుల లెక్కలే. మీరు అధికారంలోకి వచ్చాక కొత్తగా సాధించిన విజయాల లెక్కలు ఏమిటో చెప్పండి మంత్రి గారూ! గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని విమర్శించడం కాదు, ప్రస్తుత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూపించడం ముఖ్యం. మాటలు కాదు... మైలురాళ్లు మాట్లాడాలి ! విమర్శలు కాదు... విజయాలు చూపాలి ! #CongressFailedTelangana #FailedCongressGovt
1
7
31
437
Kotha Prabhakar Reddy retweeted
కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలబడటమే నిజమైన నాయకుడి లక్షణం. @BRSHarish
5
61
263
6,103
Kotha Prabhakar Reddy retweeted
తెలంగాణ తల్లి చేతిలోని బతుకమ్మను తీసేసి, ఆ తల్లి రూపాన్నే మార్చేశారు. రియల్ దందా కోసం రైతుల భూములను, అన్యాయంగా గుంజుకుంటున్నారు. తెలంగాణ గుర్తులను, లోగోలను, అస్తిత్వాన్ని తుడిచేస్తున్నారు ​నిరుపేదల ఇళ్లను కనికరం లేకుండా, నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తున్నారు 😥 ​అమెరికా, సింగపూర్ చేయడం దేవుడెరుగు... ఉన్న తెలంగాణను నాశనం చేయకు రేవంత్! 🤷‍♂️
10
23
381
Kotha Prabhakar Reddy retweeted
మాటలు కావు, మాకు చేతలు కావాలి! మన నియోజకవర్గంలో రోడ్లు, పాఠశాలల సమస్యలపై గతంలో ఎన్నో సార్లు మాట్లాడినా నేటికీ ఎందుకు స్పందన లేదు? ప్రజా సమస్యలను గాలికొదిలేస్తే ఊరుకునేది లేదు
7
30
185
Kotha Prabhakar Reddy retweeted
వచ్చే ఎన్నికల్లో రేవంత్ ఎమ్మెల్యేగా ఓడిపోవడం ఖాయం.. కాంగ్రెస్ పార్టీ పోవడం ఖాయం! ఎక్కడికి పోయినా ప్రజలందరిదీ ఒకటే మాట.. మళ్లీ కేసీఆర్ రావాలి.. బీఆర్ఎస్ రావాలనే. - మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish 🔥
6
121
508
7,607
నేడు డా. సి. నారాయణ రెడ్డి గారి వర్ధంతి. తెలుగు సాహితీ ప్రపంచానికి చెరగని చిరునామాగా నిలిచిన మహాకవి, ‘విశ్వంభర’ పద్యకావ్యంతో తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన జ్ఞానపీఠ పురస్కార గ్రహీత ఆచార్య డా. సి. నారాయణ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారికి మా ఘన నివాళులు.
3
14
106
దుబ్బాక హక్కుల కోసం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గళం! మంత్రి సమక్షంలోనే సాగునీరు, గోదాములు, రోడ్లు, యూరియా కొరత వంటి ప్రజా సమస్యలను ధైర్యంగా ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతుల పక్షాన... దుబ్బాక అభివృద్ధి కోసం నిరంతర పోరాటం
5
25
144
Kotha Prabhakar Reddy retweeted
నేను ఎంపీగా ఉన్న సమయంలో దుబ్బాక పట్టణ అభివృద్ధి కోసం వెజ్-నాన్ వెజ్ మార్కెట్, టౌన్ హాల్ నిర్మాణాలకు రూ.9 కోట్లు మంజూరు చేయించాను. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ నిధులను రద్దు చేసింది. వెంటనే తిరిగి మంజూరు చేసి పనులు ప్రారంభించాలి. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఎమ్మెల్యే కోటా కింద పెండింగ్‌లో ఉన్న ఇళ్లను వెంటనే ఆమోదించాలి. ఇటీవల గాలివానలతో కూలిపోయిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలను ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి. ప్రధాని మోదీ గారు ఇంధన పొదుపు కోసం కాన్వాయ్‌లను తగ్గించాలని పిలుపునిస్తే, మంత్రి గారు మాత్రం వందలాది వాహనాలతో భారీ కాన్వాయ్‌లో రావడం విచారకరం. ప్రధాని సూచనలను కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దుబ్బాక ప్రజల సమస్యల పరిష్కారం, రైతుల సంక్షేమం, అభివృద్ధి పనుల పూర్తి కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రజల హక్కుల కోసం నా పోరాటం నిరంతరం కొనసాగుతుంది. - దుబ్బాక ఎమ్మెల్యే @KPR_BRS గారు..
