💠పేదల సొంతింటి కలను నెరవేర్చాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గారి నేతృత్వంలో ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని చేపట్టింది. ఎంతో పారదర్శకంగా అమలు చేస్తుంది. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, బిల్లుల చెల్లింపుల విషయంలో అవినీతికి పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదు.
ఈరోజు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల సమస్యలు, సందేహాలకోసం గత వారం హౌసింగ్ కార్పొరేషన్లో ఏర్పాటు చేసిన కాల్సెంటర్కు వచ్చిన ఫిర్యాదులపై హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ విపి గౌతమ్ గారు, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెస్ ఎడిజీ సంగ్రామ్ సింగ్ పాటిల్ గారితో కలిసి సమీక్షించడం జరిగింది.
♦️కాల్ సెంటర్కు ఏ ఏ అంశాలపై ఫిర్యాదులు వస్తున్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నాను. తక్షణం వాటిపై చర్యలకు తీసుకోవాలని సూచించాను. ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు లబ్దిదారుల నుంచి లంచం అడిగే ఇందిరమ్మ కమిటీ సభ్యులను తక్షణమే కమిటీ నుంచి తొలగించి క్రిమినల్ కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించాను.
♦️దీనికి సంబంధించి సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం పోలుమల్ల గ్రామంలో కొండ లింగయ్య అనే లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కోసం పదివేల డిమాండ్ చేసిన ఇందిరమ్మ కమిటీ సభ్యుడు సత్తెయ్య తో పాటు, జనగాం జిల్లా దేవరుప్పల మండలం పడమటి తండాలో శివమ్మ అనే లబ్ధిదారురాలిని గ్రామ పంచాయతీ సెక్రటరీ 30 వేల రూపాయిలు ఇవ్వాలని డిమాండ్ చేశారని ఫిర్యాదు వచ్చింది. ఈ విచారణలో ఇందిరమ్మ కమిటీ సభ్యుని పాత్ర ఉందని తేలడంతో పూర్తిస్ధాయి విచారణ జరిపి 24గంటల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించడం జరిగింది.
♦️అదేవిధంగా ఖమ్మం, జగిత్యాల, కొత్తగూడెం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇండ్లు మంజూరువ కాని నలుగురికి వారి ఖాతాలో నిధులు జమచేసిన గ్రామ పంచాయతీ సెక్రటరీలను తక్షణమే సస్పెండ్ చేయాలని, ఈ సంఘటనపై పూర్తిస్ధాయి విచారణ జరిపించాలని అధికారులకు సూచించాను.
♦️ఇందిరమ్మఇండ్ల లబ్దిదారులకు ఇంటి నిర్మాణ దశలను బట్టి ప్రతి సోమవారం నిధులు మంజూరు చేస్తున్నాం. అయితే కొన్ని బ్యాంకులు లబ్దిదారుల ఖాతాలో జమచేసిన ఈ నిధులను పాత బకాయి కింద చూసుకుంటున్న తెలిసింది. అలాంటి సదరు బ్యాంకులపై చర్యలు తీసుకోవాలి. దీనిపై రాష్ట్ర స్దాయి బ్యాంకర్ల కమిటీకి లేఖ రాయాలని హౌసింగ్ ఎండీని సూచించాను.
♦️ఆధార్ నెంబర్ ఆధారంగా చెల్లింపుల్లో ఎదురవుతున్న సమస్యలను ఈనెల 25వ తేదీలోగా పరిష్కరించాలి. దసరా పండగలోపు చెల్లింపులు పూర్తి చేయాలలి. ప్రతిగ్రామంలో ఏఈలు కూడా లబ్దిదారుని వద్దకు వెళ్లి ఆధార్, బ్యాంకు వివరాలను పరిశీలించాలి. లబ్దిదారుడు కూడా బ్యాంకుకు వెళ్లి ఆధార్ నెంబర్తో బ్యాంకు ఖాతాను అనుసంధానం చేసుకోవాలి. ఆధార్ నెంబర్ , పేరుగాని తప్పు ఉంటే గ్రామ కార్యదర్శి ఎంపీడీవో దృష్టికి తీసుకువెళ్లి సరిచేసుకోవాలి. లబ్దిదారుడే స్వయంగా ఈ దిద్దుబాటు చేసుకొనేలా యాప్ను తయారుచేశాం. ఇది ఒకటి రెండు రోజుల్లో అందుబాటులోకి వస్తుంది.
♦️ఇందిరమ్మ ఇండ్ల విషయంలో పేదలను ఇబ్బంది పెట్టి డబ్బుల వసూళ్లకు పాల్పడితే టోల్ ఫ్రీ నెంబర్ 1800 599 5991 కు కాల్ చేసి వివరాలను తెలియజేయాలని లబ్దిదారులను కోరుకుంటున్నాను. 24 గంటల్లో సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారు. కాల్ సెంటర్కు వచ్చిన ఫిర్యాదులను తక్షణమే ఆయా జిల్లా కలెక్టర్ , ఎస్పీకి పంపించడంతో పాటు సచివాలయంలోని నా కార్యాలయానికి కూడా పంపాలని అధికారులకు సూచించాను.
♦️ఇటువంటి ఫిర్యాదులపై నా కార్యాలయం కూడా మానిటరింగ్ చేస్తుంది. ఇది ప్రజా ప్రభుత్వం.. ప్రజలకు ఇచ్చే పథకాలను చిత్తశుద్ధితో అమలు చేస్తుంది.
#HousingForAll #IndirammaIndlu #CallCenterSupport #GrievanceMonitoring