మంగళగిరి మహిళలు మంత్రి నారా లోకేష్కు రాఖీ కట్టి ఆశీస్సులు అందించారు. లోకేష్ మాట్లాడుతూ, మంగళగిరిని రాష్ట్రంలో నెం.1 నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. 2019 ఓటమి తర్వాత, 26 అభివృద్ధి కార్యక్రమాలతో మీ అభిమానం చూరగొన్నానని, గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచానన్నారు. ఇళ్లపట్టాలు, రోడ్లు, ఆసుపత్రి, జెమ్స్ పార్క్ వంటి 200 అభివృద్ధి పనులతో మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని హామీ ఇచ్చారు.