Joined November 2013
9,784 Photos and videos
❇️ Mahabubnagar people will reject Congress and Revanth Reddy: @KTRBRS ❇️ Revanth Reddy Bbetraying Palamuru by neglecting the Palamuru-Rangareddy Project, Says KTR ❇️ Defeat for Revanth Reddy in Kodangal is Inevitable ❇️ KTR reviews political situation with leaders of Mahabubnagar District ❇️ BRS Party's clean sweep in the district certain in the next elections, KTR expresses confidence ❇️ Congress failures must be exposed; BRS development must reach the people, KTR directs leaders 👇 BRS Working President KTR asserted that the people of Mahabubnagar have fully understood the injustice being done to the district by the Congress government and will decisively reject the party in the upcoming elections. He stated that the people of Mahabubnagar would politically drive Congress and Chief Minister Revanth Reddy out of the district. KTR accused Chief Minister Revanth Reddy of betraying the interests of the region by sidelining the nearly completed Palamuru-Rangareddy Lift Irrigation Scheme. He alleged that the government was neglecting a project capable of irrigating lakhs of acres of farmland while prioritising commissions and contracts. According to KTR, the people have recognised this betrayal and will respond appropriately in the next elections. He further remarked that although Revanth Reddy repeatedly claims to be a son of Mahabubnagar, his government has failed the district in every sector. KTR said that the people of Kodangal constituency would ensure Revanth Reddy's defeat in the coming elections, just as they had taught him a lesson in the past. Stating that mere announcements and publicity campaigns cannot bring development, KTR criticised the Chief Minister for focusing on politics instead of completing crucial projects and fulfilling development commitments. He expressed confidence that the people would hold the government accountable for its failures. Recalling the condition of Mahabubnagar before the formation of Telangana, KTR said the district was once known for drought and large-scale migration. He credited the BRS government under former Chief Minister K. Chandrashekar Rao (KCR) for transforming the district through extensive irrigation, welfare, and development initiatives, thereby reducing migration and improving livelihoods. KTR acknowledged that the party had failed to effectively communicate its developmental achievements during the previous elections. However, he said that after experiencing Congress rule, people are now recognising the value of the development delivered by the previous BRS government. He urged party leaders to simultaneously expose the failures of the Congress government and remind people of the achievements accomplished during the BRS administration. Particular emphasis, he said, should be placed on highlighting the injustice being done to Palamuru through the neglect of irrigation projects. KTR alleged that while the Congress party had ignored the district for six decades, depriving it of adequate drinking water and development, the current Congress government was continuing the same pattern of neglect. Earlier in the day, KTR held an extensive review meeting with leaders from the undivided Mahabubnagar district at the residence of former Minister Lakshma Reddy. The meeting was attended by former ministers, former MLAs, MLCs, and sitting legislators. During the meeting, KTR reviewed the prevailing political situation across the district and sought detailed feedback from party leaders regarding grassroots conditions. He assessed the progress of ongoing party programmes and constituency-level meetings and discussed preparations for the upcoming Special Intensive Revision of electoral rolls and the party's membership enrolment drive.
3
13
291
❇️ మహబూబ్‌నగర్ ప్రజలు కాంగ్రెస్‌ను, రేవంత్ రెడ్డిని తరిమికొడతారు ❇️ పాలమూరు ప్రాజెక్టును పక్కనపెట్టి ద్రోహం చేస్తున్నారు ❇️ కొడంగల్‌లో రేవంత్ రెడ్డికి ఓటమి తప్పదు ❇️ వచ్చే ఎన్నికల్లో జిల్లాలో బీఆర్ఎస్ క్లీన్‌స్వీప్ ఖాయం ❇️ కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలి, బీఆర్ఎస్ అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి ❇️ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నేతలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం 👇 ✳️ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చేస్తున్న అన్యాయం ప్రతి ఒక్కరికీ అర్థమైందని, రానున్న వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మహబూబ్‌నగర్ ప్రజలు సంపూర్ణంగా తిరస్కరిస్తారని కేటీఆర్ అన్నారు. ✳️ కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి ని మహబూబ్నగర్ ప్రజలు జిల్లా నుంచి తరిమికొడతారని ఆయన హెచ్చరించారు. ✳️ దాదాపుగా పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పక్కనపెట్టి, కమీషన్ల కోసం, కాంట్రాక్టుల కోసం లక్షల ఎకరాల పంటకు నీరందకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ద్రోహం ప్రతి ఒక్కరికీ అర్థమైందన్నారు. ✳️ మహబూబ్‌నగర్ బిడ్డను అని పదేపదే చెప్పుకుంటూ జిల్లా ప్రజలను మోసం చేస్తూ అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధికి ద్రోహం చేస్తున్న రేవంత్ రెడ్డిని సైతం వచ్చే ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి తరిమికొడతారని కేటీఆర్ స్పష్టం చేశారు. ✳️ రేవంత్ రెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పక్కనపెట్టి తీవ్రమైన ద్రోహం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ✳️ గతంలో మాదిరి మరోసారి కొడంగల్ నియోజకవర్గంలోనూ రేవంత్ రెడ్డికి ప్రజలు ఎన్నికల్లో గుణపాఠం చెబుతారన్నారు. ✳️ మహబూబ్‌నగర్ జిల్లా తెలంగాణ ఏర్పాటుకు ముందు వలసల జిల్లాగా, కరువు జిల్లాగా ఉండేదని, అలాంటి జిల్లాను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపి కరువును, వలసలను తరిమికొట్టిన ఘనత ముమ్మాటికి భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అని కేటీఆర్ గుర్తు చేశారు. ✳️ ఇంత గొప్పగా జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించడంలో గత ఎన్నికల్లో పార్టీ విఫలమైందని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలన చూసిన తర్వాత ప్రజలకు గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి అర్థమవుతుందన్నారు. ✳️ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఒకవైపు ప్రజల్లోకి తీసుకువెళ్తూనే, గత ప్రభుత్వ హయాంలో మనం చేసిన అభివృద్ధిని మరోసారి ప్రజలకు గుర్తుచేయాలని కేటీఆర్ సూచించారు. ✳️ ముఖ్యంగా పాలమూరు జిల్లాకు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయాన్ని ఎత్తిచూపాలన్నారు. ✳️ 60 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు తాగునీరు అందకుండా ప్రజలకు అభివృద్ధి సంక్షేమాలు అందకుండా వెనుకబాటు జిల్లాగా చేసిన ద్రోహం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సైతం కొనసాగిస్తున్నదన్నారు. ✳️ ఈరోజు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నేతలతో కేటీఆర్ సుదీర్ఘ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మాజీ మంత్రి లక్ష్మా రెడ్డి నివాసంలో జరిగిన ఈ సమావేశానికి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు అందరూ హాజరయ్యారు. ✳️ ఈ సమావేశం సందర్భంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న క్షేత్ర స్థాయి పరిస్థితులపైన కేటీఆర్ నాయకుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ✳️ పార్టీ ప్రస్తుతం కొనసాగిస్తున్న సమావేశాలు, నియోజకవర్గ స్థాయి సమావేశాల తీరును ఆయన సమీక్షించారు. ✳️ త్వరలో ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం, పార్టీ చేపట్టనున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంపైన నియోజకవర్గాల వారీగా చర్చించారు. ✳️ కేటీఆర్ పార్టీ నేతలకు రానున్న ఎన్నికలకు సంబంధించి, పార్టీ బలోపేతానికి సంబంధించి పలు అంశాలపైన దిశానిర్దేశం చేశారు. ✳️ ప్రతి గ్రామంలోని బూత్ వారీగా పార్టీని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని, ఈ దిశగా కలిసికట్టుగా పక్కా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని ఆయన సూచించారు. ✳️ ఈ సందర్భంగా పార్టీ నేతలు నియోజకవర్గాల వారీగా క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులను, ప్రజల అభిప్రాయాలను, ఫీడ్‌బ్యాక్‌ని కేటీఆర్‌కి అందించారు. ✳️ క్షేత్ర స్థాయిలో పార్టీకి ప్రజల్లో భారీగా ఆదరణ పెరిగిందని, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రతి ఒక్కరూ గుర్తించారని, కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు చేస్తున్న మోసం పట్ల తీవ్రంగా ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. ✳️ రానున్న ఎన్నికల్లో జిల్లాలో భారత రాష్ట్ర సమితి క్లీన్‌స్వీప్ చేయడం ఖాయం అని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ✳️ ప్రజల్లో ఉన్న సానుకూలతను పార్టీకి అనుకూలంగా మలుచుకోవాల్సిన అవసరం ఉన్నదని, ఆ దిశగా కార్యక్రమాలు చేపట్టాలని నేతలను ఆదేశించారు.
