డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నాగార్జునసాగర్ పర్యటన
నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటించారు. ఈ సందర్భంగా నాగార్జునసాగర్ జెన్కో పవర్ హౌస్ను సందర్శించి, జల విద్యుత్ ఉత్పత్తిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు.
బిఆర్ఎస్ నేతలు సీఎం స్థాయి వ్యక్తులను "హౌలే, సన్నాసి" అని సంబోధించడం.. సమాజానికి తలవంపులు కలిగించే భాష. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి, పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని బిఆర్ఎస్ నేతలు ఇప్పటికీ తమ తీరును మార్చుకోలేదు.
నీళ్ల కోసమే అధికారాన్ని తెచ్చుకున్నాం, పదేళ్లు పరిపాలించిన బిఆర్ఎస్ నేతలు మొద్దు నిద్ర మూలంగా...కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణ వాటాలను తేల్చలేకపోయింది, ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడం వల్ల నీటి సమస్యలు ఏర్పడ్డాయి.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ నాయకత్వం, ముఖ్యంగా సోనియా గాంధీ ఇతర పార్టీలను ఒప్పించి, పార్లమెంటులో తగిన బలం లేకపోయినా ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేశారు.
నాగార్జునసాగర్ను హరిత విప్లవంలో భాగంగా కాంగ్రెస్ నిర్మించింది, 1978లోనే రివర్స్ పంపింగ్ స్టోరేజ్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ ప్రాజెక్టు 21 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందిస్తూ, 816 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది.
రాష్ట్రంలో 17,162 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ను ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరాతో నిర్వహించిన సిబ్బందికి అభినందనలు.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో యావత్ క్యాబినెట్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, కొత్త పరిశ్రమల ఏర్పాటు వల్ల విద్యుత్ డిమాండ్ 9.96% రేటుతో పెరుగుతోంది, ఏడాదిలోనే 2,000 మెగావాట్ల అధిక విద్యుత్ డిమాండ్ను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిరంతరాయంగా అందించాం.
కాలుష్య రహిత, తక్కువ ధరలో అందుబాటులో ఉండే గ్రీన్ పవర్ ఉత్పత్తిపై దృష్టి సారించాం, 2029-30 నాటికి 20,000 మెగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నాం. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థ ఏర్పాటు, సౌర విద్యుత్ నిల్వ కోసం టెండర్లు పిలుస్తాం, న్యూ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ ద్వారా అదనపు విద్యుత్ ఉత్పత్తికి చర్యలు చేపడుతున్నాం.
ప్రపంచంలో వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు విద్యుత్ శాఖ సిబ్బందికి ఆర్టిజన్ నుండి సిఎండి వరకు శిక్షణ ఇస్తాం.
కాంగ్రెస్ ప్రభుత్వం హరిత విప్లవం కోసం అనేక ప్రాజెక్టులను నిర్మించింది, దీని ఫలితంగా తెలంగాణ పంట ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. రాష్ట్రంలోని అన్ని హైడల్ ప్రాజెక్టులను పర్యవేక్షిస్తూ, ప్రపంచంలోని మార్పులకు అనుగుణంగా ఆధునీకరణ చేస్తాం.
రాష్ట్రంలోని అన్ని హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ ప్రాజెక్టులలోని యూనిట్లను వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
93 లక్షల కుటుంబాలకు సన్న బియ్యం, 51 లక్షల కుటుంబాలకు ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్, ఐదేళ్లలో లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు, మొదటి ఏడాదిలోనే నాలుగున్నర లక్షల ఇళ్ల నిర్మాణం, విద్యార్థుల కోసం 25 ఎకరాల విస్తీర్ణంలో 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 104 పాఠశాలలు ఒకేసారి నిర్మాణం ప్రారంభించాం.
రైతులకు తొమ్మిది రోజుల్లో 9,000 కోట్లు, మూడు నెలల్లోనే 21,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయడం, వ్యవసాయ పంపు సెట్లకు ఉచిత విద్యుత్, విద్యుత్ శాఖకు ప్రతి సంవత్సరం 12,500 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తుంది.
తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ద్వారా రాష్ట్ర జిడిపి పెరుగుదలకు దోహదపడుతోంది. గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలతో పర్యావరణ హిత విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నాం.
facebook.com/share/p/16P85PB…
#nagarjunasagarbypoll #HydropowerPlant #LiveEvent #PowerPointPresentation #RenewableEnergy #SustainablePower #VisitNagarjunaSagar #GreenEnergy #EngineeringMarvel #HydroElectricity #EnvironmentalFootprint #PowerGeneration #EnergyAwareness #CleanEnergy #VisitAndLearn #FutureOfEnergy #ManaBhattiVikramarka #TelanganaDeputyCM #BhattiVikramarka #TelanganaFinanceMinister #TelanganaEnergyMinister #CongressTelangana #BhattiForThePeople #TelanganaDevelopment #ManaCongress #leadershiptelangana