గట్టుపల్లి–చింతలపాలెం హత్య కేసు స్థలాన్ని పరిశీలించి తిరుగు ప్రయాణంలో ఉండగా జలదంకి పరిధిలో నేషనల్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉత్తరాఖండ్కు చెందిన వలస కూలీ దుక్కి రామ్ రాయ్ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన తీవ్రంగా కలిచివేసింది. ప్రమాద స్థానాన్ని పరిశీలించి, ఈ భయంకర ఘటనకు కారణమైన వాహన దారుడిని వెంటనే పట్టుకోవాలంటూ పోలీసులకు కఠిన ఆదేశాలు జారీ చేశాను. సంఘటనా స్థలంలో ఉన్న మిగతా 20 మంది వలస కూలీలను పరామర్శించి, వారికి పూర్తి భరోసా ఇస్తూ ఈ కష్ట సమయంలో మీ అందరికీ నేను అండగా ఉంటాను అని ధైర్యం చెప్పాను. వారి తక్షణ ప్రయాణానికి తోడ్పడేందుకు కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున రూ.10,000 ఆర్థిక సహాయాన్ని అందజేశాను. దుక్కి రామ్ రాయ్ మృతదేహాన్ని అతని స్వగ్రామానికి పంపడానికి ప్రభుత్వం మరియు అధికారులతో సమన్వయం చేసి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను. బాధిత కుటుంబానికి మరియు తోటి కార్మికులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
#SupportToWorkers #UdayagiriConstituency #KakarlaSuresh