5
33
769
❇️ రాజకీయాలపై ఆసక్తితో తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసిన జెన్ జీ యువతులు ❇️ నేరుగా వచ్చి కేటీఆర్‌ను కలసిన నలుగురు యువతులు ❇️ లండన్‌లోని కింగ్స్ కాలేజ్, పలు ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో చేరనున్న ఈ నలుగురు యువతులు ❇️ రాజకీయ నేతలుగా ఏదగాలని తాము నిర్ణయించుకున్నామని, కలసి పనిచేస్తామని తెలిపిన యువతులు ❇️ యువత రాజకీయాల్లోకి రావాలన్నదే తన అభిమతమని.. వారి ప్రయాణంలో అండగా ఉంటామని హమీ ఇచ్చిన కేటీఆర్ 👇 ✳️ పార్టీ రాజకీయాలతో ఉండే తెలంగాణ భవన్‌లో ఈరోజు ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. ✳️ రాజకీయాల్లో ఉండే పార్టీ నేతలు, కార్యకర్తలు, సమస్యలతో వచ్చే ప్రజలే కాకుండా ఈ రోజు నలుగు జెన్ జీ యువతులు నేరుగా వచ్చి కేటీఆర్‌ను కలిసారు. ✳️ సాధారణంగా నేతలు, కార్యకర్తలు సందడి చేసే పార్టీ కార్యాలయానికి, ఉన్నత చదువుల కోసం సిద్ధమవుతున్న నలుగురు యువ విద్యార్థినులు నేరుగా వచ్చారు. ✳️ తమ భవిష్యత్తు గురించి, తమకున్న రాజకీయాసక్తుల గురించి నేరుగా తెలుసుకోవాలనే సంకల్పంతో వారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ✳️ తాము రాజకీయాల్లోకి రావాలన్న లక్ష్యంతో భవిష్యత్తును ప్లాన్ చేసుకుంటున్నామని తెలిపారు. తాము మీరు కలిసి పనిచేస్తామని కేటీఆర్‌కు తెలిపారు. ✳️ ఇప్పటికే పాఠశాల దశ నుంచి ఒక గ్రూప్‌గా తాము పాలసీ అంశాలతో.. సమాజంలో మార్పు తీసుకురావలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. ✳️ కెరీర్ మాత్రమే లక్ష్యంగా.. ఉద్యోగాల కోసం తపనపడే ఈ రోజుల్లో నలుగురు ఆడబిడ్డులు నేరుగా తనను వచ్చి కలవడంపైన కెటిఅర్ సంతోషం వ్యక్తం చేశారు. ✳️ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న ఈ యువతకు కేటీఆర్ గట్టి భరోసానిచ్చారు. ✳️ రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తితో తన దగ్గరకు వచ్చిన ఈ నలుగురిని చూసి ఆశ్చర్యపోయానని, వారితో గడిపిన క్షణాలు తనకి ఎంతో సంతోషాన్ని ఇచ్చాయని కేటీఆర్ పేర్కొన్నారు. ✳️ ఈ నలుగురు విద్యార్థినులలో.. లండన్‌లోని కింగ్స్ కాలేజీలో పాలిటిక్స్, ఎకనామిక్స్ అండ్ ఫిలాసఫీ చదవనున్న సరయు, నల్సార్‌ లా యూనివర్సిటీ విద్యార్థిని లాస్య, సింబయాసిస్ లా స్కూల్ విద్యార్థిని రేవతి మరియు సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో బీకాం చదువుతున్న అశ్విని ఉన్నారు. ✳️ రాజకీయ పరిస్థితిని, పాలనా పరమైన అంశాలను క్షేత్రస్థాయిలో అర్థం చేసుకోవాలని వారు కోరగా, కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. ✳️ పార్టీ కార్యాలయంలోని తన బృందంతో కలిసి పనిచేసేందుకు వారికి అవకాశం కల్పిస్తామని, వారి రాజకీయ ప్రయాణంలో తగిన సూచనలు, మద్దతు అందిస్తామని హామీ ఇచ్చారు. ✳️ జెన్ జీ యువతలో ఉన్న ఈ ఆత్మవిశ్వాసం, సామాజిక బాధ్యత పట్ల వారికున్న ఆసక్తిని చూస్తుంటే భవిష్యత్తుపై కొత్త ఆశలు చిగురిస్తున్నాయని కేటీఆర్ తన పోస్ట్‌లో వ్యాఖ్యానించారు. ✳️ చివరగా, తమ భవిష్యత్తు లక్ష్యాలను, రాజకీయాలపై తమకున్న దృక్పథాన్ని పంచుకున్న ఈ యువతులు, పార్టీ కార్యాలయంలో గడిపిన సమయం తమకు ఎంతో ప్రేరణనిచ్చిందని పేర్కొన్నారు. ✳️ రాజకీయాల్లోకి కొత్తతరం రావాలని, అప్పుడే సమాజంలో మార్పు వస్తుందని భావిస్తున్న తరుణంలో ఈ విద్యార్థినులు అలోచనలు తనకు ఏంతో సంతోషాన్నిచిందని కేటీఆర్ అన్నారు. ✳️ వీరు భవిష్యత్తులో గొప్ప నాయకులుగా ఎదుగుతారని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ✳️ కేటీఆర్‌తో కాసేపు మాట్లాడిన ఈ యువతులు.. త్వరలో తమ బృందంలో కలిసి వస్తామని తెలిపారు. ✳️ కేటీఆర్‌ను నేరుగా కలిసి మాట్లాడటం వల్ల ఎంతో స్ఫూర్తి నింపిందన్నారు.
5
34
1,020
❇️ రేవంత్ రెడ్డి సొంత పార్టీ నేతలనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ❇️ రేవంత్ అక్రమాలు, స్కాములను అధిష్టానంకు చెప్పినందుకే మీనాక్షి నటరాజన్‌పై రేవంత్ రెడ్డి దొంగ కేసు ❇️ తాను పెట్టిన దొంగ కేసును బీజేపీకి ఇచ్చి.. మీనాక్షికి పదవి రాకుండా చేసిండు ❇️ ప్రజాస్వామ్య దేశంలో హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకుంటున్నానని సీఎం ప్రకటించడం సిగ్గుచేటు ❇️ కాంగ్రెస్ పాలన 'అట్టర్ ఫ్లాప్' సినిమానే* ❇️ ఇంటర్వల్‌కే అట్టర్ ప్లాప్ అయిన పాలన కాంగ్రెస్ ప్రభుత్వానిది ❇️ సగం పాలనా కాలం హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలం ❇️ ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 👇 ✳️ రేవంత్ రెడ్డి చేస్తున్న నీచ రాజకీయాలను ప్రస్తావిస్తూ, ఆయన సొంత పార్టీ నేతలనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి అని కేటీఆర్ విమర్శించారు. ✳️ మీనాక్షి నటరాజన్‌కు టిక్కెట్ రాకుండా అడ్డుకోవడమే కాకుండా, తప్పుడు కేసులు పెట్టించడం రేవంత్ రెడ్డి కక్షపూరిత రాజకీయాలకు నిదర్శనమని పేర్కొన్నారు. ✳️ రేవంత్ రెడ్డి సొంత పార్టీ వాళ్ళనే వెన్నుపోటు పొడిచారన్నారు. ✳️ కాంగ్రెస్‌లో ఉన్న కొంత మంది వ్యక్తుల్లో మీనాక్షి నటరాజన్ నిజాయితీగల మనిషి.. రాహుల్ గాంధీకి నమ్మిన బంటు అన్న కెటిఅర్ అమెపై రేవంత్ రెడ్డి కుట్ర చేశారన్నారు. ✳️ తెలంగాణలో రేవంత్ రెడ్డి భూములు, కాంట్రాక్టులు అమ్ముకుంటున్నాడు, అడ్డగోలు అవినీతి చేస్తున్నాడని మీనాక్షి నటరాజ్ రాహుల్ గాంధీకి చెప్పినందుకే రేవంత్ పగపట్టారన్నారు. ✳️ అందుకే మీనాక్షి నటరాజనం మీద రేవంత్ రెడ్డి హైదరాబాదులో దొంగ కేసు పెట్టించారన్నారు. ✳️రేవంత్ రెడ్డి చేసిన కుట్ర సమాచారం కూడా లేని అమె రాజ్యసభకు నామినేషన్ వేసిందన్నారు. ✳️ కానీ రేవంత్ రెడ్డి తాను పెట్టిన దొంగ కేసు వివరాలు బీజేపీకి ఇచ్చారని అరోపించారు. ✳️ ఇలా ప్రజలకే కాకుండా సొంత పార్టీ వాళ్లకి గుండు కొట్టి, శఠగోపం పెట్టిన దొంగ రేవంత్ రెడ్డి అని తీవ్ర అరోపణలు చేశారు. ✳️ ప్రజాస్వామ్య దేశంలో హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకుంటున్నానని సీఎం ప్రకటించడం సిగ్గుచేటు అని ఆయన ధ్వజమెత్తారు. ✳️ రేవంత్ రెడ్డి పాలనను "అట్టర్ ఫ్లాప్"గా అభివర్ణించిన కేటీఆర్, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ✳️ సినిమా ట్రైలర్ చూడగానే హిట్ లేదా ఫ్లాప్ అని తెలిసినట్లే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటర్వెల్‌కే ఫ్లాప్ అని తేలిపోయిందని, ఈ రెండున్నర ఏళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు.. కాంగ్రెస్ పాలనకు మిగిలిండ్ ఏండ్ కార్డే అన్నారు. ✳️ అడ్డగోలుగా హమీలిచ్చిన అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. అందరినీ మోసం చేస్తున్నదన్నారు. ✳️ సగంకాలం ముగిసినా ఒక్క హమీల అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను ఒక అట్టర్ ప్లాప్ సినిమాతో పోల్చారు. ✳️ నిరుద్యోగుల సమస్యలను ప్రస్తావిస్తూ, మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ✳️ ఇప్పటివరకు 4 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని, అలాగే నిరుద్యోగ భృతి రూ. 4 వేల హామీని కూడా గాలికొదిలేశారని దుయ్యబట్టారు. ✳️ కేటీఆర్, కేసీఆర్ ఉద్యోగాలు ఊడగొట్టారని ఆరోపించిన రేవంత్, ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయడం లేదని నిలదీశారు. ✳️ మహిళా హామీపై స్పందిస్తూ, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి, అది నెరవేరితే నిరూపించాలని, లేని పక్షంలో తాను రాజీనామాకు సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరారు. ✳️ ఒక్కో లబ్ధిదారునికి ప్రభుత్వం రూ. 1.25 లక్షలు బాకీ ఉందని గుర్తుచేశారు. ✳️ ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేను కాంగ్రెస్‌లో చేర్చుకోవడం ప్రజా తీర్పును అవమానించడమేనని అన్నారు. ✳️ త్వరలో ఉపఎన్నికలు వస్తాయన్న కెటిఅర్ ఆ ఉప ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పి, మళ్లీ బీఆర్ఎస్‌ను గెలిపిస్తారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ✳️ కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను కనుమరుగు చేయాలని కాంగ్రెస్ ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కాదని, ప్రజలు ఈ అసమర్థ పాలనను ఇంకా రెండున్నర ఏళ్లు భరించాల్సి రావడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. ✳️ హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తున్న ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ✳️ కనీసం ఒక్క ఇటుక కూడా కొత్తగా పేదలకు ఇళ్లు కట్టించని ప్రభుత్వం, ఉన్న ఇళ్లను కూల్చివేయడం దుర్మార్గమని అన్నారు. ✳️ కేసీఆర్ పాలనలో పేదలకు అందిన సాయాన్ని, ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యాన్ని ఆయన ఎండగట్టారు. ✳️ "జీవో నెంబర్ 50 ద్వారా పేదలకు పట్టాలిచ్చిన ఘనత కేసీఆర్‌ది. హైదరాబాద్‌లో ఇటుక కూడా వేయని కాంగ్రెస్, హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చివేయడం దుర్మార్గం" అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
1
5
11
337
✳️ విద్యుత్ మరియు మంచినీటి సమస్యలపై కేటీఆర్ మాట్లాడుతూ, "2014కు ముందు హైదరాబాద్‌లో కరెంట్ సమస్యలు ఉండేవి, కానీ కేసీఆర్ పాలనలో 24 గంటల నిరంతర విద్యుత్ అందించాం. ఎండాకాలం వచ్చిందంటే కుండలతో ధర్నా చేసే పరిస్థితి ఉండేది, కేసీఆర్ వచ్చాక ఆ పరిస్థితి మారిపోయింది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక, హైదరాబాద్‌లోని ప్రతి ఇంటికి రక్షిత మంచినీటిని ఉచితంగా అందిస్తాం. 20 వేల లీటర్ల ఉచిత నీటిని అందించిన ఘనత కేసీఆర్‌దే" అని స్పష్టం చేశారు. ✳️ ఆరోగ్య రంగంలో BRS ప్రభుత్వం చేసిన కృషిని కేటీఆర్ గుర్తుచేశారు. ✳️ "నిజాం కాలం తర్వాత కాంగ్రెస్ 60 ఏళ్ల పాలనలో ఒక్క పెద్ద ఆస్పత్రి నిర్మించలేదు. కానీ కేసీఆర్ నాలుగు TIMS ఆస్పత్రులను, వెయ్యి పడకల ఆస్పత్రిని నిర్మించారు. 350 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసి, బసవతారకం ఆస్పత్రిలో పేద రోగుల సహాయకుల కోసం ధర్మశాలలు కట్టించారు. రూ. 5 అన్నపూర్ణ భోజన పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం మనది. అన్నపూర్ణ పేరును తొలగించి ఇందిరమ్మ పేరు పెట్టడం కాంగ్రెస్ దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనం" అని ఆయన విమర్శించారు. ✳️ ఖైరతాబాద్ నియోజకవర్గ రాజకీయాలపై స్పందిస్తూ,బీఖైరతాబాద్‌లో రెండుసార్లు గులాబీ జెండా ఎగురవేశాం, మూడోసారి కూడా సిద్ధం కావాలి. దానం నాగేందర్ నియోజకవర్గ ప్రజలను మోసం చేసి రేవంత్ పక్కన కూర్చున్నారు. ✳️ కాంగ్రెస్ గుర్తుతో గెలిచిన దానం నాగేందర్ వల్ల త్వరలో ఇక్కడ ఉప ఎన్నిక రావడం ఖాయం. ప్రతి ఓటు విలువైనది, జూబ్లీహిల్స్‌లో లాగా దొంగ ఓట్లతో గెలిచేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోంది. కాబట్టి బూత్ లెవెల్ ఏజెంట్లు ప్రతి ఓటును జాగ్రత్తగా గమనించాలి" అని పిలుపునిచ్చారు. ✳️ చివరగా, రాబోయే కార్యక్రమాలపై దిశానిర్దేశం చేస్తూ, "జూన్ 25 నుంచి జూలై 31 వరకు జరిగే SIR (సమగ్ర ఇంటింటి సర్వే) నమోదులో ప్రతి బూత్ లెవెల్ ఏజెంట్ బాధ్యతగా పనిచేయాలి. పార్టీ సభ్యత్వ నమోదును రికార్డు స్థాయిలో డిజిటల్ పద్ధతిలో నిర్వహించాలి. త్వరలోనే కొత్త కమిటీలు వేయబోతున్నాం, టికెట్ ఆశించే వారు ప్రజల్లోకి వెళ్లి పనిచేయాలి. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ సచివాలయానికి ఆయన పేరు పెట్టారు. అంబేద్కర్ చెప్పినట్లుగా జనగణన మరియు ఓటరు నమోదు ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి" అని కేటీఆర్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
238
❇️ కాంగ్రెస్ ప్రభుత్వం ‘ఫస్ట్ హాఫ్’ పూర్తిగా విఫలం ❇️ అన్ని రంగాల్లో రేవంత్ పాలనా వైఫల్యం ❇️ రైతుబంధును బలహీనపరిచి ‘రాహుల్ బంధు’ ❇️ కరెంటు కోతలు, ఎరువుల తిప్పలు… పంట కొనుగోలు సంక్షేభాలతో ఆనాటి రోజులను కాంగ్రెస్ తెచ్చింది ❇️ మళ్లీ కేసీఆర్ నాయకత్వమే రాష్ట్రానికి అవసరం ❇️ ప్రజలు, కార్యకర్తలే బీఆర్ఎస్ బలం ❇️ వేములవాడ, సిరిసిల్లలో జరిగిన పార్టీ సమావేశాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 👇 ✳️ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మరియు సిరిసిల్ల నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విస్తృతంగా పర్యటించారు. ✳️ ఈ సందర్భంగా నిర్వహించిన డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో ఆయన పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ✳️ ఈ పర్యటనలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ✳️ ప్రస్తుతం ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఈ ప్రభుత్వం మొదటి అంకం (ఫస్ట్ హాఫ్) పూర్తిగా విఫలమైందని కేటీఆర్ విమర్శించారు. ✳️ సినిమా ఫస్ట్ హాఫ్ డిజాస్టర్ అయినప్పుడు సెకండ్ హాఫ్ పట్ల ఎలాంటి ఆశలు ఉండవో, ఈ ప్రభుత్వ పనితీరు కూడా అలాగే ఉందన్నారు. ✳️ అమ్మ విలువ, అన్నం విలువ అవి లేనప్పుడే తెలుస్తాయని, ఇప్పుడు ప్రజలు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ✳️ ప్రభుత్వం ‘తరుగు’ పేరుతో రైతులను నిలువునా మోసం చేస్తోందని, ఎరువుల దుకాణాల వద్ద రైతులు మళ్లీ పాత రోజుల మాదిరిగా క్యూల్లో నిలబడే దుస్థితి వచ్చిందని మండిపడ్డారు. ✳️ ధాన్యం కొనుగోలుకు సంచులు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే, రాహుల్ గాంధీకి మాత్రం సంచుల సంచులు డబ్బులు వెళ్తున్నాయని ఆరోపించారు. ✳️ రైతుబంధును బలహీనపరిచి ‘రాహుల్ బంధు’ మొదలుపెట్టారని, తెలంగాణ డబ్బును దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ✳️ రాష్ట్రాన్ని భారీ అప్పుల్లోకి నెట్టారని, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎన్నికల ముందు బాండ్ పేపర్ రాసిస్తానన్న హామీలను ఇప్పటికీ అమలు చేయలేదని, దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ✳️ రేవంత్ రెడ్డి రాజకీయ తీరుపై కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ✳️ హిట్లర్ తనకు స్ఫూర్తి అని చెప్పుకున్న రేవంత్ రెడ్డి నుంచి ప్రజలు ఇంకేం ఆశించలేరని, ఆయనకు డైలాగులు ఎక్కువ-పని తక్కువ అని ఎద్దేవా చేశారు. ✳️ మీనాక్షి నటరాజన్‌కు అవమానం జరిగేలా వ్యవహరించిన వ్యక్తి రేవంత్ రెడ్డేనని ఆరోపించారు. ✳️ ప్రజలు పాలు ఇచ్చే బర్రెను వదిలి, తన్నే దున్నపోతును తెచ్చుకున్నట్లుగా కాంగ్రెస్‌ను ఎన్నుకున్నారని వ్యాఖ్యానించారు. ✳️ తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కేసీఆరేనని, మళ్లీ కేసీఆర్ నాయకత్వమే రాష్ట్రానికి అవసరమని స్పష్టం చేశారు. ✳️ చీకట్లో చిరుదీపంలా కేసీఆర్ పార్టీని ప్రారంభించారని, ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో టీడీపీ, టీఆర్ఎస్ మాత్రమే నిలబడి గెలిచాయని కేటీఆర్ గుర్తుచేశారు. ✳️ కేసీఆర్ 15 లక్షల పెళ్లిళ్లు, మెడికల్ కాలేజీలు, గురుకులాలు, కాళేశ్వరం వంటి అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, రేవంత్ రెడ్డి తెలంగాణకు చేసిందేమిటో చెప్పాలని సవాల్ విసిరారు. ✳️ రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ ఉన్నప్పటికీ, ఇటీవల సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటిందని, అధికారం లేకపోయినా ప్రజల ఆదరణ బీఆర్ఎస్‌పై ఏమాత్రం తగ్గలేదని పేర్కొన్నారు ✳️ "నాకు జన్మనిచ్చింది శోభమ్మ అయితే, రాజకీయంగా పునర్జన్మనిచ్చింది సిరిసిల్ల ప్రజలే" అని కేటీఆర్ భావోద్వేగంతో చెప్పారు. ✳️ ఒక్క రూపాయి పంచకుండా, ఒక్క చుక్క మద్యం పంచకుండా ప్రజల ఆశీర్వాదంతో గెలిచినందుకు సిరిసిల్ల ఎమ్మెల్యేగా గర్వపడుతున్నానని తెలిపారు. ✳️ తన శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు సిరిసిల్ల అభివృద్ధే తన లక్ష్యమని, కార్మిక, ధార్మిక క్షేత్రమైన సిరిసిల్లను కేసీఆర్ నాయకత్వంలో జిల్లాగా మార్చి రూపురేఖలు మార్చామని చెప్పారు. ✳️ బతుకమ్మ చీరల పథకం వెనుక ఉన్న సామాజిక, ఆర్థిక కోణాన్ని రేవంత్ రెడ్డి అర్థం చేసుకోలేదని, తంగళ్లపల్లికి సముద్రం లాంటి సాగునీరు తెచ్చింది కేసీఆర్ అని గుర్తుచేశారు. ✳️ తిరిగే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కార్యకర్తకి అన్ని రకాలుగా అండగా ఉండి వారి జీవితంలో మరిన్ని సానుకూలమైన మార్పులు వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. అధికారం పోయిన తర్వాత కూడా లక్షల మంది పార్టీ కార్యకర్తలు పార్టీ వెంట నిలబడ్డారని.. కార్యకర్తలే పార్టీకి అసలైన బలం అన్నారు. ✳️ "మన బలం – మన బలగం" కార్యక్రమంలో పాల్గొన్నారు. డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
1
5
12
355
✳️ ప్రతి కార్యకర్త తమ బూత్‌లో మెజారిటీ సాధించేలా కృషి చేయాలి. సిరిసిల్లలో 287 బూత్‌లు ఉన్నాయి, ప్రతిచోటా నిబద్ధతతో పనిచేయాలి. బీజేపీ, కాంగ్రెస్ దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్నాయి, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓట్లను గుర్తించి తొలగించాలి. పెరిగిన జనాభాకు అనుగుణంగా ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జనగణన జరగాలని సూచించారు. ✳️ ఈ నెల 25 తర్వాత వేములవాడలోని ప్రతి మండలాన్ని సందర్శించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటానని హామీ ఇచ్చారు. ✳️ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించి బీఆర్ఎస్‌ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, గులాబీ జెండాను ఎవరూ అడ్డుకోలేరని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ✳️ ప్రజల సహకారంతో మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు.
