నేలకొండపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
పేదలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సజావుగా అమలు చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం. ఈరోజు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడం జరిగింది.
ముజ్జుగూడెం గ్రామంలో రూ.16 లక్షల అంచనాతో పశుసంవర్ధక శాఖకు చెందిన సబ్ సెంటర్ నూతన భవనం, నేలకొండపల్లిలో రూ.30 లక్షలతో అంతర్గత సీసీ రోడ్లు, భైరవుని పల్లి నుంచి నాచేపల్లి వరకు రూ.4 కోట్ల 72 లక్షల 50 వేలతో బి.టి.రోడ్డు, చెన్నారం గ్రామం ఎస్సీ కాలనీలో రూ.22 లక్షలతో అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. వీటితో పాటు బోదులబండ గ్రామం ఎస్సీ కాలనీ,ముస్లిం బజార్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి జరిగిన భూమి పూజలో పాల్గొన్నాను. ముజ్జుగూడెం నుంచి గువ్వలగూడెం రోడ్డు నిర్మాణానికి రూ.2 కోట్ల 60 లక్షలు మంజూరు చేయడం జరిగింది.
ప్రజా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమాలకు సమ ప్రాధాన్యత కల్పిస్తుంది.
@TelanganaCMO
#InfrastructureDevelopment #RuralDevelopment #PeopleFirstGovernment #Nelakondapalli #Khammam