స్టీల్ ప్లాంట్లో జరిగిన విషాదకర ప్రమాదంలో మృతిచెందిన కాంట్రాక్టు కార్మికుడు శ్రీ నక్కా వెంకటరమణ కుటుంబ సభ్యులను పెందుర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, ఏపీ ఆయిల్ ఫెడ్ చైర్మన్ శ్రీ గండి బాబ్జీ గారు మరియు యువనాయకులు శ్రీ గండి వంశీదీప్ గారు శుక్రవారం మదీనాబాగ్లోని వారి నివాసంలో పరామర్శించారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయంతో పాటు నెలసరి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, కుటుంబానికి అవసరమైన ప్రతి సహాయాన్ని అందించేందుకు పార్టీ తరఫున సిద్ధంగా ఉన్నామని హామీ ఇస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో వార్డు టీడీపీ అధ్యక్షుడు మంత్రి రవి, చుక్క వెంకన్న, జనసేన నాయకులు కాకి శ్రీను, టీడీపీ సీనియర్ నాయకులు అన్వర్ భాషా, షమీ, తైనాల రాజా, సోమునాయుడు, సలీం, హఫీజ్, పైడిరెడ్డి, బరాత్ తదితరులు పాల్గొన్నారు.బాధిత కుటుంబానికి సంఘీభావం తెలుపుతూ ఆర్థిక సహాయం మరియు నెలసరి నిత్యావసర సరుకులను అందజేశారు.
#GandiBabji
#GandiVamsiDeep
#Pendurthi
#SupportToFamily
#CommunityService