226
నా మీద కోపముంటే రెండు కేసులు ఎక్కువ పెట్టండి.. కానీ నేతన్నల మీద పగ పట్టకండని రేవంత్ రెడ్డికి చెప్పాను. కానీ రేవంత్ మూర్ఖంగా వ్యవహరించి బతుకమ్మ చీరల పథకంతో పాటు ఎన్నో పథకాలు బంద్ పెట్టిండు. - సిరిసిల్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
4
10
212
అధికారం ఎవరికి శాశ్వతం కాదు.. కానీ పుష్కర కాలం తర్వాత తెలంగాణ ఇప్పుడు ముష్కరుల చేతులో పడ్డది. - సిరిసిల్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
2
16
192
సొంత పార్టీ నాయకులకే న్యాయం చేయలేని రేవంత్ రెడ్డి.. రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తడు? కాంగ్రెస్ పార్టీలో పైసలకు పోస్టులు అమ్ముకుంటున్నరని కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ నిజాయితీగా చెప్పిండు. డబ్బులు తీసుకొని సీఎం పోస్ట్ ఇచ్చిండు కాబట్టే, రాహుల్ గాంధీ కూడా రేవంత్ రెడ్డిని ఏం చేయలేకపోతున్నడు. మీనాక్షి నటరాజన్ మీద కోపంతోనే రేవంత్ రెడ్డి మధ్యప్రదేశ్ బీజేపీ నాయకులకు ఒక దొంగ కేసు గురించి ఉప్పు అందించి, నామినేషన్ ఎగిరిపోయేలా చేసిండు. - వేములవాడలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
4
11
367
రేవంత్ రెడ్డి ఆయనే తెలంగాణ సాధించినట్లు మాట్లాడుతున్నడు.. సమయం బాలేనప్పుడు వానపాములు కూడా నాగుపాముల లాగా బుస కొడతయి. అమ్మ విలువ, అన్నం విలువ.. లేనప్పుడే తెలుస్తది. కాంగ్రెస్ ఇచ్చిన అభయహస్తం మ్యానిఫెస్టో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం.. కాంగ్రెస్ పార్టీ అందరిని బురిడీ కొట్టించింది. - వేములవాడలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
3
11
342
❇️ బీఆర్ఎస్ పాలనలోనే హైదరాబాద్ బాగుండే ❇️ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐదు రోజులకొకసారి లోప్రెజర్ నీటి సరఫరా ✳️ నిలిచిపోయిన ఫ్లైఓవర్ పనుల వల్ల ప్రయాణాల్లో తీవ్ర నరకం ❇️ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి సమస్యలు విన్నవించిన ఐటీ ఉద్యోగులు, కొంపల్లి శ్వేతా శుభం రెసిడెన్సీ వాసులు ❇️ వారికి అండగా ఉంటామని కేటీఆర్ హామీ ✳️ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరంలో మౌలిక వసతుల వ్యవస్థ పూర్తిగా కుంటుపడిందని, బీఆర్ఎస్ పాలనలోనే హైదరాబాద్ ఎంతో బాగుండేదని కొంపల్లి సర్కిల్ శ్వేతా శుభం రెసిడెన్సీ వాసులు, ఐటీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ✳️ ఈరోజు శ్వేతా శుభం రెసిడెన్సీ అసోసియేషన్ ప్రతినిధులు, ఐటీ ఉద్యోగులు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను నంది నగర్‌లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ✳️ ఈ సందర్భంగా ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో తాము ఎదుర్కొంటున్న పలు తీవ్రమైన సమస్యలను కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ✳️ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రోజు విడిచి రోజు నిరంతరాయంగా తాగునీటి సరఫరా జరిగి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేవాళ్ళమని, కానీ ప్రస్తుత ప్రభుత్వంలో ఐదు రోజులకు ఒకసారి, అది కూడా తీవ్రమైన 'లో ప్రెజర్'తో నీళ్లు వస్తుండటంతో రోజువారీ జీవితం నరకంగా మారిందని వాపోయారు. ✳️ బోయిన్‌పల్లి నుంచి సుచిత్ర, కొంపల్లి మీదుగా మేడ్చల్ వరకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఫ్లైఓవర్ పనులు పర్యవేక్షణ లోపంతో గత రెండేళ్లుగా పూర్తిగా నిలిచిపోయాయని, దీనివల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ✳️ కొంపల్లి మీదుగా మేడ్చల్ వరకు మెట్రో విస్తరణ చేపడతామని చెప్పిన ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం.. ఆ దిశగా ఎటువంటి ముందడుగు వేయడం లేదని మండిపడ్డారు. ✳️ రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్‌తో ప్రయాణ సమయం రెట్టింపు అవుతోందని, ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గారు అసెంబ్లీ లోపల, బయట ప్రభుత్వాన్ని నిలదీసినా ఈ ప్రభుత్వంలో చలనం లేదని విన్నవించారు. ✳️ రెసిడెన్సీ వాసుల సమస్యలపై కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "మన బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేలాది కోట్ల రూపాయల నిధులతో మౌలిక వసతులను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేశాం. నగరానికి భారీగా పెట్టుబడులను తీసుకువచ్చాం. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఉన్న మౌలిక వసతులను కూడా నిర్వహించలేని అద్వాన స్థితిలోకి దిగజారింది" అని విమర్శించారు. ✳️ శ్వేతా శుభం రెసిడెన్సీ వాసులందరికీ తాము అండగా ఉంటామని, తాగునీటి సమస్య పరిష్కారం కోసం, నిలిచిపోయిన ఫ్లైఓవర్ పనులను వెంటనే పునఃప్రారంభించేలా చేయడం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. ✳️ అలాగే, నార్త్ సిటీ (కొంపల్లి-మేడ్చల్) రూట్‌లో మెట్రోను సాధించే వరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం కొనసాగిస్తామని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ✳️ ఈ కార్యక్రమంలో శ్వేతా శుభం రెసిడెన్సీ వాసులు, ఐటీ రంగ ఉద్యోగులు మరియు స్థానిక బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
1
5
39
1,406
❇️ భూపాలపల్లిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సింగరేణి కార్మికుల సదస్సులో సింగరేణిలో జరుగుతున్న అవినీతి బాగోతాలను పీపీటీ ద్వారా వివరించిన మాజీ మంత్రి హరీష్ రావు 👇 ✳️ సింగరేణి తెలంగాణకు వరం. దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేని సంపద తెలంగాణకు సొంతం. ✳️ 137 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణిని కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణాల గనిగా మార్చింది. ✳️ ఫిక్స్‌డ్ డిపాజిట్లతో కలకల లాడిన సింగరేణి నేడు అప్పులు ఊబిలో కూరుకుపోయింది. ✳️ రెండున్నరేండ్లలో కార్మికుల బతులకును ఆగం పట్టించింది. ఒక యూనియన్, ఒక పార్టీకి సంబంధించింది కాదు, యావత్ తెలంగాణకు సంబంధించిన విషయం. ✳️ మట్టిని, ఇసుకను, బట్టలు, బూట్లు, కోడిగడ్లు, సింగరేణి బొగ్గులో అన్నింట్లో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి చేస్తున్నది. ✳️ ఉద్యమ పార్టీగా, 10 ఏళ్లు తెలంగాణను అభివృద్ది చేసిన బీఆర్ఎస్ పార్టీకి సింగరేణిని కాపాడాల్సిన బాధ్యత ఉంది. ✳️ పదహారున్నర వేల మంది పిల్లలకు కారుణ్య నియామకాలు ఇచ్చింది బీఆర్ఎస్. ✳️ కారుణ్య నియామకాలపై విచారణ జరిపింది, ఉద్యోగాలు ఊడగొట్టే ప్రయత్నం చేసింది కాంగ్రెస్. ✳️ మెడికల్ అన్‌ఫిట్ చేయకుండా కార్మికులు, వారి కుటుంబాలకు నరకం చూపిస్తున్నారు. ✳️ మేం గోదావరి ఖనిలో ప్రశ్నిస్తే భయపడి పెండింగ్‌లో ఉన్న 400 ఉద్యోగాలు ఇస్తామని ఈరోజు భట్టి విక్రమార్క గారు ప్రకటించారు. ✳️ మానవత థృక్పతంతో కారుణ్య నియామకాలు చేస్తం అంటున్నారు. ✳️ మన పోరాటం కొంత ఫలించింది. ఇది బీఆర్ఎస్, కార్మికులు చేస్తున్న పోరాట ఫలితం. ✳️ పీపీటీ పెట్టి మేం వదిలిపెట్టం, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో అవినీతిపై నిలదీస్తం. ✳️ ఇలాగే వదిలిపెడితే సింగరేణిని ప్రైవేటుపరం చేస్తరు ఒకటో తేదీ జీతాలు రావాంటే బ్యాంకుల్లో అప్పులు తేవాల్సిన పరిస్థితి. ✳️ సైట్ విజిట్ స్కాం, సోలార్ పవర్ స్కాం, జైపూర్ పవర్ స్కాం, 40లక్షల బొగ్గు మాయం స్కాం, ఎక్సప్లోజివ్ స్కాం ఇలా అనేక స్కాంలు చేసారు. ✳️ సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టారు. టెండర్ వేయాలంటే బొగ్గు బాయి వెళ్లి చూసి వచ్చి వేయాలి. ✳️ ఈ విధానం ద్వారా మొట్టమొదటి లబ్ధిదారుడు రేవంత్ బామ్మర్ది సృజన్ రెడ్డి. ఈయనకే మొదటి టెండర్ లభించింది. ✳️ సైట్ విజిట్ సర్టిఫికేట్ అనేది కోల్ ఇండియాలో లేదు, వెస్ట్రన్ కోల్ ఫీల్డ్‌లో లేదు, రేవంతు ప్రభుత్వం రాకముందు లేదు. ✳️ వెంకటేష్ ఖనిలో రేవంతు బామ్మర్ది శోధా కన్సస్ట్రక్షన్‌కు ప్లస్ 13 శాతంతో టెండర్ దక్కింది. ✳️ ఒక్క శోధా టెండర్‌లోనే దాదాపు రూ. 50 కోట్లు సింగరేణికి నష్టం. ✳️ సైట్ విజిట్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత అన్ని టెండర్లు ఎక్సెస్‌కు వెళ్లాయి.. వందల కోట్లు టెండర్లు చేసారు. ✳️ నేను ఛాలెంజ్ చేస్తున్నా.. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సింగరేణిలో సైట్ విజిట్ సర్టిఫికేట్ ఉందా. ✳️ బీఆర్ఎస్ ఉన్నపుడు మైనస్ పోయిన ఓబీ టెండర్లు, రేవంత్ రాగానే ఎక్సెస్ ఎందుకు పోయాయి. ✳️ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ✳️ శ్రీరాంపూర్ ఓసీ టెండర్‌ను ఏడుసార్లు వాయిదా వేసారు. ✳️ కమీషన్లు కుదరడం లేదని, రేవంత్ బామ్మర్ది వాయిదా వేయించారు. ✳️ మనం బయటపెట్టగానే టెండర్లు ఓపెన్ చేసారు. అది రూ. 600 కోట్ల టెండర్ మనం బయట పెట్టగానే మైనస్ 12కు పోయింది. సింగరేణి సొమ్ము ఆదా అయ్యింది. ✳️ కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల కోసం సోలార్ ప్లాంట్లు మొదలు పెట్టింది. ✳️ మేమే సోలార్ పవర్ కొనము అని విద్యుత్ సంస్థల నుంచి సర్క్యులర్ ఉంది. ✳️ అయినా 67,107 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తం అని టెండర్లు ఇచ్చారు. ✳️ వేరే వాళ్లు టెండర్‌లో పాల్గొనకుండా, నియమ నిబంధనలు మార్చి టెండర్లు కట్టబెట్టారు. ✳️ మూడు కోట్లకు మెగావాట్ తయారు అయితే, ఏడు కోట్లకు ఇచ్చారు. ✳️ 67 మెగావాట్ ప్లాంట్ విషయంలో దాదాపు రూ. 250 కోట్లు అదనంగా కాంట్రాక్టర్‌కు కట్టబెట్టారు. ✳️ 107 మెగావాట్ ప్లాంట్ విషయంలో మెగావాట్ రూ. 5.4 కోట్లకు కట్టబెట్టారు.. అంటే రూ. 540 కోట్లు. ✳️ రూ. 480 కోట్లతో కట్టిన 67 మెగావాట్ల ప్లాంట్ కట్టి రెండేళ్లు అవుతున్నది. సింక్రనైజ్ చేయలేదు, పీపీఏ లేదు. నిరుపయోగంగా మారిపోయింది. ✳️ అప్పులు తెచ్చి కమీషన్ల కోసం ప్లాంట్లు పెట్టారు. ✳️ 107 మెగావాట్ల ప్లాంట్‌ను రూ. 580 కోట్లతో టెండర్ పిలిచారు. ✳️ దీనికి కూడా పీపీఏ లేదు, సింక్రనైజ్ లేదు. మూలనపడి ఉంది. ✳️ ఎన్నిసార్లు మాట్లాడినా సింగరేణి సప్పుడు చేయడం లేదు. తేలు కుట్టిన దొంగలు లాగా ఉంటున్నారు. ✳️ జైపూర్ పవర్ స్కాం.. జైపూర్‌లో 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేసింది సింగరేణి. ✳️ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మరొక ప్లాంట్ ఏర్పాటు చేస్తం అని ప్రారంభించింది. ✳️ ఎప్పుడైనా ప్లాంట్ పెడితే పీపీఏ చేసుకోవాలి.
1
3
12
256
✳️ కానీ వీళ్లు 800 మెగావాట్ల ప్లాంటు జైపూర్‌లో పెడితే రాష్ట్ర ప్రభుత్వంతో పీపీఏ లేదు, డీపీఆర్ ఆమోదం కాలేదు.. కానీ టెండర్లు పిలిచారు. వాళ్ల అనుయాయులకు టెండర్లు కట్టబెట్టారు. ✳️ ఇప్పటికే వెయ్యి కోట్లు ఖర్చు చేసారు. ✳️ పోయి రాజస్థాన్‌తో 76:24 నిష్పత్తితో ఒప్పందం చేసుకున్నరు. ✳️ మా 24 శాతం వాటా కింది పాకిస్థాన్ బార్డర్ జైసల్మేర్‌లో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు జాగా ఇస్తం అన్నరు. ✳️ బొగ్గు ఉత్పత్తి చేసే సంస్థ జైసల్మేర్‌లో సోలార్ ప్లాంట్ పెట్టడం ఎందుకు ✳️ సింగరేణి అధికారులను తీసుకువెళ్లి జైపూర్‌లో పెట్టారు. ✳️ దీపం ఉన్నపుడే ఇల్లు సక్కబెట్టుకోవాలని సింగరేణిని ఆగం పట్టిస్తున్నరు. ✳️ జైపూర్ పవర్ ప్లాంట్‌కు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్ ఆమోదం చెప్పలేదు, పీపీఏ ఎందుకు చేయలేదు. ✳️ రాజస్థాన్ కొనది, తెలంగాణ కొనది మరి ఎందుకు జైసల్మేర్‌లో ప్లాంట్. ✳️ మేధావుల మౌనం, దేశానికి ప్రమాదం.. ఇవన్నీ తెలిసి మేం మౌనంగా ఉండాలా. ✳️ కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, నామీద కేసులు పెడుతున్నరు. ✳️ అక్రమ కేసులకు, నీ తాటాకు చప్పుళ్లకు బీఆర్ఎస్ భయపడదు. ✳️ జైపూర్ పవర్ ప్లాంట్‌పై భట్టి గారు సమాధానం చెప్పండి. ✳️ సింగరేణిలో బొగ్గు నిల్వల కుంభకోణం.. భూపాలపల్లి బొగ్గుబాయి మీద 3లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు లేదు. ✳️ నేను 40 లక్షల టన్నుల బొగ్గు మాయం అయ్యింది అంటే ఎవరూ సప్పుడు చేయడం లేదు. ✳️ నేను ఇది బయటపెట్టగానే.. కవర్ చేసే ప్రయత్నం చేశారు. ✳️ 2025 ఏప్రిల్, మే, జూన్ నెల రెండు నెలల 12 రోజుల్లో ఉత్పత్తి చేసిన బొగ్గు కోటి 20 లక్షల టన్నులు. ✳️ ఈ ఏడాది అదే సమయానికి చేసిన ఉత్పత్తి 93 లక్షల టన్నులు. ✳️ అంటే 31 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును కవర్ చేస్తూ వస్తున్నరు.. స్టాక్ ఎత్తినట్లు చూపిస్తున్నరు. ✳️ అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు ఉత్పత్తి బంద్ అయ్యి రెండేళ్లు అయ్యింది. ✳️ అయినా అక్కడ లక్షా 81 వేల టన్నుల స్టాక్ ఉన్నట్లు చూపిస్తున్నరు. ✳️ రామగుండం, భూపాలపల్లి గనుల్లో లేని బొగ్గును తెచ్చి పోస్తున్నరు. ✳️ మేం వేళ్లి చూస్తాం అంటే మైన్ సేఫ్టీ అంటూ మమ్మల్ని అడ్డుకున్నరు. ✳️ ఎక్స్‌ప్లోజివ్స్ స్కాం.. బొగ్గు బావుల్లో వాడే జిటిటెన్ స్టిక్స్ కొనుగోళ్లలో కూడా స్కాం చేసింది కాంగ్రెస్. ✳️ వెస్ట్రన్ కోల్ ఫీల్డ్‌లో ఎంఎంటీ కాస్ట్ ధర రూ. 37 వేలు ఉంటే, సింగరేణిలో రూ. 44 వేలు పెట్టి కొన్నరు. ఒక్క ఆర్డర్‌లోనే రూ. 300 కోట్ల తేడా. ✳️ జీవీ రెడ్డి అనే డైరెక్టర్ నిరాకరిస్తే, రాజీనామా చేయాలని ఒత్తిడి చేశారు.. ఆయన వెళ్లిపోయాడు. ✳️ మరొక డైరెక్టర్ వీకే శ్రీనివాస్‌ను ఒప్పుకోనందుకు జీఎంగా డిమోషన్ చేసారు. ✳️ సింగరేణిలో నిజాయితీగా ఉన్న ఈ ఇద్దరు అధికారులకు నా సెల్యూట్. ✳️ ఇన్ని కుంభకోణాల వల్ల సింగరేణిలో ఉత్పత్తి తగ్గిపోయింది. ✳️ 2023లో 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరగగా, 2025–26 నాటికి 58 మిలియన్ టన్నులకు తగ్గింది. ✳️ రాబోయే రోజుల్లో అవినీతి వల్ల ఉత్పత్తి ఇంకా తగ్గుతుంది.. దీంతో కార్మికులకు బోనస్ తగ్గుతుంది. ✳️ సింగరేణిపై బాకియల గుదిబండ పడింది. ఆర్టీఐ ద్వారా నేను స్వయంగా సేకరించిన సమాచారం ప్రకారం, పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో సింగరేణికి జెన్కో పడ్డ బకాయి కేవలం 7 వేల కోట్లు కాంగ్రెస్ రెండున్నరేండ్లలో పడ్డ బకాయిలు అక్షరాలా రూ. 12,377 కోట్లు. ✳️ డీజిల్ స్కాం.. సింగరేణిలో గతంలో డీజిల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వంటి ప్రభుత్వ సంస్థల నుంచి నేరుగా డీజిల్ కొనుగోలు జరిగేది. ✳️ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దీన్ని కూడా ఓబీ కాంట్రాక్టర్ల చేతిలో పెట్టారు. ✳️ ప్రైవేటు బంకుల నుంచి తేవడం వల్ల సింగరేణిపై అదనపు భారం పడుతున్నది. జీఎస్టీ ఇతర పన్నులు పడుతున్నయి.. కాంట్రాక్టర్లకు లాభం చేకూరుతున్నది. ✳️ కోట్లాది లీటర్లు కొనుగోలు చేస్తం కాబట్టి, ప్రతి సంవత్సరం కొన్ని వందల కోట్ల ఆర్థిక నష్టం సింగరేణికా. ✳️ సింగరేణి అభివృద్ది పేరిట మోసం చేస్తున్నారు.. భవిష్యత్తు ప్రణాళిక అంటూ లాభాల్లో చూపకుండా గతేడాది, ఈ ఏడాది 6 వేల కోట్లు పక్కన పెట్టారు. ✳️ ఈ డబ్బులు ఎక్కడ పోయాయి, ఆరు వేల కోట్ల అదనపు పైసలు ఉంటే సింగరేణి ఎందుకు అప్పులు పడింది. ✳️ ఒక నెలలో తెలంగాణ రాష్ట్రం తీసుకునే అప్పు పరిధి రూ. 3200 కోట్లు. సింగరేణి మాత్రం రూ. 4300 కోట్ల ఓడీ అంటే అప్పు చేసింది. ✳️ ఇవన్నీ ఎక్కడ పోతున్నాయి. ఎవరి జేబుల్లోకి పోతున్నాయి. ✳️ ఎవరి సొమ్ము ఎవరి పాలు అవుతున్నది. సీఎస్ఆర్ పైసలు సింగరేణి ప్రాంతంలో అభివృద్ది కోసం వాడాలి. ✳️ కానీ రేవంత్ రెడ్డి మాత్రం సింగరేణి పైసలు రూ. 100 కోట్లు తీసుకొని మెస్సీతో ఫుట్‌బాల్ ఆడిండు. ✳️ సింగరేణి ఏమవుతున్నది ఒక్కసారి ఆలోచించాలి కార్మికులారా. ✳️ ఎన్నికల మేనిఫెస్టోలో కారుణ్య నియమకాలు సరళీకృతం చేస్తమన్నరు.. ఇస్తం అన్నరు. కానీ మొత్తం బంద్ పెట్టారు.
1
1
5
193
✳️ కేసీఆర్ గారు వారం వారం మెడికల్ బోర్డు పెట్టి 16వేల కారుణ్య నియమకాలు ఇచ్చిండు. ✳️ చంద్రబాబు లెక్క గోల్డెన్ షేక్ హ్యాండ్ పెడుతం అన్నడు రేవంత్ రెడ్డి. ✳️ మేం నిలదీస్తే, ఈరోజు భట్టి గారు కారుణ్య నియామకాలు ఇస్తం అంటున్నడు. ✳️ ఇది బీఆర్ఎస్ దెబ్బ, కార్మికుల దెబ్బ. ✳️400 మందికి ఇస్తం అంటే అది మన దెబ్బ. ✳️ మేనిఫెస్టోలో చెప్పిన ఒక్క అంశం కూడా అమలు చేయలేదు. సింగరేణి కార్మికులను మోసం చూసింది. ✳️ కేసీఆర్ గారు సింగరేణి మెడికల్ కాలేజీ పెట్టారు. ✳️ 5 శాతం రిజర్వేషన్ ఇచ్చారు. కార్మికుల పిల్లలు డాక్టర్ కావాలని కేసీఆర్ గారు నిర్ణయించారు. ✳️ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా సింగరేణిలో ఎవరూ జోక్యం చేసుకోలేదు. ✳️ రేవంత్ రెడ్డి రాగానే ఆయన బామ్మర్ది వేలు పెట్టిండు సింగరేణిలో. ✳️ ఇక్కడి ఎమ్మెల్యే, మంచిర్యాల ఎమ్మెల్యేలు కూడా సింగరేణిలో వేలు పెట్టారు. ✳️ రాజకీయ జోక్యం, అవినీతి, కుంభకోణాలతో సింగరేణిని ఖతం పట్టిస్తున్నరు. ✳️ప్రైవేటీకరణ చేసేందుకు అడుగులు వేస్తున్నరు. ✳️ మేనిఫెస్టో రాసిన శ్రీధర్ బాబు గారు సింగరేణి కార్మికులకు సమాధానం చెప్పాలి. ✳️ సింగరేణిలో కేంద్రం వాటా 49 శాతం. అయినా ఇక్కడ జరుగుతున్న అవినీతిపై కిషన్ రెడ్డి, బీజేపీ మాట్లాడటం లేదు. ✳️ కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారు. ✳️ సింగరేణిని కాపాడాలంటే సింగరేణి అవినీతిపై వెంటనే సీబీఐ విచారణ, సెంట్రల్ విజిలెన్స్ ఎంక్వైరీ జరపాలని బొగ్గు మంత్రి కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. ✳️ లేదంటే ఈ అవినీతి అక్రమాల్లో మీకు భాగ్వామ్యం ఉందని నమ్మాల్సి వస్తుంది. ✳️ సింగరేణిని కాపాడాలంటే.. కాంగ్రెస్ కో హటావ్ సింగరేణి బచావ్. ✳️ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కర్ని దొరకబట్టి కక్కిస్తాం.. ఎవర్ని వదిలిపెట్టం.
3
129
🌴BRS government’s Narmeta Oil Palm Factory emerges as a lifeline for Telangana farmers ✅ The vision of former CM KCR to encourage alternative and profitable farming practices is gradually bearing fruit. One of the most successful examples is oil palm cultivation, which is helping farmers move beyond traditional crops such as paddy, cotton and maize while significantly improving their incomes. A major factor behind this transformation is the Oil Palm Processing Factory at Narmeta in Siddipet district's Nangunur mandal. Established under Telangana Oilfed at a cost of Rs. 300 crore, the facility has provided farmers with a reliable market for their produce, eliminating concerns over sales and price fluctuations. The project was realized through the efforts of former minister Harish Rao, in line with KCR's vision. Farmers who once faced uncertainty due to climate change, rising cultivation costs and volatile market prices now enjoy a more stable source of income. Unlike seasonal crops, oil palm requires a one-time investment and continues yielding produce for many years. Many farmers say the crop has strengthened their financial position and renewed their confidence in agriculture. The factory has also become a major source of employment. Around 500 people have secured direct jobs, while nearly 2,000 others benefit indirectly through transportation, nursery operations, labour and related services. Since trial operations began in September 2025, the factory has processed more than 31,000 metric tonnes of fresh fruit bunches, producing over 5,50 metric tonnes of crude palm oil. Oil palm cultivation now covers nearly 14,000 acres in Siddipet district, with around 5,800 acres already in the harvesting stage. The facility currently handles 800 to 1,000 tonnes of fruit bunches daily and operates throughout the year. A 4-megawatt bio-power plant within the complex generates electricity from processing waste, while a Rs. 40-crore refinery under construction will soon enable refined palm oil production and packaging. As India seeks to reduce its dependence on imported edible oils, the Narmeta factory is emerging as a model project, benefiting farmers, creating jobs and strengthening the rural economy.