7
26
344
Kotha Prabhakar Reddy retweeted
మంత్రి సమక్షంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు.. ఉప కాలువల పూర్తి, గోదాముల నిర్మాణం, రోడ్లకు నిధులు మంజూరు చేయాలి – ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు.. దుబ్బాక నియోజకవర్గ రైతుల సంక్షేమం, సాగునీటి సమస్యలు, రోడ్ల నిర్మాణం, గోదాముల కొరత తదితర అంశాలపై రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి సమక్షంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను నిలదీశారు.. అక్బర్‌పేట-భూంపల్లి మండలం నగరం గ్రామంలోని రామలింగేశ్వర ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి దుబ్బాక నియోజకవర్గానికి చెందిన 594 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దుబ్బాక నియోజకవర్గ రైతులు పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ ప్రాజెక్టుల ప్రధాన కాలువల ద్వారా సాగునీరు అందుతున్నప్పటికీ, ఉప కాలువల పనులు ఇంకా పూర్తికాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే జిల్లా స్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి పెండింగ్ పనులను పూర్తి చేయాలని మంత్రులను కోరారు. ఎల్లారెడ్డిపేట ఎత్తిపోతల పథకం పనులు 90 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులు పూర్తి చేస్తే 17 గ్రామాలకు సాగునీరు అందుతుందని వివరించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు ద్వారా సాగునీటి విస్తీర్ణం పెరగడంతో వరి దిగుబడిలో దుబ్బాక రాష్ట్ర స్థాయిలో ముందంజలో నిలిచిందన్నారు. నియోజకవర్గంలో సుమారు 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతున్నప్పటికీ నిల్వ చేసుకునేందుకు సరిపడా గోదాములు లేవని, వెంటనే గోదాముల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. గతంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. దుబ్బాక నియోజకవర్గంలోని రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క కొత్త రోడ్డు కూడా మంజూరు కాలేదని విమర్శించారు. హామ్ పథకం కింద కూడా ఎలాంటి రోడ్ల నిర్మాణాలకు అనుమతులు రాలేదన్నారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల కోసం 27 ఎకరాల భూమిని జిల్లా కలెక్టర్‌కు అప్పగించామని, వెంటనే పాఠశాల మంజూరు చేయాలని కోరారు. ఈ పాఠశాల ద్వారా గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని చెప్పారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో దుబ్బాక పట్టణంలో వెజ్-నాన్ వెజ్ మార్కెట్, టౌన్ హాల్ నిర్మాణాల కోసం రూ.9 కోట్లు మంజూరు చేయించగా, ప్రస్తుత ప్రభుత్వం వాటిని రద్దు చేసిందని ఆరోపించారు. ఆ నిధులను తిరిగి మంజూరు చేయాలని మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఎమ్మెల్యే కోటా కింద పెండింగ్‌లో ఉన్న ఇళ్లను వెంటనే మంజూరు చేయాలని, ఇటీవల గాలివానల కారణంగా కూలిపోయిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలను తక్షణమే ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇంధన పొదుపు కోసం కాన్వాయ్‌లను తగ్గించాలని పిలుపునిచ్చినప్పటికీ, మంత్రి వివేక్ వెంకటస్వామి వందలాది పోలీసు వాహనాలతో భారీ కాన్వాయ్‌లో కార్యక్రమానికి రావడం విచారకరమని ఎమ్మెల్యే చురకలంటించారు. ప్రధాని సూచనలను సైతం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారం, రైతుల సంక్షేమం, అభివృద్ధి పనుల పూర్తి కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు..
