*నంద్యాలలో ఏ 1 ఇన్ఫోటెక్ ఇంటర్నేషనల్ టూరిజం కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్*
*జమాతుల్ ఉలేమా వల్ అయిమ్మ ఫౌండేషన్ కార్యాలయాన్ని ప్రారంభించిన టిడిపి జిల్లా కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్*
నంద్యాల పట్టణంలోని చాంద్ బాడ నందలి బదర్ మసీదు సమీపంలో న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఏ1 ఇన్ఫోటెక్ ఇంటర్నేషనల్ టూరిజం కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, మైనార్టీ శాఖ రాష్ట్ర డైరెక్టర్ మనియార్ ఖలీల్, సౌత్ ఇండియా హజ్, ఉమ్రా అసోసియేషన్ చైర్మన్ సుల్తాన్, అధ్యక్షులు ఫయాజ్, కోశాధికారి అబ్దుల్ సలాం, జమాతుల్ ఉలేమా వల్ అయిమ్మ ఫౌండేషన్ ఇమాముల మరియు ఉలేమాల సంఘం అధ్యక్షులు అబ్దుల్ హాది సయీది, మౌలానా ఇద్రిస్, మౌలానా హుసేన్, హాఫిజ్ షరీఫ్, ముఫ్తి ఖలీల్ హుసేన్, షేక్ టైలర్ మౌలాలి, మౌలానా మహబూబ్ పీరా, టిడిపి వార్డు ఇంచార్జ్ కట్టెల ఆఫజల్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ఏ1 ఇన్ఫోటెక్ ఇంటర్నేషనల్ టూరిజం అధినేత మౌలానా ఇలియాస్ హనఫీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని ప్రారంభించడం సంతోషకరమన్నారు. ముస్లింలు పవిత్రంగా భావించే మక్కా యాత్రను నిర్వహించడం, అందులో అనుభవజ్ఞులైన మౌలానాలచే ఈ కార్యక్రమం నిర్వహించడం శుభ పరిణామమని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఫరూక్ కోరారు. ఏ1 ఇన్ఫోటెక్ ఇంటర్నేషనల్ టూరిజం అధినేత మౌలానా ఇలియాస్ హనఫీ మాట్లాడుతూ మక్కా యాత్రను పారదర్శకంగా నిర్వహిస్తామని, ప్రతి ఒక్కరూ మా ట్రావెల్స్ తరఫున ఉమ్రా యాత్రలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
*జమాతుల్ ఉలేమా వల్ అయిమ్మ ఫౌండేషన్ కార్యాలయం ప్రారంభం*
జమాతుల్ ఉలేమా వల్ అయిమ్మ ఫౌండేషన్ కార్యాలయాన్ని టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ శాఖ రాష్ట్ర డైరెక్టర్ మనియార్ ఖలీల్, నీటి సంఘాల చైర్మన్ చాబోలు ఇలియాజ్, మౌలానాలు, హాఫిజ్ లు పాల్గొన్నారు.