#Adminpost
ఖమ్మం నగరంలో 12 సంవత్సరాల బాలికపై జరిగిన అమానుష ఘటనపై జనసేన పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రస్తుతం హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత బాలికను, ఆమె తల్లిదండ్రులను జనసేన పార్టీ ప్రచార కార్యదర్శి ఆర్కే సాగర్, శనివారం పరామర్శించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం Rk సాగర్ గారు మీడియాతో మాట్లాడుతూ.. సమాజం తలదించుకునేలా ఉన్న ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే నిందితులకు కఠినమైన శిక్ష పడాలని డిమాండ్ చేశారు. నిందితుడు ఎంతటి వారైనా సరే, చట్టం ముందు నిలబెట్టి కచ్చితంగా ఉరిశిక్ష పడేలా చేయాలని ఆర్కే సాగర్ ప్రభుత్వాన్ని కోరారు. ఖమ్మం పార్లమెంట్ కో ఆర్డినేటర్
రామకృష్ణ మిరియాలమాట్లాడుతూ, ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని నిమ్స్ ఆసుపత్రిలో మెరుగైన ఉచిత వైద్యం అందించాలని, బాధితురాలి కుటుంబానికి ఆర్థికంగా, సామాజికంగా అండగా నిలవాలని డిమాండ్ చేశారు. నిందితుడికి తక్షణమే ఉరిశిక్ష విధించడమే ఆ కుటుంబానికి నిజమైన న్యాయం అని ఆయన పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా నేతలు హామీ ఇచ్చారు. శేరిలింగంపల్లి ఇంచార్జి మాధవ రెడ్డి, జనసేన నాయకులు మాధవరావు, కొల్లా శంకర్, మహేష్, పుష్ప,ప్రవీణ్, అనుపమ తదితరులు వున్నారు.
#JusticeForKhammamGirl #JanaSenaWithVictim #RKSagar #MiryalaRamakrishna #JanaSenaParty
@JanaSenaParty
@JSPTelangana
@itsRamTalluri @PawanKalyan @urRKsagar