బహుజన వర్గాల్లో పుట్టి,ఎన్నో అవమానాలను ఎదుర్కొని,వివక్షను అధిగమించి, 12 వేల కిలోమీటర్ల మేర,300 కోటలను నిర్మించి,దేశంలో అతి పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించిన ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి నేడు.
1657 లో ముంబై సమీపంలో ఉన్న ఆనాటి కళ్యాణ్ కోటను గెలిచి,రాజు కుమార్తెను బంధీగా తీసుకొస్తే... "మా తల్లి కూడా నీ అంత అందంగా ఉంటే, నేను కూడా నీలా అందంగా ఉండేవాన్ని" అని తల్లితో పోల్చి గౌరవించిన మహోన్నత విలువలు కలిగిన మహారాజు శివాజీ.
ఇంటలిజెన్స్ వ్యవస్థను తప్పుపడుతూ ఫోన్ ట్యాపింగ్ పేరుతో ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేసే కుట్రలు ప్రస్తుత ప్రభుత్వంలో చూస్తున్నాం. కానీ
ఆనాడే పటిష్ఠమైన గూఢచర వ్యవస్థ (ఇంటలిజెన్స్ నెట్వర్క్) ప్రారంభించి,శత్రు దేశాల/రాజుల సమాచారాన్ని సేకరించి, వ్యూహరచనతో శత్రు రాజ్యాలను మట్టికరిపించిన మహారాజు శివాజీ గొప్పతనాన్ని,అన్ని మతాలను గౌరవించి,ఆదరించిన లౌకిక భావనను గుర్తు చేసుకుందాం.
కేవలం ఒక మతానికే చెందిన వ్యక్తిగా,ఇంకో మతాలను కించపరిచారంటూ శివాజీని స్వార్థరాజకీయాలకు వాడుకుంటున్న కొన్ని పార్టీలకు బుద్దిచెబుదాం.
ఆ మహనీయునికి ఘన నివాళి అర్పిద్దాం.
జై శివాజీ✊