" స్టార్లుగా ఎదిగాక తొలి సమరం... రుస్తుం vs కథానాయకుడు " 🔥🔥
మెగాస్టార్ చిరంజీవి -నటసింహం బాలకృష్ణ టాలీవుడ్ లో వీరిద్దరి మధ్య ఎప్పటినుండో పోటీ ఉంది. దాదాపు 30 సార్లు పైగా పోటీ పడ్డ ఈ ద్వయం ...తొలిసారి తలపడిందెప్పుడు ?
చిరు, బాలయ్య హీరోలుగా ఎదుగుతున్నప్పుడే ఇద్దరి సినిమాలు ఒకేసారి రిలీజ్ అయిన సందర్భాలు ఉన్నాయి. అయితే అప్పుడు వారు స్టార్ హీరోలు కాదు కాబట్టి ఆ పోటీ గురించి పెద్దగా పట్టించుకోలేదు .
1983 లో ఖైదీతో చిరు స్టార్ అయ్యారు. 1984 లో మంగమ్మ గారి మనవడుతో బాలకృష్ణ స్టార్ అయ్యారు. యువత, మాస్ లో చిరంజీవికి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ మాస్ ప్రేక్షకుల్లో బాలకృష్ణకు మంచి ఇమేజ్ రావడంతో వీరి తర్వాత మూవీస్ పై అందరికీ మంచి అంచనాలు ఉండేవి
అలా 1984 డిసెంబర్ లో ఈ ఇద్దరి క్రేజీ సినిమాలు మంచి హైప్ తో , రికార్డు సెంటర్ రిలీజ్లతో వచ్చేశాయి. స్టార్స్ అయ్యాక మొదటిసారి పోటీ కావడంతో అప్పట్లో ఆసక్తి రేపింది .
డిసెంబర్ 14న రామానాయుడు నిర్మాణ సారథ్యంలో మురళీ మోహన్ రావు గారి డైరెక్షన్ లో పరుచూరి బ్రదర్స్ రచన చేసిన కథానాయకుడు రిలీజ్ అయింది.
కమర్షియల్ గా బాలకృష్ణ స్టామినా ఏంటో ఫస్ట్ టైం చూపెట్టిన చిత్రం ఇది. ఎక్సలెంట్ ఓపెనింగ్స్ తో అద్దరగొట్టిన కథానాయకుడు సూపర్ హిట్ అయి బాలకృష్ణ ఇమేజ్ ని పెంచేసింది.
దీని తర్వాత వారానికి డిసెంబర్ 21వ తేదీ ఏ. కోదండరామిరెడ్డి గారి డైరెక్షన్ లో రూపొందిన రుస్తుం రిలీజ్ అయింది. ఖైదీ కాంబినేషన్ కావడంతో రుస్తుం పై భారీ అంచనాలు ఉండేవి.
అప్పటికే కథానాయకుడు హిట్ కావడంతో ఈ ఇద్దరు యువ కిశోరాల మధ్య పోటీని అంతా చాలా ఆసక్తిగా తిలకించారు. అప్పటి సినిమా పత్రికలు కూడా రుస్తుం రిలీజ్ రోజు ఇలాంటి ఆర్టికల్స్ే రాసాయి.
అయితే అప్పటి అంచనాలకు తగ్గట్టు కాకపోయినా భారీ ఓపెనింగ్స్ కొల్లగొట్టి 100 రోజులు ప్రదర్శించబడి హిట్ మూవీ అయింది రుస్తుం.
ఇలా ఇద్దరి మధ్య జరిగిన తొలి క్రేజీ కాంపిటీషన్ అప్పట్లో అటెన్షన్ క్రియేట్ చేసింది. వారం వారం పేపర్ లో మా సినిమా ఆ థియేటర్లో రికార్డ్, మా సినిమా ఈ థియేటర్లో రికార్డ్ అని ఈ రెండు సినిమాల గురించి పేపర్లో యాడ్స్ కూడా ఇచ్చేవారు.
ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణల మధ్య చాలాసార్లు హెవీ కాంపిటీషన్ జరిగినా మొట్టమొదటి పోటీ మాత్రం రుస్తుం – కథానాయకుడు విషయంలోనే జరిగింది.
#Chiranjeevi #Balakrishna #Rustum #Kathanayakudu