ప్రభుత్వం మనది..అధికారం మనది..అభివృద్ధి చేసేది కూడా మనమే.
మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో నేపథ్యంలో ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పోరేషన్ లో అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ..సుజాతనగర్, 20,21,22,23, పోస్టాఫీస్ సెంటర్ 24,25, 26,27,28,50 సింగరేణి మెయిన్ హాస్పటల్ సెంటర్ 10,11,12,13,49 హనుమాన్ షాప్ సెంటర్ గాజుల రాజం బస్తీ 55,56,57,58,59,60 డివిజన్లలో నిర్వహించిన ప్రచారంలో పాల్గొనడం జరిగింది.
కొత్తగూడెం కార్పోరేషన్ లో సమగ్రాభివృద్ధి చేసే సత్తా మన ప్రజా ప్రభుత్వానికి ఉంది. అధికారం మన దగ్గర ఉంటే ప్రత్యర్థులు ఏలా అభివృద్ధి చేయగలరు. ప్రజలు ఆలోచించాలి. ప్రభుత్వం మనది..అధికారం మనది.. అభివృద్ధి చేసేది కూడా మనమే. కాబట్టి ఈనెల 11వ తేదీన జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు కాంగ్రెస్ మరియు మిత్రపక్షం సిపిఎం అభ్యర్థులకు ఓట్లు వేసి మంచి మెజార్టీతో గెలిపించాలి.
కొంతమంది ఇండిపెండెంట్లు కొత్త అవతారాలు ఎత్తి నాకు శీనన్న తెలుసు, నాకు దగ్గరని మీ వద్దకు వస్తారు అలాంటి వారిని నమ్మవద్దు.. మనందరి గుర్తు ఒకటే హస్తం గుర్తు గుర్తుపెట్టుకుని ఓటువేయాలి.
మీ అందరికీ హామీ ఇస్తున్న మన ప్రజా ప్రభుత్వంలో మీ దీవెనలతో నేను మంచి స్థాయిలో మంత్రిగా ఉన్నాను.. మీకు ఇండ్లు ఇచ్చే మంత్రిని నేనే..ఇండ్ల స్థలాలు ఇచ్చే మంత్రిని నేనే..కొత్తగూడెం నియోజకవర్గానికి కూడా 3500 ఇండ్లు ఇచ్చాము, ఏప్రిల్ రెండో విడత తో పాటు ఇంకా రెండు విడతలు మంజూరు చేస్తానని తెలపడం జరిగింది.
ఈ కార్పొరేషన్ లో సంక్షేమ కార్యక్రమాలతో పాటు రోడ్లు, డ్రైన్లు, బ్రిడ్జిలు, లింక్ రోడ్లు చేయగలిగే సత్తా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది.అవి అమలు చేపించే బాధ్యత నాది.
కేవలం ఎన్నికలకు ఇంకా నాలుగు రోజుల గడువు మాత్రమే ఉంది. ప్రతి ఆడబిడ్డ ఇందిరమ్మలాగ, ఒక్కో కార్యకర్త రేవంత్ రెడ్డి, శ్రీనన్నలెక్క మీ శక్తి వంచన లేకుండా కృషి చేయాలి. అందరూ వీర సైనికుల్లా మన అభ్యర్థుల గెలుపు కోసం పని చేసి కొత్తగూడెం కార్పోరేషన్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని కొత్తగూడెం కార్పోరేషన్ మున్సిపాలిటీ ప్రజలను కోరడం జరిగింది.
#KothagudemCorporation #BhadradriKothagudem
#CongressForDevelopment #VoteForCongress
@INCTelangana