2
10
217
❇️ హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంటలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు 👇 ✳️ 2004 నుండి ఇప్పటివరకు ఒక్క ఉపఎన్నిక తప్ప ఏ ఎన్నిక వచ్చినా ఎప్పుడూ ఎగిరిన జెండా గులాబీ జెండా ✳️ ప్రపంచమే అబ్బురపడ్డ రైతు బంధు, దళిత బంధు పథకాలు ప్రారంభమైంది హుజురాబాద్ నుంచే ✳️ ఉద్యమ సమయంలో ఉప్పల్ రైల్వే స్టేషన్‌లో రైల్ రోకోతో ఢిల్లీని స్తంభింపచేసిన గడ్డ ఈ హుజురాబాద్ గడ్డ ✳️ ఒకప్పుడు సభ్యత్వ నమోదు రసీదులు ఉండేది.. ఇప్పుడు అంతా ఆన్లైన్‌లోనే ✳️ ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహించి కాంగ్రెస్ మోసాలను గ్రామగ్రామానికి తీసుకుపోయే కార్యక్రమాన్ని పార్టీ ప్రారంభించబోతుంది ✳️ కేసీఆర్ గారు రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్ లాంటి ఎన్నో పథకాలను తెస్తే రేవంత్ రెడ్డి లేనిపోని ఆశలు పెట్టాడు ✳️ ఇన్ని చేసాం కదా ప్రజలు కృతజ్ఞతతో ఓట్లు వేస్తారు అనుకుంటే కృతజ్ఞతకు, ఆశకు జరిగిన పోరాటంలో రేవంత్ రెడ్డి పెట్టిన ఆశల వలయంలో ప్రజలు చిక్కుకున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును గౌరవించాల్సిందే ✳️ రైతు వ్యతిరేక కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే పరిస్థితి లేదు. కేసీఆర్ హయాంలో కరోనా వచ్చినా రైతు బంధు ఆగలేదు. 11 సార్లు 74 వేల కోట్ల రూపాయలను రైతుల అకౌంట్‌లో వేసిన ఈ దేశంలోనే ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ ✳️ రేవంత్ రెడ్డి వచ్చాక ఒక రైతు బంధు మొత్తం ఎగ్గొట్టాడు. ఈసారి 2 ఎకరాలకే ఇచ్చాడు ✳️ రూ. 20 వేల కోట్ల రైతు బంధు ఎగ్గొట్టి రుణమాఫీ చేసిన అని సంకలు గుద్దుకుంటుండు ✳️ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎండకాలం వచ్చినా కరెంట్ పోలేదు, తాగడానికి నీళ్లకు ఇబ్బంది రాలేదు, కాల్వల్లో నీళ్లు పారినాయి ✳️ కానీ ఇవాళ కాంగ్రెస్ రాజ్యంలో కరెంట్ కోతలు మొదలైనాయి ✳️ తాగడానికి నీళ్లు లేవు, సాగునీరు లేక పంటలు ఎండిపోయినాయి.. రైతులు కన్నీరు పెడుతున్నారు ✳️ రైతు బీమా బంద్ అయ్యింది.. ఎల్ఐసీ డబ్బులు కట్టలేదు రేవంత్ రెడ్డి ✳️ కేసీఆర్ గారు తెచ్చిన పథకమని రైతులకు ఉపయోగపడే పథకాన్ని ఆపడం తగునా రేవంత్ రెడ్డి ✳️ రేవంత్ రెడ్డి వచ్చిండు ఎరువుల కష్టాలు మొదలయ్యాయి.. తరుగు లేకుండా వడ్లు కొనడం లేదు ✳️ రైతులు 40, 50 రోజులకు పైగా వడ్లు అమ్ముకోడానికి, మక్కలు అమ్ముకోవడానికి పడిగాపులు కాస్తున్నారు ✳️ రైతుబంధు పోయింది, రైతు బీమా పోయింది, వడ్లు కొనమంటే చుక్కలు చూపుతున్నరు, యాసంగి పంటకు బోనస్ ఎగ్గొట్టిన్రు ✳️ కేసీఆర్ ఉన్నప్పుడు రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ 11 గంటలే కరెంట్ ఇస్తుంది ✳️ ఈ రేవంత్ రెడ్డి రైతు డిస్కం పేరిట 24 గంటల కరెంట్‌కు ఉరేస్తున్నడు.. రైతులను ఆగం చేయాలని చూస్తున్నడు ✳️ రైతు డిస్కం కనుక అమలులోకి వస్తే ఇప్పుడొచ్చే 11 గంటలు కూడా రైతులకు కరెంట్ రాదు.. 5,6 గంటలు మాత్రం వస్తుంది. ✳️ రైతు అనేవాళ్లు ఇక కాంగ్రెస్‌కు ఓటేసే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినా అబద్ధాలే.. ఆయన పనైపోయింది. ✳️ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎగ్గొట్టిండు, రూ. 4000 పెన్షన్ ఇస్తానని అవ్వా తాతలను మోసం చేసిండు, రూ. 2500 ఇస్తానని మహిళలను మోసం చేసిండు ✳️ జూబ్లీహిల్స్‌లో ఆయనకున్న ప్యాలెస్ సరిపోదని రూ. 100 కోట్లతో ఇంకో క్యాంప్ ఆఫీస్ కట్టిండు, ప్యూచర్ సిటీ అని పెట్టి అక్కడ ఒక రూ. 100 కోట్లతో క్యాంప్ ఆఫీస్ కట్టిండు, హెలికాప్టర్ ఉన్నది చాలదని నెలకు 5 కోట్లు ఖర్చు పెట్టి కొత్త హెలికాప్టర్ కొంటున్నడు, ఫుట్‌బాల్ సోకులకు, అందాల పోటీలకు వందల కోట్లు ఖర్చు పెట్టిండు ✳️ పక్క రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే మూటలు పంపడానికి డబ్బులుంటాయి. ✳️ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో.. నీ హిట్లర్ పాలనను అంతం చేయడానికి ప్రజలు కంకణం కట్టుకున్నారు ✳️ బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా రాదంటున్నడు ఈ రేవంత్ రెడ్డి ✳️ బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కాదు పాలకపక్ష హోదా రాబోతుంది ✳️ నీ పార్టీకి డిపాజిట్లు కూడా రావు గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి ✳️ దేశంలో సీఎంలు ఓడిపోయే ట్రెండ్ నడుస్తుంది. బెంగాల్, తమిళనాడులో అదే జరిగింది. నెక్స్ట్ తెలంగాణలో అదే రిపీట్ అయితది ✳️ రాష్ట్రంలో ఎక్కడ చుసినా ఒక్కటే మాట కాంగ్రెస్ పోవాలే.. కేసీఆర్ రావాలె ✳️ గ్యారంటీగా రాసి పెట్టుకోండి మళ్ళొచ్చేది కారే.. ఏర్పడేది కేసీఆర్ సర్కారే ✳️ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బాగా పనిచేస్తున్నాడు. డంపింగ్ యార్డ్ గురించి పోరాడితే కేసులు పెట్టి సీఐడీ ఆఫీసుల చుట్టూ తిప్పారు.. అయినా తగ్గలేదు మీ తరుపున గట్టిగ నిలబడ్డాడు ✳️ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ డంపింగ్ యార్డ్ సమస్యఫై బీఆర్ఎస్ పార్టీ గళమెత్తుతుంది ✳️ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్ళు అయ్యింది ఇప్పటి వరకు మేడిగడ్డ రిపేర్ చెయ్యలేదు ✳️ అప్పుడు కొట్టుకుపోయింది అన్నారు.. ఇప్పుడు రిపేర్లు చేస్తాం అంటున్నారు
1
2
10
352
✳️ కాళేశ్వరం విలువ కాలం కానప్పుడే తెలుస్తుంది. ఈ సంవత్సరం కాంగ్రెస్‌కి అది అర్ధమయ్యింది ✳️ 2021లోనే ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచింది ✳️ చాలామంది బీఆర్ఎస్ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడుతున్నారు. అయినా కూడా పార్టీ కోసం కార్యకర్తలు కష్టపడుతున్నారు ✳️ కష్టకాలంలో పార్టీకి అండగా ఉండే కార్యకర్తలే మాకు దేవుళ్ళు ✳️ మాట్లాడితే బూతులు మాట్లాడుతాడు రేవంత్ రెడ్డి.. ✳️ రాష్ట్రంలో వాయు కాలుష్యం లాగా ధ్వని కాలుష్యం నడుస్తుంది ✳️ రేవంత్ రెడ్డి బూతులతో ధ్వని కాలుష్యం నడుస్తుంది ✳️ ఈ ధ్వని కాలుష్య రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలని ప్రజలు డిసైడ్ అయిపోయారు ✳️ మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, మంచి రోజులు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు
3
6
324
