Retired teacher min 60k pension cool ga chill avvachu kada uncle..
"నా కొడుకు అమాయకుడు మేము లేకుండా బతకలేడు"
సూసైడ్ నోట్ రాసి భార్య, కొడుకులకు ఉరివేసి అనంతరం తాను ఉరివేసుకున్న విశ్రాంత ఉపాధ్యాయుడు
ఏపీలోని పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరులో భార్య రత్నావళి(60), కొడుకు సాయిసుకృత్(26)లతో కలిసి నివసిస్తున్న చీరాల మధుసూదన్ రావు(65) అనే రిటైర్డ్ టీచర్
ఐదేళ్ల క్రితం మధుసూదన్ రావు పదవి విరమణ పొందగా, తిరుపతిలోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సాయిసుకృత్
తన సోదరి దొరసానమ్మకు ఫోన్ చేసి మామిడి పండ్లు తెమ్మని మధుసూదన్ రావు కోరగా, సోమవారం మామిడి పండ్లు తీసుకొచ్చిన దొరసానమ్మ
ఇంటి తలుపులు తెరిచి చూడగా హాల్లో మధుసూదన్ రావు, రత్నావళి మృతదేహాలు, దేవుడి గదిలో సాయిసుకృత్ మృతదేహం ఉరికి వేలాడుతూ ఉండడం, ముగ్గురి కాళ్ళుచేతులు కట్టేసి ఉండడం గమనించి భయంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన దొరసానమ్మ
అయితే సాయిసుకృత్ పని చేసే కంపెనీ తనకు జీతం ఇవ్వలేదని కంపెనీకి వెళ్లి నిలదీసిన మధుసూదన్ రావు
మీ అబ్బాయి పనితీరు బాగాలేదని, సర్టిఫికెట్స్ తీసుకుని వెళ్ళండి అని కంపెనీ యాజమాన్యం చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మధుసూదన్ రావు
దీంతో తాము మానసికంగా, శారీరకంగా బలహీనులమయ్యామని, తాము చనిపోయాక కొడుకు భవిష్యత్తు అంధకారం అవుతుందని అందుకే తాము చనిపోతున్నామని లేఖ రాసి ఈ అఘాయిత్యానికి పాల్పడిన మధుసూదన్ రావు
భార్య, కుమారుడి కోరిక మేరకు అంటూ ఆస్తులను ఎవరికి ఇవ్వాలో రాసిపెట్టి, తమ అంత్యక్రియల కోసం ఓ సోదరికి డబ్బు కూడా పంపినట్లు గుర్తింపు
ఆస్తిలో కొంత భాగం నెల్లూరు రెడ్ క్రాస్ సంస్థకు ఇవ్వడం గమనార్హం
మధుసూదన్ రావు, రత్నావళి దంపతులకు సంతానం లేకపోవడంతో, సాయిసుకృత్ను దత్తత తీసుకుని పెంచారని, ఇలా చేస్తారని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు