ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల కింద అర్హులైన వారికి ప్రతి నెలా పింఛన్లు అందిస్తున్న సంగతి తెలిసిందే. వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఏపీ ప్రభుత్వం పింఛన్లు అందిస్తోంది. లబ్ధిదారులకు ప్రతి నెలా ఒకటో తేదీన గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దనే పింఛన్లు పంపిణీ చేస్తోంది. ఈ క్రమంలోనే జనవరి 2026 పింఛన్ల పంపిణీకి సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. జనవరి నెల పింఛన్ను జనవరి ఒకటో తేదీ కాకుండా ఒకరోజు ముందుగానే అంటే.. డిసెంబర్ 31వ తేదీనే అందించనున్నట్లు సమాచారం. జనవరి 1కు బదులుగా డిసెంబర్ 31వ తేదీ ఉదయం 7:00 గంటల నుంచి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పింఛన్ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి అందించనున్నారు. ఎక్కువ మంది లబ్ధిదారులకు డిసెంబర్ 31వ తేదీన పింఛన్ మొత్తా్న్ని అందించనున్నట్లు సమాచారం. జనవరి ఒకటో తేదీ సెలవు నేపథ్యంలో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
#APPensions #AndhraPradesh