❇️ విద్యుత్ ఉద్యోగ బాధిత కుటుంబాలకు సీఎం శ్రీ
@revanth_anumula , డిప్యూటీ సీఎం శ్రీ
@Bhatti_Mallu లు ఈరోజు అసెంబ్లీ హాల్లో రూ. కోటి చెక్కులు పంపిణీ చేశారు. దేశ చరిత్రలోనే ఇదొక చారిత్రక కార్యక్రమమని, ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం ఇలాంటి పథకం దేశంలో మరెక్కడా లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో, సీఎం శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తమ మంత్రిమండలి ఉద్యోగుల క్షేమం కోసం ఆలోచన చేసి, క్యాబినెట్లో ఈ కీలక నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు.
❇️ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలకు ఈరోజు అసెంబ్లీ హాల్లో ప్రమాద బీమా చెక్కులను పంపిణీ చేసిన సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు దురదృష్టవశాత్తు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబం రోడ్డున పడే ప్రమాదం ఉందని, యజమానిపై ఆధారపడిన జీవితాలు తారుమారవుతున్న తీరును తాము గమనించామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో పనిచేస్తున్న ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి ఇలాంటి నిస్సహాయ స్థితి రాకూడదన్న మానవీయ ఆలోచనతోనే, దేశంలో ఎక్కడా లేని విధంగా రూ. 1.20 కోట్ల భారీ ప్రమాద బీమాను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని ప్రకటించారు.
❇️ ఈ ప్రమాద బీమా పథకం ద్వారా విద్యుత్ సంస్థల్లోని 51 వేల మందికి పైగా, సింగరేణి సంస్థలోని 41 వేల మంది, రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 7.57 లక్షల మంది కుటుంబాల్లో ఈ పథకం భరోసాను కల్పిస్తుందని డిప్యూటీ సీఎం వివరించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యుత్ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సింగరేణి, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, ట్రాన్స్కో సంస్థల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని ఇప్పటికే ప్రారంభించామని శ్రీ భట్టి విక్రమార్క గుర్తుచేశారు.
❇️ ఈ క్రమంలోనే దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో అసిస్టెంట్ లైన్మెన్గా విధులు నిర్వహిస్తూ, 2025 అక్టోబర్ 10న మరణించిన వరుస సురేష్, అలాగే మహబూబ్ నగర్ సర్కిల్ సివిల్ విభాగంలో ఆర్టిజన్ గా పనిచేస్తూ, 2025 ఏప్రిల్ 19న మరణించిన ముక్తార్ బేగ్ కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున బీమా చెక్కులను అందజేసి, ప్రభుత్వం అండగా నిలిచిందని డిప్యూటీ సీఎం తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన వారి సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
❇️ కార్యక్రమంలో మంత్రులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీ శ్రీధర్ బాబు, శ్రీ తుమ్మల నాగేశ్వరరావు, శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీమతి సీతక్క, శ్రీ జూపల్లి కృష్ణారావు, శ్రీ గడ్డం వివేక్, శ్రీ అజారుద్దీన్, ఎనర్జీ సెక్రెటరీ నవీన్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు.
#PowerEmployees #InsuranceScheme #CMRevanthReddy #Singareni #TGSPDCL #TGNPDCL #TGTRANSCO
@TelanganaCMO @UttamINC @Tummala_INC @KomatireddyKVR @INC_Ponguleti @seethakkaMLA @jupallyk_rao @VivekVenkatswam @azharflicks @OffDSB