అడవులను సంరక్షించడం వల్లే వన్య ప్రాణులు వస్తున్నాయి..
పట్టణాన్ని ఆనుకొని అతిపెద్ద అర్బన్ పార్క్ అభివృద్ధి చేశాం..
అడవిని అభివృద్ధి చేస్తే జంతువులు వస్తాయని చెప్పాం..
మేం చెప్పినట్లుగానే చిరుత పులి సంచారం..
కేసిఆర్ అర్బన్ ఎకో పార్క్ పర్యాటకులకు ఎలాంటి ఇబ్బంది లేదు..
సమైక్య రాష్ట్రంలో వన్య ప్రాణులను కాపాడటంలో ప్రకటనలకే పరిమితం... అడవుల సంరక్షణను ఏ మాత్రం పట్టించుకోలేదు, తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో హారితహారం కార్యక్రమంతో పాటు ప్రత్యేక చర్యలు తీసుకున్న ఫలితంగా వన్యప్రాణుల సంరక్షణకు అవకాశం ఏర్పండింది.
కేసిఆర్ అర్బన్ ఎకో పార్కు సమీపంలోని అడవిలోని గోల్ బంగ్లా వద్ద ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో శనివారం నాడు చిరుత పులి సంచరించినట్లు రికార్డ్ అయిన తరుణంలో అదే ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత హరితహారం ద్వారా భారీగా అడవులను పెంచి కేసిఆర్ అర్బన్ ఎకో పార్క్ సమీపంలో ఉన్న అడవిలో ఏటా 50 లక్షల సీడ్ బాల్స్ ను వెదజల్లి , గత ఏడాది 1.30 కోట్ల సీడ్ బాల్స్ వేయడం జరిగింది. మొక్కలు నాటడంతో పాటు జంతువుల కోసం సోలార్ పంపులు ఏర్పాటు చేసి తాగునీటిని అందజేయడం జరిగింది.
ఇక్కడ 12 చిరుతలు, అనేక జింకలు, కుందేళ్ళు, ఎలుగుబంట్లు, అదవి దున్నలు, నెమళ్లు తదితర వన్యప్రాణులు ఉన్నాయి.
కేసిఆర్ అర్బన్ ఎకో పార్క్ ను ఆనుకున్న 26 వేల ఎకరాల అడవిలో అనేక వన్యప్రాణులు ఉన్నాయి. అయితే అక్కడ వాటికి అవసరం అయిన ఆహారం, నీరు సమృద్దిగా ఉండటం వల్ల వేరే ప్రాంతానికి జంతువులు వెళ్లే పరిస్థితి లేదు.
పులులు ఉన్నాయని ఆందోళన అవసరం లేదు. పర్యాటకులు ఎలాంటి సంకోచం లేకుండా కేసిఆర్ అర్బన్ ఎకో పార్క్ ను సందర్శించవచ్చు. త్వరలో జంగిల్ సఫారీ, టెంట్ టూరిజం ద్వారా కేసిఆర్ అర్బన్ ఎకో పార్క్ కు పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివచ్చేలా ఏర్పాట్లు.