ఈరోజు హన్మకొండ జిల్లా మడికొండ టెక్స్టైల్ పార్కును సందర్శించి, కాకతీయ పరస్పర పొదుపు సహకార సమితి నాయకులతో సమావేశమవడం జరిగింది. ఈ పార్కుపై ఆధారపడి ప్రత్యక్ష ఉపాధి పొందుతున్న 10,000 పద్మశాలి కుటుంబాలు కోవిడ్ అనంతరం ఎదుర్కొంటున్న సమస్యలను వారు నా దృష్టికి తీసుకొచ్చారు. వారి ఇబ్బందులు తెలుసుకున్న వెంటనే, కేంద్ర ప్రభుత్వం తరఫున వారికి పూర్తి అండగా ఉంటానని భరోసా కల్పించడం జరిగింది. అర్హులైన వారికి కేంద్ర ప్రభుత్వ పథకాలు అందేలా చూడటంతో పాటు, వారి రుణ సమస్యలను పరిష్కరించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని మాట ఇచ్చాను.
పొదుపు సహకార సమితి వారు తక్షణమే ఒక ప్రతినిధి బృందంగా ఏర్పడి పూర్తి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వారికి సూచించాను. ఆ బృందాన్ని స్వయంగా ఢిల్లీ తీసుకెళ్లి, సంబంధిత కేంద్ర మంత్రులతో చర్చించి వారికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చాను.
వరంగల్ టెక్స్టైల్ పార్క్ అభివృద్ధికి, నేతన్నల సంక్షేమానికి గౌరవ ప్రధానమంత్రి శ్రీ
@narendramodi గారి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది.