దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖ మంత్రి వర్యులు యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారికి ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు ఢిల్లీలోని తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు. శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారి నివాసానికి చేరుకున్న నారా లోకేష్ గారిని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారి తోపాటు యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి గారు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన కనిగిరి శాసనసభ్యులు శ్రీ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు, ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు, మారిటైమ్ బోర్డు చైర్మన్ శ్రీ దామచర్ల సత్యనారాయణ గారు,సంతనూతలపాడు శాసనసభ్యులు శ్రీ బి ఎన్ విజయకుమార్ గారు , కందుకూరు శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారు, పర్చూరు శాసనసభ్యులు శ్రీ ఏలూరు సాంబశివరావు గారు, గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తముల అశోక్ రెడ్డి గారు, మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి గారు, దర్శి నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు, డాక్టర్ కడియాల లలిత సాగర్ గారు, ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్చార్జ్ గూడూరి ఎరక్షన్ బాబు గారు పాల్గొన్నారు.