2014 మే 26న భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ నరేంద్ర మోదీ గారు, దేశ సేవలో విజయవంతంగా నేటితో 4,399 రోజులు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నాయకత్వం మరింత వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ, లావేరు మండల కేంద్రంలోని శ్రీ చంద్రశేఖరస్వామి వారి దేవస్థానంలో కూటమి నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించాను.
అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, గత 12 ఏళ్ల నిరంతరాయ పాలన దేశంలో సరికొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపిందని పేర్కొన్నాను. ఆర్థిక సంస్కరణలు, డిజిటల్ విప్లవం, మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా భారతదేశాన్ని ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టడంలో ప్రధానమంత్రి మోదీ గారి నాయకత్వం కీలక పాత్ర పోషించిందని వివరించాను.
ప్రత్యేకంగా యూపీఐ (UPI) వంటి డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశను చూపిందని, మౌలిక వసతుల అభివృద్ధిని ప్రభుత్వం ప్రధాన ఆర్థిక వ్యూహంగా మలిచిందని తెలియజేశాను.
అలాగే, ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమన్వయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నాను.
తదుపరి సుబద్రాపురం జంక్షన్లో నిర్వహించిన "స్వచ్ఛ పథం" కార్యక్రమంలో పాల్గొని పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించాను.
ఈ కార్యక్రమాల్లో నాలుగు మండలాల కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
#NarendraModi
#PMModi
#4399DaysOfModi
#12YearsOfModiGovernment