6
20
107
Kotha Prabhakar Reddy retweeted
ఖమ్మంలో మైనర్ అమ్మాయిపై జరిగిన సంఘటనపై, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం చాలా బాధాకరం! అమ్మాయి తిరిగి నడవలేని పరిస్థితిలో ఉన్నది. అమ్మాయికి బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుంది. ఇటువంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి, ఇలాంటి దారుణాలకు పాల్పడే మృగాలను కఠినంగా శిక్షించాలి. - మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
14
96
315
4,570
Kotha Prabhakar Reddy retweeted
బాధిత బాలికకు సరైన వైద్యం అందించలేక, పేదలకు వైద్యం అందించే నిమ్స్ ఆస్పత్రిలో కనీసం మెడిసిన్ కూడా ఇవ్వకుండా బయట నుంచి తెచ్చుకోమన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వైద్యం ఇప్పించే తెలివి లేదు కానీ, మేం వస్తున్నామని తెలిసి వందల మంది పోలీసులను పెట్టారు. బాధితులు తమ సొంత డబ్బులతో మెడిసిన్ బయట కొనుక్కునే పరిస్థితి వచ్చిందంటే.. రాష్ట్రంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్లు? - మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
16
84
279
4,259
Kotha Prabhakar Reddy retweeted
ఖమ్మంలో ఒక 12 ఏళ్ల బాలికపై తండ్రి వయసున్న వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడడం అత్యంత దారుణం. ఆ బాలిక పురుషులైన డాక్టర్లను కూడా దగ్గరికి రానివ్వడం లేదని వైద్యులు చెప్తున్నారంటే, ఆ బాలిక ఎంత భయపడిందో అర్థం చేసుకోవచ్చు. ఒక బాలికకు ఇలా జరిగితే.. కాంగ్రెస్ ప్రభుత్వంలోని మహిళా మంత్రులు ఒక్కరు కూడా ఎందుకు స్పందించడం లేదు? ప్రభుత్వం వెంటనే స్పందించి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి, దీనికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి. - మాజీ మంత్రి, ఎమ్మెల్యే @sunitavakiti
18
75
300
5,514
ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలన్నారు, అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటుతున్నా జాబ్ క్యాలెండర్ ఏది? యువ వికాసం హామీలు ఏమయ్యాయి? @INCTelangana ఎన్నికల మేనిఫెస్టోలో యువతకు ఆకాశమే హద్దుగా హామీలిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను నట్టేట ముంచింది. 'యువ వికాసం' పేరుతో చేసిన ప్రగల్భాలు నేడు తెలంగాణ నిరుద్యోగుల పాలిట 'మహా వంచన'గా మారాయి. ఎన్నికల సమయంలో ప్రతి ఏటా క్రమబద్ధంగా ఉద్యోగాల భర్తీ కోసం 'జాబ్ క్యాలెండర్' విడుదల చేస్తామని నిరుద్యోగులకు ఆశలు కల్పించారు. కానీ, రెండున్నరేళ్లు గడుస్తున్నా ఆ క్యాలెండర్‌కు మోక్షం లేదు, ఉద్యోగాల భర్తీ ఊసే లేదు. నిరుద్యోగుల జీవితాలతో కాంగ్రెస్ సర్కార్ చెలగాటం ఆడుతోంది. మేనిఫెస్టోలో ఉద్యోగ దరఖాస్తులకు ఎలాంటి ఫీజులు ఉండవని, ఉచితంగానే అప్లికేషన్లు స్వీకరిస్తామని స్పష్టంగా చెప్పారు. కానీ నేడు నోటిఫికేషన్ల పేరుతో అభ్యర్థుల నుండి వేలాది రూపాయలు ఫీజుల రూపంలో వసూలు చేస్తూ నిరుద్యోగులపై అదనపు భారం మోపుతున్నారు. యువ వికాసం పథకం కింద స్వయం ఉపాధి కోసం లక్షలాది మంది నిరుద్యోగ యువత దరఖాస్తులు చేసుకుని ఎదురుచూస్తున్నారు. కానీ, ప్రభుత్వానికి పాలసీల పేరుతో కాలయాపన చేయడం తప్ప, నేటికీ ఆ నిధులు విడుదల చేయలేదు, ఒక్కరికైనా లోన్ అందించిన దాఖలాలు లేవు. గత రెండున్నర సంవత్సరాలుగా సరైన నోటిఫికేషన్లు లేకపోవడంతో లక్షలాది మంది యువత వయోపరిమితి దాటిపోయి ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారు. దీనికి తోడు కాంగ్రెస్ ప్రభుత్వం వయోపరిమితిని కుదించి అభ్యర్థులకు అన్యాయం చేసింది. వెంటనే ఈ కుదించిన వయోపరిమితిని రద్దు చేసి, బీఆర్ఎస్ హయాంలో ఉన్న విధంగానే గరిష్ట వయోపరిమితిని పునరుద్ధరించాలి. కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలకు స్పష్టమైన జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, నిరుద్యోగులకు పూర్తి న్యాయం జరిగే వరకు, యువత వెన్నంటి ఉండి #BRS పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది. #CongressFailedTelangana #CongressBetrayedTelangana
ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తవుతున్నా 20 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయకుండా నిరుద్యోగ యువతను నిలువునా మోసం చేసింది. రాష్ట్రంలో 19 వేల పోలీసు పోస్టులు ఖాళీగా ఉన్నాయని స్వయంగా @TelanganaDGP చెబుతుండగా, కేవలం 5 వేల పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పడం నిరుద్యోగులను వంచించడమే. తక్షణమే ఖాళీగా ఉన్న మొత్తం 19 వేల పోలీసు పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేయాలి. కేవలం 5 వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే, అందులో దాదాపు 2 వేల పోస్టులు హైదరాబాద్ కమిషనరేట్ పరిధికే పరిమితమవుతాయి. మిగిలిన పోస్టుల్లో గ్రామీణ ప్రాంతాలకు, రిజర్వేషన్ల ప్రకారం అనేక వర్గాలకు తగిన ప్రాతినిధ్యం దక్కని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో గ్రామీణ యువత తీవ్రంగా నష్టపోతుంది. @BRSparty ప్రభుత్వం హయాంలో ఒకేసారి 16 వేల, 17 వేల పోస్టుల చొప్పున భారీ నోటిఫికేషన్లు విడుదల చేసి, పోలీసు శాఖలోనే దాదాపు 48 వేల ఉద్యోగాలను భర్తీ చేశాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఉద్యోగాల భర్తీలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. గత రెండున్నర సంవత్సరాలుగా నోటిఫికేషన్లు లేకపోవడంతో లక్షలాది మంది యువత వయోపరిమితి దాటిపోయి ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కుదించిన వయోపరిమితిని వెంటనే రద్దు చేసి, బీఆర్ఎస్ హయాంలో ఉన్న విధంగానే కానిస్టేబుల్ పోస్టులకు 36 ఏళ్లు, ఎస్సై పోస్టులకు 38 ఏళ్ల గరిష్ట వయోపరిమితిని పునరుద్ధరించాలి. పోలీసు నియామకాల ఈవెంట్ల విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనలను అనవసరంగా కఠినతరం చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐదు ఈవెంట్లలో మూడు ఈవెంట్లకు అర్హత సాధిస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు లాంగ్ జంప్, షాట్‌పుట్‌లలో ప్రమాణాలను పెంచి మూడు ఈవెంట్లలో మూడింటికీ తప్పనిసరిగా అర్హత సాధించాలనే నిబంధన విధించడం అన్యాయం. వెంటనే పాత విధానాన్నే కొనసాగించాలి. ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగ దరఖాస్తులకు ఎలాంటి ఫీజులు ఉండవని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు వేల రూపాయలు ఫీజుల రూపంలో వసూలు చేస్తూ నిరుద్యోగులపై అదనపు భారం మోపుతోంది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం అప్లికేషన్ ఫీజు లేకుండా దరఖాస్తులు స్వీకరించాలి. దిల్‌సుఖ్‌నగర్, అశోక్‌నగర్ వంటి ప్రాంతాల్లో వేలాది మంది అభ్యర్థులు పోలీసు నియామకాల కోసం సిద్ధమవుతున్నప్పటికీ, ఈవెంట్ల ప్రాక్టీస్‌కు సరిపడా గ్రౌండ్లు అందుబాటులో లేవు. ప్రభుత్వం ప్రతిరోజూ కొంత సమయం పాటు సమీపంలోని పోలీసు లేదా ప్రభుత్వ క్రీడా మైదానాలను అభ్యర్థులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలి. నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 19 వేల పోలీసు పోస్టులతో పాటు, కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేసే వరకు బీఆర్ఎస్ తన పోరాటాన్ని కొనసాగిస్తుంది. @TelanganaCMO #CongressFailedTelangana #CongressBetrayedTelangana
2
3
13
93