🔶 కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డిలపై మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ధ్వజమెత్తిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 👇 ❇️ మీనాక్షి నటరాజన్ ఓటమికి కాంగ్రెస్ పార్టీ కుట్రలే కారణం ❇️ పార్టీకి ద్రోహం ఎవరు చేశారో కాంగ్రెస్ పార్టీ నేతలే తేల్చుకోవాలి ❇️ ఆమెపై ఉన్న కేసు వివరాలు ఎవరు బీజేపీ నేతలకు అందించారో విచారణ జరుపుకోవాలి ❇️ పదే పదే సిట్ అనే ముఖ్యమంత్రి, ఈ అంశం పైన కూడా సిట్ వేసుకోవచ్చు ❇️ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ‘బ్లాక్ షీప్’ (పార్టీ ద్రోహులు) ఎవరో కనుక్కోవాలి ❇️ కాంగ్రెస్ పార్టీ అంటేనే కంపు.. అలాంటి కాంగ్రెస్ కంపులో, ద్రోహాల పార్టీ అంశంలో మమ్మల్ని ఎందుకు లాగుతున్నారు? మీనాక్షి నటరాజన్ అంటే పడని వారే ఈ పని చేశారు ❇️ మీనాక్షి నటరాజన్‌కి తెలంగాణ కాంగ్రెస్‌లో ఎవరు వ్యతిరేకులో ప్రజలందరికీ తెలుసు ❇️ ముమ్మాటికీ ఆయన చేసిన పనినే ఇది. కాంగ్రెస్ పార్టీనే కుట్రలు చేసుకొని, అందులో ప్రతిపక్షాలను ఎందుకు లాగుతున్నారో తెలుసుకోవాలి ❇️ కాంగ్రెస్ పార్టీలో పదవులు డబ్బులకే వస్తున్నాయని షబ్బీర్ అలీ గారు చెప్పినందుకు అభినందనలు. షబ్బీర్ అలీ ఇప్పటికైనా ఉన్న వాస్తవాన్ని ప్రజల ముందు గట్టిగా చెప్పారు ❇️ అసలు గతంలో పీసీసీ పదవిని పైసలకు అమ్ముకున్నది కాంగ్రెస్ పార్టీనే కదా ❇️ ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవిని కూడా డబ్బులకే అమ్ముకున్నది ❇️ ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా డబ్బులు పెట్టి కొనుక్కున్న... పదవి కొనుక్కున్న వ్యక్తే కదా ❇️ రేవంత్ రెడ్డి పేమెంట్ కోటా సీటు అన్న విషయం అందరికీ తెలుసు ❇️ ప్రతి నెలా డబ్బుల మూట పంపితేనే ఆయన పదవి ఉంటుంది. రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదు, రెన్యూవల్ సీఎం అని అందరికీ తెలుసు ❇️ కాబట్టి, షబ్బీర్ అలీ చెప్పిన మాటలు ముమ్మాటికీ వాస్తవం. ❇️ మానసిక రోగి మాత్రమే హిట్లర్ స్ఫూర్తి అంటారు ❇️ రేవంత్ రెడ్డి హిట్లర్ గురించి మాత్రమే మాట్లాడలేదు.. హిట్లర్ హంతక ముఠా నాకు ఆదర్శం అని అన్నారు. అంతకుమించి, ఇరాన్-ఇజ్రాయెల్ వార్‌లో గాజా మాదిరి విద్వంసం సృష్టించిన అన్నారు ❇️ యుద్ధంలో జరిగిన విద్వంసం గురించి గొప్పలు చెప్పుకునే వ్యక్తి ఎంత మానసిక రుగ్మత ఉన్నదో అర్థం చేసుకోవచ్చు ❇️ మానసిక రోగి అయితేనే ఇలాంటి మాటలు మాట్లాడతారు ❇️ రేవంత్ రెడ్డి చెప్పిన శిథిలాల కిందనే కాంగ్రెస్ పార్టీని ప్రజలు పాతిపెడతారు ❇️ హైడ్రా అనేది లేనే లేదు, కానీ రేవంత్ రెడ్డి అజ్ఞానంతో "హిట్లర్ హైడ్రా తనకు ఆదర్శం అంటూ మాట్లాడిండు. గోబెల్స్ ప్రచారానికి మించి రేవంత్ రెడ్డి చేసుకుంటున్నారు. ❇️ శ్రీధర్ బాబు హిట్లర్ వ్యాఖ్యలను సమర్ధించడం పట్ల జాలి కలుగుతుంది ❇️ రేవంత్ రెడ్డి హిట్లర్ వ్యాఖ్యలను శ్రీధర్ బాబు సమర్థించడం ఆయనకున్న ఇబ్బందులను గుర్తుచేస్తుంది ❇️ శ్రీధర్ బాబు చదువుకున్న వ్యక్తి. అలాంటి ఆయన హిట్లర్ వ్యాఖ్యలను సమర్థించడం దారుణం ❇️ శ్రీధర్ బాబు పరిస్థితి చూస్తే జాలి కలుగుతుంది. శ్రీధర్ బాబు లాంటి నాయకుడు కూడా హిట్లర్ వ్యాఖ్యలను సమర్థించడం ఆయన విజ్ఞతకే వదిలివేస్తున్నాం. ❇️ హైదరాబాద్ వర్షాలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదం ❇️ 75 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఈ నగరానికి చేసింది ఏమీ లేదు. ❇️ మేము చేసిన ఎస్ఎన్‌డీపీ (SNDP) మరియు ఇతర కార్యక్రమాల వల్లనే కాస్తంత మెరుగైన పరిస్థితి ఉంది ❇️ కానీ, రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రిగా పూర్తిగా విఫలమయ్యారు ❇️ వర్షాకాల సన్నద్ధత ప్రణాళికపైన సమీక్ష కూడా నిర్వహించలేదు. మేము వేసిన ఫ్లైఓవర్లు, ఎస్ఎన్‌డీపీ నిర్వహణ కూడా చేయడం లేదు ❇️ ఉన్న సిటీని గాలికి వదిలేసి ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతున్నాడు ❇️ ఫ్యూచర్ లేని రేవంత్ రెడ్డి ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాడు ❇️ హైదరాబాద్ ప్రజలే ఫ్యూచర్ సిటీని నిర్మించుకుంటారు ❇️ వర్షాలు ఆగితే తన క్రెడిట్ అని చెప్పుకున్న ముఖ్యమంత్రి, వర్షాలు, వరదలు వస్తే మాత్రం పాత ప్రభుత్వానికి అంటగడుతున్నాడు ❇️ ఇదే రేవంత్ రెడ్డి రోడ్ల కింద బావులు తవ్వి వర్షాలను, వరదలను ఆపుకున్నానని చెప్పాడు ❇️ హైదరాబాద్ నగరంలోని వర్షాలకు ప్రజల అవస్థ పాపం ముమ్మాటికీ రేవంత్ రెడ్డిదే ❇️ ఎయిర్‌పోర్ట్ మెట్రోను రద్దు చేయడం వల్లనే ఆ ప్రాంతంలో రద్దీ భారీగా పెరిగింది ❇️ ఎయిర్‌పోర్ట్ 18 నెలల్లో మెట్రో పూర్తి అయ్యేది.. లక్షల మందికి లాభం జరిగేది, ట్రాఫిక్ జామ్‌లు తగ్గేవి ❇️ ల్యాండ్ అక్విజిషన్ (భూసేకరణ) లేకుండా సులభంగా పూర్తయ్యే మెట్రోను రేవంత్ రెడ్డి ఆపేశాడు ❇️ మెట్రో ఎల్ అండ్ టీ (L&T) సీఎఫ్‌ఓ (CFO)ను బెదిరించి మెట్రోను లాక్కున్నాడు ❇️ మేము గతంలో మెట్రోను పూర్తి చేశాము, కానీ ఈ రెండున్నర సంవత్సరాలలో రేవంత్ రెడ్డి చేసింది ఏమిటో చెప్పాలి ❇️ రేవంత్ రెడ్డి రెండు చెరువులు కట్టి ప్రచారం చేసుకుంటున్నాడు. మేము 100 చెరువులు బాగు చేసిన తర్వాత ఏనాడూ ఫోజులు కొట్టలేదు
1
5
16
669
❇️ హైడ్రా అనేది ఒక బ్లాక్‌మెయిల్ సంస్థగా మారింది ❇️ హైడ్రాను అన్ని సమస్యలకు జిందా తిలస్మాత్ లెక్క చూపిస్తున్నారు ❇️ పూడికతీత, వరద, చెరువుల నిర్వహణ.. ఇలా అన్నింటికీ హైడ్రా పేరే చెప్తున్నారు ❇️ కానీ హైడ్రా బ్లాక్‌మెయిలింగ్, డబ్బుల వసూళ్లకు తప్పించి ఇంకేమీ పని చేయడం లేదు ❇️ నిజంగానే హైడ్రా ద్వారా లక్ష ఎకరాలు రక్షించి ఉంటే, వాటిని అమ్మి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలి ❇️ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి ❇️ సభ్యత్వ నమోదు మొబైల్ అప్లికేషన్ సిద్ధంగా ఉన్నది. అప్లికేషన్ టెస్టింగ్ కొనసాగుతున్నది ❇️ ఆ తర్వాత నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో సభ్యత్వ నమోదుపైన శిక్షణ ఉంటుంది ❇️ నియోజకవర్గాల వారీగా ఈ శిక్షణా కార్యక్రమాలు ఉంటాయి. ఇప్పటికే జనరల్ సెక్రటరీలు, ఇన్‌ఛార్జీలు ప్రతి నియోజకవర్గం తిరుగుతున్నారు ❇️ 60 నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ (SIR) మరియు మెంబర్‌షిప్‌పైన సమావేశాలు పూర్తి అయ్యాయి ❇️ సభ్యత్వ నమోదు ఈ నెలాఖరు వరకే స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నది ❇️ ఆ తర్వాత కొత్త కమిటీలు ఏర్పాటు చేసుకుంటాము ❇️ ఆ తర్వాత కమిటీలకు, కార్యకర్తలకు శిక్షణ నిర్వహిస్తాము. సభ్యత్వ నమోదులో రాసి కన్నా వాసి ముఖ్యం అనుకుంటున్నాము ❇️ ప్రతి ఒక్క కార్యకర్తను సుశిక్షితులైన పార్టీ కార్యకర్తల మాదిరిగా తయారు చేసుకుంటాము ❇️ లక్షల మంది పార్టీ కార్యకర్తలు ఉన్నారు.. బీజేపీ, కాంగ్రెస్ కన్నా బలమైన పార్టీ నిర్మాణం మాకున్నది ❇️ గ్రామగ్రామాన బీఆర్‌ఎస్ పార్టీ బలంగా ఉన్నది
4
7
224